నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి.
ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు ప్లేఆఫ్కు వెళ్లిపోయేది. అలాగే బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓడిపోయుంటే ఆ జట్టు నిష్క్రమించేది, కోహ్లీ జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధించేది. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక్కడో కీలకమైన ట్విస్టు ఏంటంటే.. బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్నాయి.
ఒక దశలో ఢిల్లీ 9 మ్యాచుల్లోనే ఏడు విజయాలు సాధించింది. బెంగళూరు 10 మ్యాచుల్లోనే ఏడు గెలిచేసింది. ఢిల్లీకి మిగిలిన ఐదు మ్యాచుల్లో, బెంగళూరు ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో ఒక్కో విజయం సాధించడం పెద్ద విషయమే కాదు అనుకున్న ఈ జట్లు వరుసగా నాలుగు, మూడు మ్యాచ్ల్లో ఓడి పీకల మీదికి తెచ్చుకున్నాయి. ఇక తమ చివరి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్న నేపథ్యంలో గెలిచే జట్టు ప్లేఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఈ రెండు జట్లకూ నెట్ రన్రేట్ బాగా తక్కువే ఉంది. కాబట్టి ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చెన్నై, ముంబయిలతో తమ చివరి మ్యాచ్లు ఆడబోతున్న పంజాబ్, సన్రైజర్స్ వాటిలో గెలిచాయంటే అవే ప్లేఆఫ్కు వెళ్తాయి.
వాటితో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు జట్ల నెట్ రన్రేటే తక్కువుంది. కాబట్టి వీటి మధ్య మ్యాచ్లో ఓడే జట్టు టోర్నీ నుంచి ఔట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్కతా తలపడనుండగా.. అందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఏ జట్టు గెలిచినా ముందంజ వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే రెండు జట్ల రన్రేటూ చాలా తక్కువగా ఉంది. వీటిలో ఏది గెలిచినా.. పంజాబ్, సన్రైజర్స్లో ఏదో ఒకటి ఓడిపోవాలని, ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్లో ఓడే జట్టు రన్రేట్ తమ కంటే దిగువన ఉండాలని కోరుకుంటాయి. అప్పుడే ముందంజ వేయడానికి అవకాశముంటుంది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…