ఏపీలో సంభవించిన వరదల కారణంగా.. నష్టం 6,800 కోట్ల రూపాయలుగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథమిక అంచనానేనని వెల్లడించారు. గత ఆదివారం ముంపు ముంచెత్తిన కాలనీలు, నగరాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో మరోసారి అంచనా వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి వేసినఅంచనా ప్రకారం బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టం 6800 కోట్లుగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపుతున్నామన్నారు.
సింగ్నగర్ను పూర్తిగా వరద ముంచెత్తిందన్నారు. ఇక, దీనికి దిగువన ఉన్న ప్రకాశ్ నగర్, పాయకాపురం, ప్రశాంతి నగర్, శాంతి నగర్లను కూడా వరద ముంచేసిందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అయితే.. కేంద్రం నుంచి తక్షణ సాయం అందాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచ నల మేరకు ప్రాధమిక నివేదికను అందిస్తున్నామన్నారు.
నివేదికలో పేర్కొన్న విషయాలు ఇవీ..
+ 32 మంది మృతి చెందగా, 2 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీటమునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్బీకి రూ.2,164.5 కోట్ల నష్టం జరిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల నష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల నష్టం జరిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వరకు నష్టం జరిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేరకు భారీ నష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు
This post was last modified on September 8, 2024 9:58 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…