Political News

వ‌ర‌ద న‌ష్టం 6800 కోట్లు.. 322 పేజీల‌తో కేంద్రానికి నివేదిక‌:  చంద్ర‌బాబు

ఏపీలో సంభ‌వించిన వ‌ర‌దల కార‌ణంగా.. న‌ష్టం 6,800 కోట్ల రూపాయ‌లుగా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథ‌మిక అంచ‌నానేన‌ని వెల్ల‌డించారు. గ‌త ఆదివారం ముంపు ముంచెత్తిన కాల‌నీలు, న‌గ‌రాల్లో ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో మ‌రోసారి అంచ‌నా వేయాల్సి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి వేసినఅంచ‌నా ప్ర‌కారం బాధిత ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టం 6800 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కేంద్రానికి పంపుతున్నామ‌న్నారు.

సింగ్‌న‌గ‌ర్‌ను పూర్తిగా వ‌ర‌ద ముంచెత్తింద‌న్నారు. ఇక‌, దీనికి దిగువ‌న ఉన్న ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, పాయ‌కాపురం, ప్ర‌శాంతి న‌గ‌ర్‌, శాంతి న‌గ‌ర్‌ల‌ను కూడా వ‌ర‌ద ముంచేసింద‌ని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు కూడా వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని, అయితే.. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం అందాల్సి  ఉన్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ సూచ నల మేర‌కు ప్రాధ‌మిక నివేదిక‌ను అందిస్తున్నామ‌న్నారు.

నివేదిక‌లో పేర్కొన్న విష‌యాలు ఇవీ..

+ 32 మంది మృతి చెందగా, 2 ల‌క్ష‌ల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంట‌లు నీట‌మునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్‌బీకి రూ.2,164.5 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల న‌ష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల న‌ష్టం జ‌రిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వ‌ర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేర‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేర‌కు న‌ష్టం జ‌రిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు

This post was last modified on September 8, 2024 9:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago