అక్టోబరు 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తొలుత చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు. అనంతరం ఓ మొక్కను నాటారు. ఈ సమయంలోనే ఆయన పారిశుద్ధ్య కార్మికులతోనూ భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
రెండు సంచలన నిర్ణయాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. వీటిలో 1) నేటి నుంచి (అక్టోబరు 2) చెత్త పై విధిస్తున్న పన్నును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తపై పన్నును ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కడా వసూలు చేయబోమన్నారు. గృహ , వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కూడా చెత్తపన్ను ఇకపై ఉండబోదన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అందరినీ పీక్కుతిందని ఈ సందర్భంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఇక, 2) ఆంధ్ర జాతీయ కళాశాలకు.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరును పెట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కొందరు స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. తమ ప్రభుత్వం దాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్యకళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు.
మోడీకి థ్యాంక్స్!
కాగా, ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్న చంద్రబాబు.. దీనికి గాను స్వయంగా తాను థ్యాంక్స్ చెబుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా మోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్లో స్వచ్ఛభారత్పై ఉపసంఘానినిక తాను చైర్మన్గా ఉన్నానని గుర్తు చేశారు. కాగా, మోడీ స్పూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా అందరూ పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 2, 2024 4:47 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…