Top Rated

ఐపీఎల్ ప్లేఆఫ్ కథలో ట్విస్ట్

నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్‌లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్‌లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి.

ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు వెళ్లిపోయేది. అలాగే బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయుంటే ఆ జట్టు నిష్క్రమించేది, కోహ్లీ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేది. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక్కడో కీలకమైన ట్విస్టు ఏంటంటే.. బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్నాయి.

ఒక దశలో ఢిల్లీ 9 మ్యాచుల్లోనే ఏడు విజయాలు సాధించింది. బెంగళూరు 10 మ్యాచుల్లోనే ఏడు గెలిచేసింది. ఢిల్లీకి మిగిలిన ఐదు మ్యాచుల్లో, బెంగళూరు ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో ఒక్కో విజయం సాధించడం పెద్ద విషయమే కాదు అనుకున్న ఈ జట్లు వరుసగా నాలుగు, మూడు మ్యాచ్‌ల్లో ఓడి పీకల మీదికి తెచ్చుకున్నాయి. ఇక తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్న నేపథ్యంలో గెలిచే జట్టు ప్లేఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఈ రెండు జట్లకూ నెట్ రన్‌రేట్ బాగా తక్కువే ఉంది. కాబట్టి ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చెన్నై, ముంబయిలతో తమ చివరి మ్యాచ్‌లు ఆడబోతున్న పంజాబ్, సన్‌రైజర్స్ వాటిలో గెలిచాయంటే అవే ప్లేఆఫ్‌కు వెళ్తాయి.

వాటితో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు జట్ల నెట్ రన్‌రేటే తక్కువుంది. కాబట్టి వీటి మధ్య మ్యా‌చ్‌లో ఓడే జట్టు టోర్నీ నుంచి ఔట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్‌కతా తలపడనుండగా.. అందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఏ జట్టు గెలిచినా ముందంజ వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే రెండు జట్ల రన్‌రేటూ చాలా తక్కువగా ఉంది. వీటిలో ఏది గెలిచినా.. పంజాబ్, సన్‌రైజర్స్‌లో ఏదో ఒకటి ఓడిపోవాలని, ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో ఓడే జట్టు రన్‌రేట్ తమ కంటే దిగువన ఉండాలని కోరుకుంటాయి. అప్పుడే ముందంజ వేయడానికి అవకాశముంటుంది.

This post was last modified on November 1, 2020 12:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: CricketIPL

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago