Political News

అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేసిన చిన్నమ్మ

ఏపీ రాజధానిగా అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే సోము వీర్రాజు ఏమో.. ఏపీ రాజధాని అమరావతినే అని చెబుతారు. మరోవైపు రాజధాని అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసే వేళలో ఏపీ రాష్ట్రానికే ఆ నిర్ణయాధికారం అని చెప్పటం.. ఈ డబుల్ స్టాండ్ ఏమిటన్న దానిపై భారీగా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. జాతీయ స్థాయిలో పార్టీని పునర్ వ్యవస్థీకరించిన బీజేపీ అధినాయకత్వం ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

అమరావతిపై బీజేపీది డబుల్ స్టాండ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. అమరావతిపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆమె తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీకి రెండు నాల్కుల ధోరణి లేదని.. అమరావతిలోనే రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందని.. కాకుంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.

తనకు లభించిన పదవిని బాధ్యతగా పరిగణిస్తున్నా అని చెప్పిన ఆమె.. దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెప్పారు. కర్ణాటకలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ.. ఏపీ.. తమిళనాడులోనూ ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిపై భిన్నాభిప్రాయాలకు తావు లేదని చెప్పారు.

పార్టీ పరంగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాము చెబుతున్నామని.. రైతులకు న్యాయం జరగాలని.. వారు స్థలాలు ఇచ్చిన చోట డెవలప్మెంట్ జరగాల్సిందేనని.. అందులో భిన్నాభిప్రాయాలకు చోటు లేదన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చకు తావులేదన్నారు. మొత్తంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగించాలన్న చిన్నమ్మ వ్యాఖ్యలు అక్కడి వారికి కొంత ఊరటను ఇవ్వటం ఖాయం.

This post was last modified on September 28, 2020 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

1 hour ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

2 hours ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

4 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

6 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

9 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

10 hours ago