ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి-అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోడీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కూడా ప్రధాని మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు.
అయితే.. మోడీ రాకపై అధికార డెమొక్రాట్ల కంటే కూడా.. ప్రతిపక్ష రిపబ్లికన్లకే ఎక్కువగా ఆశలు ఉన్నా యి. తమ నాయకుడు ట్రంప్ను గెలిపించేందుకు మోడీ వస్తున్నారంటూ.. ఆయన పర్యటనకు ముందే.. రిపబ్లికన్లు ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ కూడా తన మిత్రుడు(మోడీ) వస్తున్నాడని.. తనకు తిరుగు లేదని చెప్పుకొచ్చారు. మరి మోడీ మనసు మాత్రం వేరేగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మోడీ అసలు ట్రంప్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
పైగా.. ప్రధాని మోడీకి.. అమెరికా ప్రస్తుత అధ్యక్షడు జోబైడెన్ కనీ వినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం ఇచ్చారు. చేతిలో చేయి వేసి మరీ మోడీని ఇంట్లోకి స్వాగతించారు. ఇల్లంతా చూపించారు. స్వయంగా టీ కాచి ఇచ్చారు. ఇద్దరూ నవ్వుతూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పరిణామాల వెనుక.. బైడెన్ చాలా వ్యూహాత్మకంగా మోడీని తన గాటన కట్టేసుకునేందుకు ప్రయత్నించారనేది అంతర్జాతీయ మీడియా కథనం. పోనీ.. మోడీ ఏమైనా దీనికి దూరంగా ఉన్నారా ? అంటే అది కూడా లేదు.
ఆయన కూడా బైడెన్ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న కమల హ్యారిస్ పేరు ఎత్తకపోయినా..బైడెన్ను ఆకాశానికి ఎత్తేయడం.. ఆయన హయాంను స్వర్గతుల్యమని పేర్కొనడం ద్వారా.. ప్రస్తుత అధికార పార్టీ డెమొక్రాట్లకే తన మద్దతు ఉందని పరోక్షంగా ప్రధాన మంత్రి చెప్పినట్టు అయింది. అంటే.. ఒకరకంగా, ఆయన కమల వైపే నిలబడ్డారన్నది అంతర్జాతీయ మీడియా చెబుతున్న మాట. సుమారు 4 లక్షల పైగా ఉన్న భారతీయ ఓటర్లపై మోడీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఇది ట్రంప్పై తీవ్ర దెబ్బవేస్తుందన్నది వారు చెబుతున్న మాట.
This post was last modified on September 23, 2024 2:37 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…