Political News

దసరా మద్యం అమ్మకాలు: తెలంగాణలో మరో న్యూ రికార్డ్

తెలంగాణ పండుగల్లో ఉండే జోష్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దసరా పండుగ సమయంలో సుక్కా ముక్కా లేదంటే కిక్కు ఉండదనేది కొందరి అభిప్రాయం. ఈసారి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దసరా పండుగ సీజన్‌లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రూ. 1,100 కోట్లకు పైగా చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 

11వ తేదీకి ఒక్కరోజే రూ. 200.44 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వగా, 10వ తేదీన రూ. 152 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి 10 వరకు మొత్తం రూ. 852.40 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి నగరాల్లో మద్యం విక్రయాలు అత్యధికంగా ఉండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. 

దసరా పండుగ సీజన్ ముందు నుంచే మద్యం విక్రయాలు మొదలై శని, ఆదివారాల్లో మరింత ఉధృతికి చేరుకున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు కూడా ఈ టైమ్ లో అధికంగా మద్యం విక్రయించాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. పబ్బుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మద్యం విక్రయాలు రూ. 2,838 కోట్లకు చేరగా, అక్టోబర్ మొదటి పది రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు విక్రయమయ్యాయని తెలుస్తోంది.

This post was last modified on October 15, 2024 12:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

1 hour ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago