Political News

ఈరోజు బీజేపీకి అత్యంత కీలకం

దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేతలో బిజెపి ప్రముఖులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వీరితో పాటు సాద్వీ రీతంబరి, వినయ్ కటియార్, పవన్ పాండేతో పాటు మరో 20 మంది ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే బాలా సాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్ లాంటి మరో పదిహేనుమంది మరణించారు. మసీదు కూల్చివేతకు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఉమా భారతి లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు పూనుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు.

వెంటనే ఘటనపై కేంద్రప్రభుత్వం స్ధానిక పోలీసులతో విచారణ చేయించింది. దీనిపై ఆరోపణలు రావటంతో తర్వాత సిబిసీఐడీతో విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో కూడా దేశంలోని అన్నీ వైపుల నుండి కేంద్రంపై విమర్శలు మొదలవ్వటంతో చేసేది లేక చివరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిపై సిబిఐ న్యాయస్ధానం కేసులను ఎత్తేసింది. అయితే ఈ విషయమై కొందరు సుప్రింకోర్టులో కేసు వేయటంతో మళ్ళీ అందరిపైనా కేసులు కంటిన్యు అయ్యాయి. తన విచారణలో సిబిఐ 49 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అనేకసార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.

దాదాపు పాతిక సంవత్సరాల విచారణ తర్వాత చివరి తీర్పు ఈరోజు వెలువడుతోంది. తీర్పు చెప్పే సమయంలో నిందితులందరు కోర్టులోనే ఉండాలని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే కొందరికి కరోనా వైరస్ సోకటం అద్వానీ, జోషి లాంటి వాళ్ళకు వయస్సయిపోవటం కారణంగా వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇచ్చింది. అందుకనే బిజెపితో పాటు కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on September 30, 2020 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago