దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేతలో బిజెపి ప్రముఖులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరితో పాటు సాద్వీ రీతంబరి, వినయ్ కటియార్, పవన్ పాండేతో పాటు మరో 20 మంది ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే బాలా సాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్ లాంటి మరో పదిహేనుమంది మరణించారు. మసీదు కూల్చివేతకు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఉమా భారతి లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు పూనుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు.
వెంటనే ఘటనపై కేంద్రప్రభుత్వం స్ధానిక పోలీసులతో విచారణ చేయించింది. దీనిపై ఆరోపణలు రావటంతో తర్వాత సిబిసీఐడీతో విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో కూడా దేశంలోని అన్నీ వైపుల నుండి కేంద్రంపై విమర్శలు మొదలవ్వటంతో చేసేది లేక చివరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిపై సిబిఐ న్యాయస్ధానం కేసులను ఎత్తేసింది. అయితే ఈ విషయమై కొందరు సుప్రింకోర్టులో కేసు వేయటంతో మళ్ళీ అందరిపైనా కేసులు కంటిన్యు అయ్యాయి. తన విచారణలో సిబిఐ 49 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అనేకసార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.
దాదాపు పాతిక సంవత్సరాల విచారణ తర్వాత చివరి తీర్పు ఈరోజు వెలువడుతోంది. తీర్పు చెప్పే సమయంలో నిందితులందరు కోర్టులోనే ఉండాలని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే కొందరికి కరోనా వైరస్ సోకటం అద్వానీ, జోషి లాంటి వాళ్ళకు వయస్సయిపోవటం కారణంగా వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇచ్చింది. అందుకనే బిజెపితో పాటు కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on September 30, 2020 1:15 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…