Top Rated

ఐపీఎల్ ప్లేఆఫ్ కథలో ట్విస్ట్

నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్‌లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్‌లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి.

ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు వెళ్లిపోయేది. అలాగే బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయుంటే ఆ జట్టు నిష్క్రమించేది, కోహ్లీ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేది. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక్కడో కీలకమైన ట్విస్టు ఏంటంటే.. బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్నాయి.

ఒక దశలో ఢిల్లీ 9 మ్యాచుల్లోనే ఏడు విజయాలు సాధించింది. బెంగళూరు 10 మ్యాచుల్లోనే ఏడు గెలిచేసింది. ఢిల్లీకి మిగిలిన ఐదు మ్యాచుల్లో, బెంగళూరు ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో ఒక్కో విజయం సాధించడం పెద్ద విషయమే కాదు అనుకున్న ఈ జట్లు వరుసగా నాలుగు, మూడు మ్యాచ్‌ల్లో ఓడి పీకల మీదికి తెచ్చుకున్నాయి. ఇక తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్న నేపథ్యంలో గెలిచే జట్టు ప్లేఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఈ రెండు జట్లకూ నెట్ రన్‌రేట్ బాగా తక్కువే ఉంది. కాబట్టి ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చెన్నై, ముంబయిలతో తమ చివరి మ్యాచ్‌లు ఆడబోతున్న పంజాబ్, సన్‌రైజర్స్ వాటిలో గెలిచాయంటే అవే ప్లేఆఫ్‌కు వెళ్తాయి.

వాటితో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు జట్ల నెట్ రన్‌రేటే తక్కువుంది. కాబట్టి వీటి మధ్య మ్యా‌చ్‌లో ఓడే జట్టు టోర్నీ నుంచి ఔట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్‌కతా తలపడనుండగా.. అందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఏ జట్టు గెలిచినా ముందంజ వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే రెండు జట్ల రన్‌రేటూ చాలా తక్కువగా ఉంది. వీటిలో ఏది గెలిచినా.. పంజాబ్, సన్‌రైజర్స్‌లో ఏదో ఒకటి ఓడిపోవాలని, ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో ఓడే జట్టు రన్‌రేట్ తమ కంటే దిగువన ఉండాలని కోరుకుంటాయి. అప్పుడే ముందంజ వేయడానికి అవకాశముంటుంది.

This post was last modified on November 1, 2020 12:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: CricketIPL

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

8 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

9 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

10 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

12 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

12 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

12 hours ago