Political News

వ‌ర‌ద న‌ష్టం 6800 కోట్లు.. 322 పేజీల‌తో కేంద్రానికి నివేదిక‌:  చంద్ర‌బాబు

ఏపీలో సంభ‌వించిన వ‌ర‌దల కార‌ణంగా.. న‌ష్టం 6,800 కోట్ల రూపాయ‌లుగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథ‌మిక అంచ‌నానేన‌ని వెల్ల‌డించారు. గ‌త ఆదివారం ముంపు ముంచెత్తిన కాల‌నీలు, న‌గ‌రాల్లో ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో మ‌రోసారి అంచ‌నా వేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి వేసినఅంచ‌నా ప్ర‌కారం బాధిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం 6800 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కేంద్రానికి పంపుతున్నామ‌న్నారు.

సింగ్‌న‌గ‌ర్‌ను పూర్తిగా వ‌ర‌ద ముంచెత్తింద‌న్నారు. ఇక‌, దీనికి దిగువ‌న ఉన్న ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, పాయ‌కాపురం, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌ల‌ను కూడా వ‌ర‌ద ముంచేసింద‌ని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు కూడా వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని, అయితే.. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం అందాల్సి  ఉన్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ సూచ నల మేర‌కు ప్రాధ‌మిక నివేదిక‌ను అందిస్తున్నామ‌న్నారు.

నివేదిక‌లో పేర్కొన్న విష‌యాలు ఇవీ..

+ 32 మంది మృతి చెందగా, 2 ల‌క్ష‌ల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంట‌లు నీట‌మునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్‌బీకి రూ.2,164.5 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల న‌ష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేర‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు

This post was last modified on September 8, 2024 9:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

15 minutes ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

37 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

1 hour ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago