Political News

వ‌ర‌ద న‌ష్టం 6800 కోట్లు.. 322 పేజీల‌తో కేంద్రానికి నివేదిక‌:  చంద్ర‌బాబు

ఏపీలో సంభ‌వించిన వ‌ర‌దల కార‌ణంగా.. న‌ష్టం 6,800 కోట్ల రూపాయ‌లుగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథ‌మిక అంచ‌నానేన‌ని వెల్ల‌డించారు. గ‌త ఆదివారం ముంపు ముంచెత్తిన కాల‌నీలు, న‌గ‌రాల్లో ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో మ‌రోసారి అంచ‌నా వేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి వేసినఅంచ‌నా ప్ర‌కారం బాధిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం 6800 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కేంద్రానికి పంపుతున్నామ‌న్నారు.

సింగ్‌న‌గ‌ర్‌ను పూర్తిగా వ‌ర‌ద ముంచెత్తింద‌న్నారు. ఇక‌, దీనికి దిగువ‌న ఉన్న ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, పాయ‌కాపురం, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌ల‌ను కూడా వ‌ర‌ద ముంచేసింద‌ని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు కూడా వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని, అయితే.. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం అందాల్సి  ఉన్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ సూచ నల మేర‌కు ప్రాధ‌మిక నివేదిక‌ను అందిస్తున్నామ‌న్నారు.

నివేదిక‌లో పేర్కొన్న విష‌యాలు ఇవీ..

+ 32 మంది మృతి చెందగా, 2 ల‌క్ష‌ల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంట‌లు నీట‌మునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్‌బీకి రూ.2,164.5 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల న‌ష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేర‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు

This post was last modified on September 8, 2024 9:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago