Political News

కీల‌క ప‌థ‌కాల‌కు బ్రేకులు.. జ‌గ‌న్ ముందున్న వ్యూహం ఏంటి?

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. కీల‌క ప‌థ‌కాలు నిలిచిపోయాయి. ఏం చేయాలన్నా.. ఎక్క‌డ ఎలాంటి బ్రేకు ప‌డుతుందో.. ఎటు వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు చుట్టుముడ‌తాయోన‌ని పార్టీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. ఏడాదిన్నర పూర్త‌యినా.. ఆయ‌న సంక‌ల్పించిన ప‌థ‌కాల‌న్నీ ప‌రిపూర్ణంగా అమ‌లులోకి వ‌చ్చి ఉంటే.. ఇది ప‌దేళ్ల పాల‌న‌తో స‌మాన‌మ‌ని మేధావులు అంటున్నారు. కానీ, అలా సాగ‌డం లేదు.. కొన్ని శ‌క్తులు అలా సాగ‌నివ్వ‌డ‌మూ లేదు. ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న ప‌థ‌కాల్లో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, రైతు భ‌రోసా కేంద్రాలు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు వంటివి గొప్ప‌గా ఉన్నాయి.

కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిగా అమ‌లుకు నోచుకుని ఉంటే.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వేగం.. మ‌రో రూపంలో ఉండేద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న నిలిచిపోయింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో.. ఆంగ్ల మాధ్య‌మం అడుగులు ముందుకు సాగ‌డం లేదు. పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కం కూడా ఎక్క‌డి గొంగళి అక్క‌డే అన్న‌చందంగా మారింది. ఇక‌, శాస‌న మండ‌లి ర‌ద్దు కూడా ఇలానే ఉంది. జిల్లాల విభ‌జ‌న ఏర్పాటు వ‌చ్చే ఏడాదికి అయితే అయిన‌ట్టే. పోల‌వ‌రం నిర్మాణం కూడా ముందుకా వెన‌క్కా.. అన్న‌ట్టుగానే సాగుతోంది. మ‌రీముఖ్యంగా సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, గండికోట రిజ‌ర్వాయ్‌.. వంటివి కూడా స‌వాలుగా మారాయి.

నిజానికి వీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగి ఉంటే.. పార్టీ ప‌రిస్థితి, ప్ర‌భుత్వ ప‌రిస్థితి కూడా వేగంగా ఉండేద‌ని అంటున్నారు. కానీ, వీటిలో కొన్నిన్యాయ‌ప‌రంగా.. ఆగిపోగా.. మ‌రికొన్ని కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం లేని కార‌ణంగా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఏంచేయాలి. మ‌రో మూడేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీనిలోనూ చివ‌రి ఆరు మాసాలు కూడా ఎన్నిక‌ల హ‌డావుడితోనే స‌మ‌యం గ‌డిచిపోతుంది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవాలి? ఎలా ముందుకు సాగాలి? అనే చ‌ర్చ వైసీపీలో ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకురావ‌డంతోపాటు.. నేరుగా సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. సాగుతున్న మాట వాస్త‌వం.

This post was last modified on September 29, 2020 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

33 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

1 hour ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago