Political News

కీల‌క ప‌థ‌కాల‌కు బ్రేకులు.. జ‌గ‌న్ ముందున్న వ్యూహం ఏంటి?

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. కీల‌క ప‌థ‌కాలు నిలిచిపోయాయి. ఏం చేయాలన్నా.. ఎక్క‌డ ఎలాంటి బ్రేకు ప‌డుతుందో.. ఎటు వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు చుట్టుముడ‌తాయోన‌ని పార్టీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. ఏడాదిన్నర పూర్త‌యినా.. ఆయ‌న సంక‌ల్పించిన ప‌థ‌కాల‌న్నీ ప‌రిపూర్ణంగా అమ‌లులోకి వ‌చ్చి ఉంటే.. ఇది ప‌దేళ్ల పాల‌న‌తో స‌మాన‌మ‌ని మేధావులు అంటున్నారు. కానీ, అలా సాగ‌డం లేదు.. కొన్ని శ‌క్తులు అలా సాగ‌నివ్వ‌డ‌మూ లేదు. ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న ప‌థ‌కాల్లో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, రైతు భ‌రోసా కేంద్రాలు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు వంటివి గొప్ప‌గా ఉన్నాయి.

కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిగా అమ‌లుకు నోచుకుని ఉంటే.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వేగం.. మ‌రో రూపంలో ఉండేద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న నిలిచిపోయింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో.. ఆంగ్ల మాధ్య‌మం అడుగులు ముందుకు సాగ‌డం లేదు. పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కం కూడా ఎక్క‌డి గొంగళి అక్క‌డే అన్న‌చందంగా మారింది. ఇక‌, శాస‌న మండ‌లి ర‌ద్దు కూడా ఇలానే ఉంది. జిల్లాల విభ‌జ‌న ఏర్పాటు వ‌చ్చే ఏడాదికి అయితే అయిన‌ట్టే. పోల‌వ‌రం నిర్మాణం కూడా ముందుకా వెన‌క్కా.. అన్న‌ట్టుగానే సాగుతోంది. మ‌రీముఖ్యంగా సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, గండికోట రిజ‌ర్వాయ్‌.. వంటివి కూడా స‌వాలుగా మారాయి.

నిజానికి వీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగి ఉంటే.. పార్టీ ప‌రిస్థితి, ప్ర‌భుత్వ ప‌రిస్థితి కూడా వేగంగా ఉండేద‌ని అంటున్నారు. కానీ, వీటిలో కొన్నిన్యాయ‌ప‌రంగా.. ఆగిపోగా.. మ‌రికొన్ని కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం లేని కార‌ణంగా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఏంచేయాలి. మ‌రో మూడేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీనిలోనూ చివ‌రి ఆరు మాసాలు కూడా ఎన్నిక‌ల హ‌డావుడితోనే స‌మ‌యం గ‌డిచిపోతుంది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవాలి? ఎలా ముందుకు సాగాలి? అనే చ‌ర్చ వైసీపీలో ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకురావ‌డంతోపాటు.. నేరుగా సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. సాగుతున్న మాట వాస్త‌వం.

This post was last modified on September 29, 2020 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

27 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago