ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి-అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోడీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కూడా ప్రధాని మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు.
అయితే.. మోడీ రాకపై అధికార డెమొక్రాట్ల కంటే కూడా.. ప్రతిపక్ష రిపబ్లికన్లకే ఎక్కువగా ఆశలు ఉన్నా యి. తమ నాయకుడు ట్రంప్ను గెలిపించేందుకు మోడీ వస్తున్నారంటూ.. ఆయన పర్యటనకు ముందే.. రిపబ్లికన్లు ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ కూడా తన మిత్రుడు(మోడీ) వస్తున్నాడని.. తనకు తిరుగు లేదని చెప్పుకొచ్చారు. మరి మోడీ మనసు మాత్రం వేరేగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మోడీ అసలు ట్రంప్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
పైగా.. ప్రధాని మోడీకి.. అమెరికా ప్రస్తుత అధ్యక్షడు జోబైడెన్ కనీ వినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం ఇచ్చారు. చేతిలో చేయి వేసి మరీ మోడీని ఇంట్లోకి స్వాగతించారు. ఇల్లంతా చూపించారు. స్వయంగా టీ కాచి ఇచ్చారు. ఇద్దరూ నవ్వుతూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పరిణామాల వెనుక.. బైడెన్ చాలా వ్యూహాత్మకంగా మోడీని తన గాటన కట్టేసుకునేందుకు ప్రయత్నించారనేది అంతర్జాతీయ మీడియా కథనం. పోనీ.. మోడీ ఏమైనా దీనికి దూరంగా ఉన్నారా ? అంటే అది కూడా లేదు.
ఆయన కూడా బైడెన్ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న కమల హ్యారిస్ పేరు ఎత్తకపోయినా..బైడెన్ను ఆకాశానికి ఎత్తేయడం.. ఆయన హయాంను స్వర్గతుల్యమని పేర్కొనడం ద్వారా.. ప్రస్తుత అధికార పార్టీ డెమొక్రాట్లకే తన మద్దతు ఉందని పరోక్షంగా ప్రధాన మంత్రి చెప్పినట్టు అయింది. అంటే.. ఒకరకంగా, ఆయన కమల వైపే నిలబడ్డారన్నది అంతర్జాతీయ మీడియా చెబుతున్న మాట. సుమారు 4 లక్షల పైగా ఉన్న భారతీయ ఓటర్లపై మోడీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఇది ట్రంప్పై తీవ్ర దెబ్బవేస్తుందన్నది వారు చెబుతున్న మాట.
This post was last modified on September 23, 2024 2:37 pm
ప్రస్తుతం భారతీయ క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్…
టాలీవుడ్లో చాలామంది హీరోలకు పేర్ల వెనుక ‘ట్యాగ్స్’ ఉన్నాయి. అందులో కొన్ని అభిమానులు ఇచ్చినవి అయితే.. కొన్ని ఆ హీరోలను…
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను…
ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు.…
తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యిని ఉపయోగించిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే.…
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఈ మధ్య ఎంతో ఇష్టపడి ఓ నవలకు సంబంధించి హక్కులు కొనుక్కోగా.. ఆ నవలలోని…