Political News

‘బాబ్రీ’ కేసులో నిందితులంతా నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా 49 మంది నిందితులు నిర్దోషులేనని లక్నో సీబీఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కాబట్టి నిందితులంతా నిర్దోషులేనని కోర్టు ప్రకటించింది. వారంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని, అందుకే కేసు కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. అయితే, రకరకాల కారణాల వల్ల బ్రతికి ఉన్న 32 మంది నిందితులలో 11 మంది హాజరుకాలేదు.

ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులుండగా విచారణ సమయంలో 17 మంది మృతి చెందారు. 92 సంవత్సరాల అద్వానీ, 86 ఏళ్ల జోషిలకు, వారి వృద్ధాప్యం దృష్ట్యా, కోర్టుకు రానవసరం లేదని ఇప్పటికే న్యాయమూర్తి తెలిపారు. ఇక ఉమాభారతికి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. మరో సీనియర్ నేత కల్యాణ్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.

1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన ఘటన పెను సంచలనం రేపింది. అద్వానీ చేపట్టిన రథయాత్ర, ఆపై 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, దాని తరువాత జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 వేల మంది ప్రాణాలను కోల్పోయారు.

అద్వానీ మురళీమనోహర్‌ జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్‌పరివార్‌ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత కొన్నేళ్ల కింద పలువురు నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను సీబీఐ న్యాయస్థానం తొలగించింది. అయితే, ఆ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ అభియోగాలను కొనసాగించి విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసుపై విచారణ జరిపిన లక్నో సీబీఐ కోర్టు…. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని తీర్పునిచ్చింది.

This post was last modified on September 30, 2020 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

49 minutes ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

1 hour ago

అన్నగారి విడుదలకు రూటు దొరికింది

వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…

2 hours ago

చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన…

2 hours ago

శుభ సంక‌ల్పం: రెండు రాష్ట్రాల మ‌ధ్య కొత్త స్నేహం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని…

2 hours ago

‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది

ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది.…

2 hours ago