Political News

లడ్డు గొడవ.. వైసీపీని ఎందుకు నమ్మట్లేదు?

గ‌త ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా తిరుమ‌ల ల‌డ్డు నాణ్య‌త ప‌డిపోయింద‌ని.. ల‌డ్డు త‌యారీలో వాడిన నెయ్య‌లో జంతు కొవ్వు అవ‌శేషాలు ఉన్నాయ‌ని కొత్త అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తిరుమ‌ల శ్రీవారిని దేశ‌వ్యాప్తంగా కోట్ల మంది కొలుస్తారు. ఇక్క‌డి ల‌డ్డును ప‌ర‌మ ప‌విత్రంగా భావిస్తారు. దాని విష‌యంలో త‌ప్పు జ‌రిగింద‌నేస‌రికి భ‌క్తులు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

ఈ విష‌యంలో వైసీపీ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ స‌హా ఎవ‌రి వాదనా త‌ర్కానికి నిల‌బ‌డ‌ట్లేదు. ఈ వ్య‌వ‌హారం వైసీపీకి పెద్ద డ్యామేజే చేసేలా క‌నిపిస్తోంది. వైసీపీ ఎంత‌గా వాదిస్తున్నా జ‌నం ఆ పార్టీ వైపు లేక‌పోవ‌డానికి, కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను న‌మ్ముతుండ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన అనేక ప‌రిణామాలు అందుకు కార‌ణం.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క‌ర్ణాట‌క మిల్క్ ఫెడ‌రేష‌న్ 50 ఏళ్ల నుంచి స‌ర‌ఫ‌రా చేస్తున్న నాణ్య‌మైన నందిని నెయ్యి కాంట్రాక్టును ఆపేశారు. అది ప్ర‌భుత్వ రంగ సంస్థ. లాభాల కోసం నాణ్య‌త విష‌యంలో రాజీ పడేందుకు ఆస్కార‌ముండ‌దు. అలాంటి సంస్థ‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పించ‌డంతో క‌మిష‌న్ల కోసమే అన్న అభిప్రాయం అప్పుడే ఏర్ప‌డింది. త‌క్కువ ధ‌ర‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన ప్రైవేటు సంస్థ నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డి ఉంటుంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది.

ఇక తిరుమ‌ల‌లో వైసీపీ హ‌యాంలో తీసుకున్న అనేక నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. నీళ్ల బాటిళ్ల ధర‌ను 50 రూపాయ‌ల‌కు పెంచ‌డం.. ఆర్జిత సేవ‌ల ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచ‌డం.. ద‌ర్శ‌న ఏర్పాట్లు అస్త‌వ్య‌స్తంగా మార‌డం, ఇత‌ర సౌక‌ర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం, శ్రీవారి ఆల‌యంలో జ‌గ‌న్ నినాదాలు చేయ‌డం.. అన్య‌మ‌త‌స్థులు ప‌ద‌వులు చేప‌ట్ట‌డం, అన్య‌మ‌త ప్ర‌చారం కూడా జ‌ర‌గ‌డం.. ఇలా తిరుమ‌ల‌లో వివాదాస్ప‌ద‌మైన అంశాలు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికీ మించి ల‌డ్డు నాణ్య‌త త‌గ్గింద‌నే అభిప్రాయం గ‌తంలోనే చాలామంది వ్య‌క్తం చేశారు. సామాన్య భ‌క్తులకు ఈ విష‌యంలో ముందు నుంచే అభ్యంత‌రాలుండ‌డంతో ఇప్పుడు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదే వైసీపీకి ప్ర‌తికూలంగా మారింది.

This post was last modified on September 21, 2024 5:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago