Political News

జనసేన కాస్ట్లీ సైనికులు

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 500 చెల్లించాలని డిసైడ్ చేశారు. నిజానికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాలంటే కష్టమేనేమో. ఎందుకంటే పార్టీ సభ్యత్వానికి రూ. 500 చెల్లించటం బహుశా ఏ పార్టీలోను లేదేమో. మరి ఏ పార్టీలోను లేని విధంగా జనసేనలోనే ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా కచ్చితంగా భవిష్యత్తుల్లో పార్టీకే ఓట్లు వేస్తారని, పార్టీ ఎజెండానే మోస్తారని.

ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో చాలామంది మొన్నటి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయలేదు. తాము సినిమాల్లో పవన్ అభిమానులమే అయినా ఓటు మాత్రం వైసిపికే వేస్తామని చాలామంది బహిరంగంగానే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. జనసేనలో పార్టీ సభ్యత్వం ఏమిటో, ఓట్లు వైసిపికి వేయటం ఏమిటో ఎవరికీ అర్ధంకాలేదు. బహుశా ఈ విషయంలో పవన్ కు ఒళ్ళుమండిపోయుంటుంది. అందుకనే తాజాగా చేయబోయే మెంబర్ షిప్పు డ్రైవ్లో మాత్రం రూ. 500 చెల్లించాలనే నిబంధనను తెచ్చారు.

మెంబర్ షిప్ కాస్ట్లీ వ్యవహారం కాబట్టే ప్రయోగాత్మకంగా ఐదు నియోజకవర్గాల్లో చేయాలని డిసైడ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, నెల్లూరు రూరల్, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, అనంతపురం, గుంటూరు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేస్తారు. ఇక్కడ వచ్చే స్పందన బట్టి ఒకసారి రివ్యు చేసుకుని ఫైల్ డెసిషన్ తీసుకుంటారు.

రూ. 500 పెట్టి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే నిజమైన జనసైనికులని పవన్ అనుకుంటున్నట్లున్నారు. ఇంత డబ్బులు పెట్టి సభ్యత్వం తీసుకున్న వారు ఇక ఏ విషయంలో కూడా వేరే పార్టీ వైపు చూడరని పవన్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి పవన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఐదు నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు ఇంకా లాంచ్ కాలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైతే కానీ స్పందన తెలీదు కదా. చూద్దాం ఏమవుతుందో.

This post was last modified on September 27, 2020 10:08 am

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

1 hour ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

1 hour ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

1 hour ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

5 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

5 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

6 hours ago