నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి.
ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు ప్లేఆఫ్కు వెళ్లిపోయేది. అలాగే బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓడిపోయుంటే ఆ జట్టు నిష్క్రమించేది, కోహ్లీ జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధించేది. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక్కడో కీలకమైన ట్విస్టు ఏంటంటే.. బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్నాయి.
ఒక దశలో ఢిల్లీ 9 మ్యాచుల్లోనే ఏడు విజయాలు సాధించింది. బెంగళూరు 10 మ్యాచుల్లోనే ఏడు గెలిచేసింది. ఢిల్లీకి మిగిలిన ఐదు మ్యాచుల్లో, బెంగళూరు ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో ఒక్కో విజయం సాధించడం పెద్ద విషయమే కాదు అనుకున్న ఈ జట్లు వరుసగా నాలుగు, మూడు మ్యాచ్ల్లో ఓడి పీకల మీదికి తెచ్చుకున్నాయి. ఇక తమ చివరి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్న నేపథ్యంలో గెలిచే జట్టు ప్లేఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఈ రెండు జట్లకూ నెట్ రన్రేట్ బాగా తక్కువే ఉంది. కాబట్టి ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చెన్నై, ముంబయిలతో తమ చివరి మ్యాచ్లు ఆడబోతున్న పంజాబ్, సన్రైజర్స్ వాటిలో గెలిచాయంటే అవే ప్లేఆఫ్కు వెళ్తాయి.
వాటితో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు జట్ల నెట్ రన్రేటే తక్కువుంది. కాబట్టి వీటి మధ్య మ్యాచ్లో ఓడే జట్టు టోర్నీ నుంచి ఔట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్కతా తలపడనుండగా.. అందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఏ జట్టు గెలిచినా ముందంజ వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే రెండు జట్ల రన్రేటూ చాలా తక్కువగా ఉంది. వీటిలో ఏది గెలిచినా.. పంజాబ్, సన్రైజర్స్లో ఏదో ఒకటి ఓడిపోవాలని, ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్లో ఓడే జట్టు రన్రేట్ తమ కంటే దిగువన ఉండాలని కోరుకుంటాయి. అప్పుడే ముందంజ వేయడానికి అవకాశముంటుంది.
This post was last modified on November 1, 2020 12:32 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…