ఏపీలో సంభవించిన వరదల కారణంగా.. నష్టం 6,800 కోట్ల రూపాయలుగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథమిక అంచనానేనని వెల్లడించారు. గత ఆదివారం ముంపు ముంచెత్తిన కాలనీలు, నగరాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో మరోసారి అంచనా వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి వేసినఅంచనా ప్రకారం బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టం 6800 కోట్లుగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపుతున్నామన్నారు.
సింగ్నగర్ను పూర్తిగా వరద ముంచెత్తిందన్నారు. ఇక, దీనికి దిగువన ఉన్న ప్రకాశ్ నగర్, పాయకాపురం, ప్రశాంతి నగర్, శాంతి నగర్లను కూడా వరద ముంచేసిందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అయితే.. కేంద్రం నుంచి తక్షణ సాయం అందాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచ నల మేరకు ప్రాధమిక నివేదికను అందిస్తున్నామన్నారు.
నివేదికలో పేర్కొన్న విషయాలు ఇవీ..
+ 32 మంది మృతి చెందగా, 2 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీటమునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్బీకి రూ.2,164.5 కోట్ల నష్టం జరిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల నష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల నష్టం జరిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వరకు నష్టం జరిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేరకు భారీ నష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…