ఏపీలో సంభవించిన వరదల కారణంగా.. నష్టం 6,800 కోట్ల రూపాయలుగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథమిక అంచనానేనని వెల్లడించారు. గత ఆదివారం ముంపు ముంచెత్తిన కాలనీలు, నగరాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో మరోసారి అంచనా వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి వేసినఅంచనా ప్రకారం బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టం 6800 కోట్లుగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపుతున్నామన్నారు.
సింగ్నగర్ను పూర్తిగా వరద ముంచెత్తిందన్నారు. ఇక, దీనికి దిగువన ఉన్న ప్రకాశ్ నగర్, పాయకాపురం, ప్రశాంతి నగర్, శాంతి నగర్లను కూడా వరద ముంచేసిందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అయితే.. కేంద్రం నుంచి తక్షణ సాయం అందాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచ నల మేరకు ప్రాధమిక నివేదికను అందిస్తున్నామన్నారు.
నివేదికలో పేర్కొన్న విషయాలు ఇవీ..
+ 32 మంది మృతి చెందగా, 2 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీటమునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్బీకి రూ.2,164.5 కోట్ల నష్టం జరిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల నష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల నష్టం జరిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వరకు నష్టం జరిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేరకు భారీ నష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు
This post was last modified on September 8, 2024 9:58 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…