Political News

ప్రజలకు వజ్రాయుధం ఇచ్చిన చంద్రబాబు

భారీ వర్షాలు.. వరదలు విజయవాడ ను ముంచేసి వారం దాటేసింది. ఎనిమిది రోజులు పూర్తై.. తొమ్మిదో రోజుకు చేరుకున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొన్నది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నా.. పరిస్థితి సాధారణ స్థాయికి రాని పరిస్థితి. అయితే.. జరిగిన నష్టం భారీగా ఉండటం… సైన్యం రంగంలోకి దిగినా ఇంకా పరిస్థితి చక్కబడలేదు. కానీ ప్రభుత్వ అలసత్వం లేదనే చెప్పాలి.

విజయవాడను వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి అక్కడే ఉండి.. ఇంటికి వెళ్లకుండా.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యల్ని పరిష్కరించేందుకు.. బాధితులకు సాయం అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

అయినప్పటికీ ఆశించినంత ఫలితం రావట్లేదన్న పెదవి విరుపు వినిపిస్తూ ఉంది. ఇలాంటి వేళ.. తాజాగా చంద్రబాబు నోటి నుంచి సీరియస్ మాట ఒకటి వచ్చింది. ఖర్చు గురించి వెనకాడకుండా పని చేస్తున్న ప్రభుత్వానికి రావాల్సిన పేరు రాకపోవటంతో బాధితుల హాహాకారాలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.

తప్పు చేసే అధికారుల చొక్కా పట్టుకొని మరీ నిలదీయాలని.. ఏదైనా జరిగితే తాను చూసుకుంటానంటూ భారీ భరోసాను ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా.. డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75 శాతం మంది కోరుకుంటున్నారని.. కష్టమైనా ఇంటింటికి వెళ్లి నిత్యవసరాలు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఇళ్ల లో వస్తువల రిపేర్లకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో రివ్యూ చేశామన్న చంద్రబాబు.. విజయవాడలో అర్బన్ కంపెనీకి తక్కువ నిపుణులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కొందరికి శిక్షణ ఇచ్చి వారికి అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటించిన వేళలో.. చాలామంది ఉపాధి కల్పించాలని కోరుతున్నారని.. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా.. వర్చువల్ గా ఉపాధి కల్పిస్తామన్న హామీని ఇచ్చారు చంద్రబాబు. వారం రోజుల్ని లక్ష్యంగా పెట్టుకొని బీమా ఇష్యూలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరోవైపు భారీ వర్షాలు.. వరదల కారణంగా ఏపీకి జరిగిన నష్టం రూ.6882 కోట్లుగా సర్కారు లెక్క కట్టింది. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది. కేంద్రానికి ఈ నివేదికను పంపున్నారు. ఆర్ అండ్ బీకి 2164 కోట్లు.. నీటివనరుల శాఖకు రూ.1568 కోట్లు.. పురపాలక శాఖకు రూ.11600 కోట్లు.. రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు.. విద్యుత్ శాఖకురూ.481 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా లెక్కలు తేలాయి. మరికొన్ని శాఖలకు జరిగిన నష్టాన్ని సైతం లెక్కించారు. వీటి రిపోర్టులను కూడా కేంద్రానికి పంపనున్నారు. మరి.. కేంద్రం నుంచి వచ్చే పరిహారం ఎంతన్నది తేలాల్సి ఉంది.

Satya

Recent Posts

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

41 minutes ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

3 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

5 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

6 hours ago

తడబడుతున్న వైభవ్… ఒక్క సిక్స్ లేదు

ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…

7 hours ago

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…

7 hours ago