Political News

వ‌ర‌ద న‌ష్టం 6800 కోట్లు.. 322 పేజీల‌తో కేంద్రానికి నివేదిక‌:  చంద్ర‌బాబు

ఏపీలో సంభ‌వించిన వ‌ర‌దల కార‌ణంగా.. న‌ష్టం 6,800 కోట్ల రూపాయ‌లుగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథ‌మిక అంచ‌నానేన‌ని వెల్ల‌డించారు. గ‌త ఆదివారం ముంపు ముంచెత్తిన కాల‌నీలు, న‌గ‌రాల్లో ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో మ‌రోసారి అంచ‌నా వేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి వేసినఅంచ‌నా ప్ర‌కారం బాధిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం 6800 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కేంద్రానికి పంపుతున్నామ‌న్నారు.

సింగ్‌న‌గ‌ర్‌ను పూర్తిగా వ‌ర‌ద ముంచెత్తింద‌న్నారు. ఇక‌, దీనికి దిగువ‌న ఉన్న ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, పాయ‌కాపురం, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌ల‌ను కూడా వ‌ర‌ద ముంచేసింద‌ని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు కూడా వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని, అయితే.. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం అందాల్సి  ఉన్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ సూచ నల మేర‌కు ప్రాధ‌మిక నివేదిక‌ను అందిస్తున్నామ‌న్నారు.

నివేదిక‌లో పేర్కొన్న విష‌యాలు ఇవీ..

+ 32 మంది మృతి చెందగా, 2 ల‌క్ష‌ల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంట‌లు నీట‌మునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్‌బీకి రూ.2,164.5 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల న‌ష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేర‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago