గతానికి భిన్నంగా రాష్ట్ర బీజేపీ అడుగులు వేస్తోందా? ఆ పార్టీ రాష్ట్ర చీఫ్.. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారా? ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోనూ ఒక జిల్లాకు మరో జిల్లాకు మధ్య పోలికలు లేవు. ఒక జిల్లాలో ఉన్న సమస్యలు మరో జిల్లాలో పెద్దగా కనిపించవు. సో.. ఈ నాడిని పట్టుకున్న సోము.. తనకు, పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యూహాలను అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలను ఆయన దాదాపు పక్కన పెట్టారు. ఇక్కడ అమరావతి రాజధాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీనిపై ఎటూ మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. సో.. ఈ విషయాన్ని అనవసరంగా కెలికి.. పార్టీని పలచన చేసుకోవడం ఎందుకనే ధోరణిలో ఈ రెండు జిల్లాలపై ఫోకస్ తగ్గించారు. అదేసమయంలో కీలకమైన మరో రెండు జిల్లాలపై ఆయన సామాజిక వర్గం కోణంలో ఫోకస్ చేస్తున్నారు. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఎక్కువగా ఉన్న, కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే రెండు జిల్లాల్లో ఆర్థికంగా, అనుచరగణం పరంగా కూడా బాగున్నవారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని, వచ్చేది మన ప్రభుత్వమేనని, బీజేపీ-జనసేనల కూటమే రాష్ట్రంలో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సో.. పార్టీలోకి రండి! అని ఆయన తెరచాటుగా కొందరి ద్వారా వర్తమానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో ఒక విషయం బలంగా పనిచేస్తోంది. సోము మాటకు కట్టుబడే మనిషి.. పదేపదే వ్యూహాలు మార్చడం, కేంద్రంలోని పెద్దలకు వ్యతిరేకంగా పనిచేయకపోవడం వంటివి కాపు నేతలను కూడా ఆకర్షిస్తున్నాయి.
అయితే.. పార్టీలో చేరడంపై మాత్రం కొంత వరకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోము చెబుతున్నట్టుగా పార్టీకి అధికారంలోకి వచ్చే సీన్ ఉందా? అనేది వీరి ప్రధాన అనుమానం. ఈ విషయంలో సోము క్లారిటీగా ఉంటే.. కాపు సమాజం మొత్తం ఆయనవైపు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 28, 2020 11:38 am
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…