Political News

బాబుతో ప‌వ‌న్ భేటీ.. పూజ‌లో ఉండ‌గా `గుడ్ న్యూస్‌`

సీఎం చంద్ర‌బాబుతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌రే ట్‌లోనే సీఎం చంద్ర‌బాబు గ‌త ఆరు రోజులుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉదయం వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్ర‌బాబు ఈ పూజలో పాల్గొని గ‌ణ‌నాథునుని అర్చిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు గుడ్ న్యూస్ అందింది. దీంతో ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.

బుడ‌మేరుకు ప‌డిన మూడో గండి ఎప్ప‌టికి పూడుతుందో అన్న బెంగ‌తో ఉన్న స‌ర్కారుకు ఆర్మీ అధికారులు  స‌క్సెస్ వార్త మోసుకొచ్చారు. ఇది ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు పూజ‌లో ఉన్న స‌మ‌యంలోనే విన‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆర్మీకి, మంత్రుల‌కు, సిబ్బందికి ఆయ‌న అభినంద‌న‌లు తెలి పారు. అనంత‌రం.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చారు. తాను ప్ర‌క‌టించిన వ‌ర‌ద సాయం రూ.కోటికి సంబంధించిన చెక్కును సీఎం చంద్ర‌బాబుకు అందించారు.

అనంత‌రం.. ఇరువురు కూడా కొద్దిసేపు చ‌ర్చించుకున్నారు. విజ‌య‌వాడ‌లో చేప‌ట్టిన సాయం, బాధితు ల‌కు అందుతున్న సేవ‌ల‌ను ఇరువురూ స‌మీక్షించారు. బాధితుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందిం చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీనికి త‌మ వంతు సాయం అందిస్తా మ‌ని.. జ‌న‌సేనికులు శ‌నివారం నుంచి ప్ర‌భావిత ప్రాంతాల్లో తిరిగి.. బాధితుల‌ను ఆదుకుంటార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. కాగా.. వైర‌ల్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ప‌వ‌న్ ఆరోగ్య విష‌యాన్ని చంద్ర‌బాబు ఆరా తీశారు.

మ‌రోవైపు.. బీజేపీ నాయ‌కుడు, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కూడా సీఎంచంద్ర‌బాబును అదేస‌మ‌యం లో క‌లుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప‌రంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న వివ‌రించారు. బాధితుల‌కు 24 గంట‌లు వైద్య సేవ‌లు అందించేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు.మందుల‌ను కూడా విరివిగా పంపిణీ చేస్తున్నామ‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. మెరుగైన సేవ‌లు అందించేందుకు కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. 

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

23 minutes ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

1 hour ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

3 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

5 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

5 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

6 hours ago