అధికారంలో ఉన్న వాళ్లు కుల సంఘాల సమావేశాలకు వెళ్తే లేని పోని తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆయన గత నెలలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్కు వెళ్లారు. అందులో ఆ కులానికి చెందిన వారు చెప్పుకున్న గొప్పల గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. వాళ్లను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు తప్పలేదు.
పర్టికులర్గా ఒక కులానికి ఎలివేషన్ ఇవ్వడం వల్ల వేరే కులాల వాళ్లు నొచ్చుకుంటారనడంలో సందేహం లేదు. అంతే కాక రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా తమ సమావేశాలకు పిలిస్తే.. ప్రతిసారీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లలేడు కదా.. వెళ్లి ఒక్కో కులాన్ని పొగుడుతూ ఉంటే బాగుండదు కదా.. ఒక మీటింగ్కు వెళ్లి ఇంకో మీటింగ్కు గైర్హాజరైతే వాళ్లు నొచ్చుకుని గొడవ చేస్తారు కదా అనే చర్చ నడిచింది. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది.
తాజాగా రేవంత్ రెడ్డి క్షత్రియ కుల సంఘం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వెళ్లారు. యథావిధిగా ఆ కులాన్ని పొగిడారు. మరో వైపేమో గౌడ సామాజిక సంఘానికి చెందిన సర్వాయిపాపన్న జయంతి కార్యక్రమానికి ఆహ్వానిస్తే.. దానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పంపించారు. దీంతో గౌడలు అంటే ముఖ్యమంత్రికి చిన్న చూపని.. ఆంధ్రా వాళ్లు నిర్వహించే కుల సంఘాలకు వెళ్తూ తెలంగాణలో అధికంగా ఉన్న, వెనుకబడ్డ సామాజిక వర్గమైన గౌడ సంగం నిర్వహించే కార్యక్రమాన్ని ఆయన విస్మరించారని.. ఇది అగ్ర కుల దురహంకారమని ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలు ఇంతటితే ఆగడం కూడా కష్టమే.
ఇప్పటికే రెండు కులాల మీటింగ్కు హాజరైన నేపథ్యంలో రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా రేవంత్ను ఆహ్వానించకుండా ఉండరు. ఎవరికి నో చెప్పినా వాళ్ల నుంచి విమర్శలు తప్పవు. అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలాంటి మీటింగ్స్కు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 20, 2024 10:05 am
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…