Political News

భారత్‌కు పొంచి ఉన్న మరో వైరస్ గండం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్‌లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ కరోనా చేసిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఈ ప్రభావం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగబోతోందని అర్థమైంది. ఉద్దేశపూర్వకమో కాదో కానీ.. ఈ వైరస్‌తో భారత్‌ను చైనా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఐతే ఇప్పుడు మరో చైనా వైరస్‌ భారత్‌‌కు ముప్పుగా పరిణమించే ప్రమాదమున్నట్లు సంకేతాలందుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

క్యాట్ క్యూ వైరస్ (సీక్యూవీ) అనే కొత్త ప్రమాదం భారత్‌ను తాకే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ ఇప్పుడు చైనాలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌కు కూడా ముప్ప పొంచి ఉందని ఐసీఎంఆర్ అంటోంది. ఆర్ద్రోపోడ్ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకుని ఈ వైరస్ వ్యాప్తిస్తుందని.. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్‌లు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మన దేశంలో ప్రధానంగా పందుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందొచ్చని హెచ్చరించింది. వీటితో పాటు కొన్ని రకాల దోమల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని అంది. అంతర్జాతీయ ప్రయాణాలు నడుస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఈ వైరస్ వివిధ దేశాలకు పాకే ప్రమాదం ఉందని.. కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐతే ఈ వైరస్ అంటు వ్యాధా కాదా.. ఇదెంత ప్రమాదకరం అన్నది ఐసీఎంఆర్ వివరించలేదు.

This post was last modified on September 29, 2020 9:38 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

47 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago