చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ కరోనా చేసిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఈ ప్రభావం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగబోతోందని అర్థమైంది. ఉద్దేశపూర్వకమో కాదో కానీ.. ఈ వైరస్తో భారత్ను చైనా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఐతే ఇప్పుడు మరో చైనా వైరస్ భారత్కు ముప్పుగా పరిణమించే ప్రమాదమున్నట్లు సంకేతాలందుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
క్యాట్ క్యూ వైరస్ (సీక్యూవీ) అనే కొత్త ప్రమాదం భారత్ను తాకే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ ఇప్పుడు చైనాలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్కు కూడా ముప్ప పొంచి ఉందని ఐసీఎంఆర్ అంటోంది. ఆర్ద్రోపోడ్ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకుని ఈ వైరస్ వ్యాప్తిస్తుందని.. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్లు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మన దేశంలో ప్రధానంగా పందుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందొచ్చని హెచ్చరించింది. వీటితో పాటు కొన్ని రకాల దోమల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని అంది. అంతర్జాతీయ ప్రయాణాలు నడుస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఈ వైరస్ వివిధ దేశాలకు పాకే ప్రమాదం ఉందని.. కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐతే ఈ వైరస్ అంటు వ్యాధా కాదా.. ఇదెంత ప్రమాదకరం అన్నది ఐసీఎంఆర్ వివరించలేదు.
This post was last modified on September 29, 2020 9:38 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…