Political News

టిడిపి, వైసిపిపై బిజెపి కేసులు పెడుతుందా ?

తమపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్న తెలుగుదేశంపార్టీ, వైసిపిలపై సైబర్ చట్టాల క్రింద కేసులు పెట్టాలని బిజెపి డిసైడ్ చేసింది. తమ పార్టీతో పాటు నేతలపై పై పార్టీలు కావాలనే వాట్సప్, వెబ్ సైట్ల ఆధారంగా బురద చల్లుతున్నట్లు బిజెపి నేతలు మండిపడుతున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో మిషన్ ఏపి పేరుతో వాట్సప్ లో ఏర్పడిన ఓ గ్రూపు ద్వారా తమపై బురద చల్లుతున్నట్లు బిజెపి గుర్తించింది. అలాగే మరో మూడు వెబ్ సైట్లతో పాటు యూట్యూబ్ ఛానళ్ళను కూడా గుర్తించినట్లు సమాచారం.

నిజానికి రాష్ట్ర రాజకీయాలంతా పూర్తి అయమయంగా నడుస్తున్నాయి. ఎవరికి ఎవరు ప్రత్యర్ధులో మిత్రులో కూడా జనాలకు తెలీటం లేదు. వైసిపి, టిడిపి విషయంలో జనాలకున్న క్లారిటి బిజెపి, జనసేన విషయంలో లేదన్నది వాస్తవం. నిజానికి బిజెపి, జనసేన కూడా అధికారపార్టీకి ప్రత్యర్ధి పార్టీలనే అనే చెప్పాలి. ఇదే సమయంలో టిడిపికి కూడా ప్రత్యర్ధిగా చెప్పటంలో సందేహం లేదు.

కానీ వివిధ కారణాల వల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీని ఒక్కమాట కూడా అనటం లేదు. పైగా మొన్నటి వరకు చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఇదే సమయంలో బిజెపి అధ్యక్షునిగా ఉన్నంత కాలం కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అయితే కన్నా స్ధానంలో సోము వీర్రాజు బాధ్యతలు తీసుకోవటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. అయితే వీర్రాజు రావటం రావటమే చంద్రబాబుపై విరుచుకుపడుతు టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని వీర్రాజు బాహాటంగా చెప్పే చేస్తున్నారు. దీని కారణంగా టిడిపి, బిజెపిలు ఇక ప్రత్యర్ధి పార్టీలే అనే అభిప్రాయం మొదలైంది.

అయితే బిజెపిలోని పురంధేశ్వరి లాంటి నేతలు కొందరు చేసిన తాజా వ్యాఖ్యలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. అందుకనే వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి స్పందిస్తు పురంధేశ్వరి వ్యాఖ్యలు జాతీయ నాయకురాలిగా కాకుండా జాతి నాయకురాలిగా మాత్రమే ఉందంటూ మండిపడింది. ఇలా రకరకాల కాంబినేషన్లు ఏపి రాజకీయాలు రంజుగా రోజుకోరకంగా మారిపోతోంది. దీంతో జనాల్లో అయితే కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ఇటువంటి నేపధ్యంలోనే వైసిపి, టిడిపి రెండింటిపైన తాము సైబర్ చట్టం క్రింద చర్యలు తీసుకుంటామని బిజెపి ప్రకటించటం ఆసక్తిగా మారింది. చూద్దాం ఎవరిపై ఎవరు చర్యలు తీసుకుంటారో ?

This post was last modified on September 29, 2020 3:03 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

9 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

10 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

14 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

14 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

14 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

15 hours ago