భారీ వర్షాలు.. వరదలు విజయవాడ ను ముంచేసి వారం దాటేసింది. ఎనిమిది రోజులు పూర్తై.. తొమ్మిదో రోజుకు చేరుకున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొన్నది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నా.. పరిస్థితి సాధారణ స్థాయికి రాని పరిస్థితి. అయితే.. జరిగిన నష్టం భారీగా ఉండటం… సైన్యం రంగంలోకి దిగినా ఇంకా పరిస్థితి చక్కబడలేదు. కానీ ప్రభుత్వ అలసత్వం లేదనే చెప్పాలి.
విజయవాడను వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి అక్కడే ఉండి.. ఇంటికి వెళ్లకుండా.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యల్ని పరిష్కరించేందుకు.. బాధితులకు సాయం అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు.
అయినప్పటికీ ఆశించినంత ఫలితం రావట్లేదన్న పెదవి విరుపు వినిపిస్తూ ఉంది. ఇలాంటి వేళ.. తాజాగా చంద్రబాబు నోటి నుంచి సీరియస్ మాట ఒకటి వచ్చింది. ఖర్చు గురించి వెనకాడకుండా పని చేస్తున్న ప్రభుత్వానికి రావాల్సిన పేరు రాకపోవటంతో బాధితుల హాహాకారాలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
తప్పు చేసే అధికారుల చొక్కా పట్టుకొని మరీ నిలదీయాలని.. ఏదైనా జరిగితే తాను చూసుకుంటానంటూ భారీ భరోసాను ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా.. డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75 శాతం మంది కోరుకుంటున్నారని.. కష్టమైనా ఇంటింటికి వెళ్లి నిత్యవసరాలు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ఇళ్ల లో వస్తువల రిపేర్లకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో రివ్యూ చేశామన్న చంద్రబాబు.. విజయవాడలో అర్బన్ కంపెనీకి తక్కువ నిపుణులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కొందరికి శిక్షణ ఇచ్చి వారికి అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటించిన వేళలో.. చాలామంది ఉపాధి కల్పించాలని కోరుతున్నారని.. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా.. వర్చువల్ గా ఉపాధి కల్పిస్తామన్న హామీని ఇచ్చారు చంద్రబాబు. వారం రోజుల్ని లక్ష్యంగా పెట్టుకొని బీమా ఇష్యూలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మరోవైపు భారీ వర్షాలు.. వరదల కారణంగా ఏపీకి జరిగిన నష్టం రూ.6882 కోట్లుగా సర్కారు లెక్క కట్టింది. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది. కేంద్రానికి ఈ నివేదికను పంపున్నారు. ఆర్ అండ్ బీకి 2164 కోట్లు.. నీటివనరుల శాఖకు రూ.1568 కోట్లు.. పురపాలక శాఖకు రూ.11600 కోట్లు.. రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు.. విద్యుత్ శాఖకురూ.481 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా లెక్కలు తేలాయి. మరికొన్ని శాఖలకు జరిగిన నష్టాన్ని సైతం లెక్కించారు. వీటి రిపోర్టులను కూడా కేంద్రానికి పంపనున్నారు. మరి.. కేంద్రం నుంచి వచ్చే పరిహారం ఎంతన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on September 8, 2024 9:32 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…