అధికారంలో ఉన్న వాళ్లు కుల సంఘాల సమావేశాలకు వెళ్తే లేని పోని తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆయన గత నెలలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్కు వెళ్లారు. అందులో ఆ కులానికి చెందిన వారు చెప్పుకున్న గొప్పల గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. వాళ్లను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు తప్పలేదు.
పర్టికులర్గా ఒక కులానికి ఎలివేషన్ ఇవ్వడం వల్ల వేరే కులాల వాళ్లు నొచ్చుకుంటారనడంలో సందేహం లేదు. అంతే కాక రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా తమ సమావేశాలకు పిలిస్తే.. ప్రతిసారీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లలేడు కదా.. వెళ్లి ఒక్కో కులాన్ని పొగుడుతూ ఉంటే బాగుండదు కదా.. ఒక మీటింగ్కు వెళ్లి ఇంకో మీటింగ్కు గైర్హాజరైతే వాళ్లు నొచ్చుకుని గొడవ చేస్తారు కదా అనే చర్చ నడిచింది. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది.
తాజాగా రేవంత్ రెడ్డి క్షత్రియ కుల సంఘం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వెళ్లారు. యథావిధిగా ఆ కులాన్ని పొగిడారు. మరో వైపేమో గౌడ సామాజిక సంఘానికి చెందిన సర్వాయిపాపన్న జయంతి కార్యక్రమానికి ఆహ్వానిస్తే.. దానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పంపించారు. దీంతో గౌడలు అంటే ముఖ్యమంత్రికి చిన్న చూపని.. ఆంధ్రా వాళ్లు నిర్వహించే కుల సంఘాలకు వెళ్తూ తెలంగాణలో అధికంగా ఉన్న, వెనుకబడ్డ సామాజిక వర్గమైన గౌడ సంగం నిర్వహించే కార్యక్రమాన్ని ఆయన విస్మరించారని.. ఇది అగ్ర కుల దురహంకారమని ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలు ఇంతటితే ఆగడం కూడా కష్టమే.
ఇప్పటికే రెండు కులాల మీటింగ్కు హాజరైన నేపథ్యంలో రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా రేవంత్ను ఆహ్వానించకుండా ఉండరు. ఎవరికి నో చెప్పినా వాళ్ల నుంచి విమర్శలు తప్పవు. అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలాంటి మీటింగ్స్కు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 20, 2024 10:05 am
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…