Political News

దసరా మద్యం అమ్మకాలు: తెలంగాణలో మరో న్యూ రికార్డ్

తెలంగాణ పండుగల్లో ఉండే జోష్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దసరా పండుగ సమయంలో సుక్కా ముక్కా లేదంటే కిక్కు ఉండదనేది కొందరి అభిప్రాయం. ఈసారి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దసరా పండుగ సీజన్‌లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రూ. 1,100 కోట్లకు పైగా చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 

11వ తేదీకి ఒక్కరోజే రూ. 200.44 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వగా, 10వ తేదీన రూ. 152 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి 10 వరకు మొత్తం రూ. 852.40 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి నగరాల్లో మద్యం విక్రయాలు అత్యధికంగా ఉండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. 

దసరా పండుగ సీజన్ ముందు నుంచే మద్యం విక్రయాలు మొదలై శని, ఆదివారాల్లో మరింత ఉధృతికి చేరుకున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు కూడా ఈ టైమ్ లో అధికంగా మద్యం విక్రయించాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. పబ్బుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మద్యం విక్రయాలు రూ. 2,838 కోట్లకు చేరగా, అక్టోబర్ మొదటి పది రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు విక్రయమయ్యాయని తెలుస్తోంది.

This post was last modified on October 15, 2024 12:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago