సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరే ట్లోనే సీఎం చంద్రబాబు గత ఆరు రోజులుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ఈ పూజలో పాల్గొని గణనాథునుని అర్చిస్తున్న సమయంలోనే ఆయనకు గుడ్ న్యూస్ అందింది. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బుడమేరుకు పడిన మూడో గండి ఎప్పటికి పూడుతుందో అన్న బెంగతో ఉన్న సర్కారుకు ఆర్మీ అధికారులు సక్సెస్ వార్త మోసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు పూజలో ఉన్న సమయంలోనే వినడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్మీకి, మంత్రులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలి పారు. అనంతరం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టరేట్కు వచ్చారు. తాను ప్రకటించిన వరద సాయం రూ.కోటికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.
అనంతరం.. ఇరువురు కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు. విజయవాడలో చేపట్టిన సాయం, బాధితు లకు అందుతున్న సేవలను ఇరువురూ సమీక్షించారు. బాధితులకు మరింత మెరుగైన సేవలు అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి తమ వంతు సాయం అందిస్తా మని.. జనసేనికులు శనివారం నుంచి ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి.. బాధితులను ఆదుకుంటారని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా.. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ ఆరోగ్య విషయాన్ని చంద్రబాబు ఆరా తీశారు.
మరోవైపు.. బీజేపీ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా సీఎంచంద్రబాబును అదేసమయం లో కలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. బాధితులకు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.మందులను కూడా విరివిగా పంపిణీ చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
This post was last modified on September 8, 2024 4:58 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…