Political News

ఈరోజు బీజేపీకి అత్యంత కీలకం

దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేతలో బిజెపి ప్రముఖులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వీరితో పాటు సాద్వీ రీతంబరి, వినయ్ కటియార్, పవన్ పాండేతో పాటు మరో 20 మంది ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే బాలా సాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్ లాంటి మరో పదిహేనుమంది మరణించారు. మసీదు కూల్చివేతకు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఉమా భారతి లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు పూనుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు.

వెంటనే ఘటనపై కేంద్రప్రభుత్వం స్ధానిక పోలీసులతో విచారణ చేయించింది. దీనిపై ఆరోపణలు రావటంతో తర్వాత సిబిసీఐడీతో విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో కూడా దేశంలోని అన్నీ వైపుల నుండి కేంద్రంపై విమర్శలు మొదలవ్వటంతో చేసేది లేక చివరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిపై సిబిఐ న్యాయస్ధానం కేసులను ఎత్తేసింది. అయితే ఈ విషయమై కొందరు సుప్రింకోర్టులో కేసు వేయటంతో మళ్ళీ అందరిపైనా కేసులు కంటిన్యు అయ్యాయి. తన విచారణలో సిబిఐ 49 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అనేకసార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.

దాదాపు పాతిక సంవత్సరాల విచారణ తర్వాత చివరి తీర్పు ఈరోజు వెలువడుతోంది. తీర్పు చెప్పే సమయంలో నిందితులందరు కోర్టులోనే ఉండాలని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే కొందరికి కరోనా వైరస్ సోకటం అద్వానీ, జోషి లాంటి వాళ్ళకు వయస్సయిపోవటం కారణంగా వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇచ్చింది. అందుకనే బిజెపితో పాటు కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on September 30, 2020 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

5 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

12 hours ago