దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేతలో బిజెపి ప్రముఖులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరితో పాటు సాద్వీ రీతంబరి, వినయ్ కటియార్, పవన్ పాండేతో పాటు మరో 20 మంది ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే బాలా సాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్ లాంటి మరో పదిహేనుమంది మరణించారు. మసీదు కూల్చివేతకు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఉమా భారతి లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు పూనుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు.
వెంటనే ఘటనపై కేంద్రప్రభుత్వం స్ధానిక పోలీసులతో విచారణ చేయించింది. దీనిపై ఆరోపణలు రావటంతో తర్వాత సిబిసీఐడీతో విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో కూడా దేశంలోని అన్నీ వైపుల నుండి కేంద్రంపై విమర్శలు మొదలవ్వటంతో చేసేది లేక చివరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిపై సిబిఐ న్యాయస్ధానం కేసులను ఎత్తేసింది. అయితే ఈ విషయమై కొందరు సుప్రింకోర్టులో కేసు వేయటంతో మళ్ళీ అందరిపైనా కేసులు కంటిన్యు అయ్యాయి. తన విచారణలో సిబిఐ 49 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అనేకసార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.
దాదాపు పాతిక సంవత్సరాల విచారణ తర్వాత చివరి తీర్పు ఈరోజు వెలువడుతోంది. తీర్పు చెప్పే సమయంలో నిందితులందరు కోర్టులోనే ఉండాలని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే కొందరికి కరోనా వైరస్ సోకటం అద్వానీ, జోషి లాంటి వాళ్ళకు వయస్సయిపోవటం కారణంగా వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇచ్చింది. అందుకనే బిజెపితో పాటు కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on September 30, 2020 1:15 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…