Political News

జై శ్రీరామ్…నా నిబద్ధతకు ప్రతిబింబం ఈ తీర్పు:అద్వానీ

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో ప్రత్యేక సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతీ, బీజేపీ నేత కల్యాణ్ సింగ్ సహా ఈ కేసులో నిందితులంతా నిర్దోషులను తీర్పునిచ్చారు.

వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసులో సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై ఎల్ కే అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత నిబద్ధతకు ఈ తీర్పు ప్రతిబింబమని అద్వానీ అన్నారు.

`‘జైశ్రీరాం…చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందింది…ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా“అని అద్వానీ అన్నారు. ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైందని, తీర్పు వెలువడిన సమయం తమకు సంతోషకరమైన క్షణం అని హర్షం వ్యక్తం చేశారు. రామ జన్మభూమి ఉద్యమం పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతకు ఈ తీర్పు ప్రతిబింబం అని అద్వానీ అన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు.
డిసెంబర్ 6 న అయోధ్యలో జరిగిన ఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని ఈ తీర్పు రుజువు చేస్తోందని, తాము చేపట్టిన ర్యాలీల్లో, కార్యక్రమాల్లో కుట్ర లేదని తెలిపారు. ఈ తీర్పుతో తాము చాలా సంతోషంగా ఉన్నామని, అందరూ రామ మందిర నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నామని మనోషర్ జోషి సంతోషం వ్యక్తం చేశారు. వయసు రీత్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు కోర్టుకు రావాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి చెప్పడంతో వీరిద్దరూ హాజరుకాని సంగత తెలిసిందే.

This post was last modified on September 30, 2020 5:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago