సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరే ట్లోనే సీఎం చంద్రబాబు గత ఆరు రోజులుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ఈ పూజలో పాల్గొని గణనాథునుని అర్చిస్తున్న సమయంలోనే ఆయనకు గుడ్ న్యూస్ అందింది. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బుడమేరుకు పడిన మూడో గండి ఎప్పటికి పూడుతుందో అన్న బెంగతో ఉన్న సర్కారుకు ఆర్మీ అధికారులు సక్సెస్ వార్త మోసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు పూజలో ఉన్న సమయంలోనే వినడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్మీకి, మంత్రులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలి పారు. అనంతరం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టరేట్కు వచ్చారు. తాను ప్రకటించిన వరద సాయం రూ.కోటికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.
అనంతరం.. ఇరువురు కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు. విజయవాడలో చేపట్టిన సాయం, బాధితు లకు అందుతున్న సేవలను ఇరువురూ సమీక్షించారు. బాధితులకు మరింత మెరుగైన సేవలు అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి తమ వంతు సాయం అందిస్తా మని.. జనసేనికులు శనివారం నుంచి ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి.. బాధితులను ఆదుకుంటారని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా.. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ ఆరోగ్య విషయాన్ని చంద్రబాబు ఆరా తీశారు.
మరోవైపు.. బీజేపీ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా సీఎంచంద్రబాబును అదేసమయం లో కలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. బాధితులకు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.మందులను కూడా విరివిగా పంపిణీ చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
This post was last modified on September 8, 2024 4:58 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…