Political News

బాబు ఎత్తు.. జ‌గ‌న్ పై ఎత్తు..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎవ‌రి సొంత‌మూ కాదు. తాడి త‌న్నేవాడికి త‌ల‌త‌న్నేవాడు ఉంటాడ‌న్న‌ట్టుగా రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేసేందుకు నాయ‌కులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రాష్ట్రంలోని పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గాల‌ను కేంద్రంగా చేసుకుని ఇంచార్జులను నియ‌మించింది. త‌ద్వారా.. పార్టీపై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయేందుకు చంద్ర‌బాబు భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. ఈ వ్యూహం ఫ‌లిస్తే.. టీడీపీకి 2014 నాటి క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌నేది ఆ పార్టీ సీనియ‌ర్ల మాట‌. అంతేకాదు, ఈ ప‌రిణామం మంచిదేన‌ని.. అవ‌సాన ద‌శ‌కు చేరుతుంద‌నుకున్న పార్టీ అంబ‌రాన్నంటే దిశ‌గా దూసుకుపోవ‌డం అవ‌స‌ర‌మేన‌ని అంటున్నారు.

మ‌రి ప్ర‌త్య‌ర్థి పార్టీ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తే.. అధికార ప‌క్షం చూస్తూ కూర్చుంటుందా? ఎత్తుకు పైఎత్తు వేయ‌కుండా ఉంటుందా? అంటే.. ఉండ‌ద‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. సీఎం జ‌గ‌న్ కూడా వైసీపీని మ‌రింత బ‌లోపేతం కాదుకాదు.. ప‌టిష్ఠం చేసే దిశ‌గా అడుగులు వ్యూహాలు వేస్తున్నారు. ఈ సారి ఆయ‌న జిల్లాల‌పై ఫోక‌స్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా జ‌రిగిన కీల‌క మంత్రుల స‌మావేశంలో టీడీపీ నియ‌మించిన పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌ల అంశం ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో మంచి ఊపు తెస్తున్నాయ‌ని బొత్స‌, పెద్దిరెడ్డి వంటి సీనియ‌ర్ మంత్రులు వెల్లడించారు.

ఇక‌, స్పంద‌న కార్య‌క్ర‌మం కూడా విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రుగుతోంద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌థ‌కాలకు, పార్టీ వ్యూహాల‌కు మధ్య తేడా ఉంటుంద‌ని, ప‌థ‌కాల దారి ప‌థ‌కాల‌దే.. పార్టీ దారి పార్టీదేన‌ని సీఎం చెప్పిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక వ‌ర్గాలు, వివిధ వృత్తుల‌ను చేసుకునేవారికి అమ‌లు చేసిన ప‌థ‌కాల అంశం ప్ర‌ధానంగా ప్ర‌చారం చేస్తూనే.. జిల్లాల‌పై ప్ర‌త్యేకంగా దృస్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. దీనిలో భాగంగా.. ప్ర‌తి జిల్లాలోనూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న అమ‌లు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

అంటే.. ఇప్ప‌టి వర‌కు కొన్ని ద‌శాబ్దాలుగా స‌మ‌స్య‌లుగా ఉన్న వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ట్టు తెలిసింది. దీనికి గాను సుమారు.. 500 కోట్ల‌ను వ‌చ్చే రెండు మూడు మాసాల్లో కేటాయించే అవ‌కాశం ఉంద‌ని.. ఫ‌లితంగా వైసీపీ దూకుడును మ‌రింత పెంచేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా.. టీడీపీ ప్ర‌భుత్వం గ‌తంలో చేస్తామ‌ని చెప్పి చేయ‌కుండా వ‌దిలేసిన ప‌నుల‌ను ఇప్పుడు యుద్ధ ప్రాతిప‌దిక‌న చేయ‌డం ద్వారా వైసీపీకి జిల్లాల‌ను మ‌రింత‌గా క‌నెక్ట్ చేయాల‌నేది వ్యూహంగా ఉంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి రాజ‌కీయాల్లో వ్యూహానికి ప్ర‌తివ్యూహం ఏ రేంజ్‌లో అయినా ఉండొచ్చ‌ని అంటున్నారు నాయ‌కులు.

This post was last modified on September 30, 2020 11:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

4 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

27 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

50 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

1 hour ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago