Political News

లడ్డు గొడవ.. వైసీపీని ఎందుకు నమ్మట్లేదు?

గ‌త ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా తిరుమ‌ల ల‌డ్డు నాణ్య‌త ప‌డిపోయింద‌ని.. ల‌డ్డు త‌యారీలో వాడిన నెయ్య‌లో జంతు కొవ్వు అవ‌శేషాలు ఉన్నాయ‌ని కొత్త అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తిరుమ‌ల శ్రీవారిని దేశ‌వ్యాప్తంగా కోట్ల మంది కొలుస్తారు. ఇక్క‌డి ల‌డ్డును ప‌ర‌మ ప‌విత్రంగా భావిస్తారు. దాని విష‌యంలో త‌ప్పు జ‌రిగింద‌నేస‌రికి భ‌క్తులు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

ఈ విష‌యంలో వైసీపీ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ స‌హా ఎవ‌రి వాదనా త‌ర్కానికి నిల‌బ‌డ‌ట్లేదు. ఈ వ్య‌వ‌హారం వైసీపీకి పెద్ద డ్యామేజే చేసేలా క‌నిపిస్తోంది. వైసీపీ ఎంత‌గా వాదిస్తున్నా జ‌నం ఆ పార్టీ వైపు లేక‌పోవ‌డానికి, కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను న‌మ్ముతుండ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన అనేక ప‌రిణామాలు అందుకు కార‌ణం.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క‌ర్ణాట‌క మిల్క్ ఫెడ‌రేష‌న్ 50 ఏళ్ల నుంచి స‌ర‌ఫ‌రా చేస్తున్న నాణ్య‌మైన నందిని నెయ్యి కాంట్రాక్టును ఆపేశారు. అది ప్ర‌భుత్వ రంగ సంస్థ. లాభాల కోసం నాణ్య‌త విష‌యంలో రాజీ పడేందుకు ఆస్కార‌ముండ‌దు. అలాంటి సంస్థ‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పించ‌డంతో క‌మిష‌న్ల కోసమే అన్న అభిప్రాయం అప్పుడే ఏర్ప‌డింది. త‌క్కువ ధ‌ర‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన ప్రైవేటు సంస్థ నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డి ఉంటుంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది.

ఇక తిరుమ‌ల‌లో వైసీపీ హ‌యాంలో తీసుకున్న అనేక నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. నీళ్ల బాటిళ్ల ధర‌ను 50 రూపాయ‌ల‌కు పెంచ‌డం.. ఆర్జిత సేవ‌ల ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచ‌డం.. ద‌ర్శ‌న ఏర్పాట్లు అస్త‌వ్య‌స్తంగా మార‌డం, ఇత‌ర సౌక‌ర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం, శ్రీవారి ఆల‌యంలో జ‌గ‌న్ నినాదాలు చేయ‌డం.. అన్య‌మ‌త‌స్థులు ప‌ద‌వులు చేప‌ట్ట‌డం, అన్య‌మ‌త ప్ర‌చారం కూడా జ‌ర‌గ‌డం.. ఇలా తిరుమ‌ల‌లో వివాదాస్ప‌ద‌మైన అంశాలు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికీ మించి ల‌డ్డు నాణ్య‌త త‌గ్గింద‌నే అభిప్రాయం గ‌తంలోనే చాలామంది వ్య‌క్తం చేశారు. సామాన్య భ‌క్తులకు ఈ విష‌యంలో ముందు నుంచే అభ్యంత‌రాలుండ‌డంతో ఇప్పుడు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదే వైసీపీకి ప్ర‌తికూలంగా మారింది.

This post was last modified on September 21, 2024 5:59 am

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

34 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

52 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago