చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ కరోనా చేసిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఈ ప్రభావం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగబోతోందని అర్థమైంది. ఉద్దేశపూర్వకమో కాదో కానీ.. ఈ వైరస్తో భారత్ను చైనా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఐతే ఇప్పుడు మరో చైనా వైరస్ భారత్కు ముప్పుగా పరిణమించే ప్రమాదమున్నట్లు సంకేతాలందుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
క్యాట్ క్యూ వైరస్ (సీక్యూవీ) అనే కొత్త ప్రమాదం భారత్ను తాకే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ ఇప్పుడు చైనాలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్కు కూడా ముప్ప పొంచి ఉందని ఐసీఎంఆర్ అంటోంది. ఆర్ద్రోపోడ్ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకుని ఈ వైరస్ వ్యాప్తిస్తుందని.. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్లు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మన దేశంలో ప్రధానంగా పందుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందొచ్చని హెచ్చరించింది. వీటితో పాటు కొన్ని రకాల దోమల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని అంది. అంతర్జాతీయ ప్రయాణాలు నడుస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఈ వైరస్ వివిధ దేశాలకు పాకే ప్రమాదం ఉందని.. కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐతే ఈ వైరస్ అంటు వ్యాధా కాదా.. ఇదెంత ప్రమాదకరం అన్నది ఐసీఎంఆర్ వివరించలేదు.
This post was last modified on September 29, 2020 9:38 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…