Political News

బాబు ఢిల్లీ టూర్.. జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు.. !

చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశమే కాదని రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకుందని పలువురు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి కలుసుకున్నారు.

శ‌నివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అనే కీలక అంశాలపై చంద్రబాబు చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో పోలవరానికి సంబంధించిన నిధులను త్వరగా కేటాయించాలని చంద్రబాబు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అసలు రాజకీయంగా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం.

రాష్ట్రంలోనూ ఆందోళనలకు పిలుపునివ్వడం. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులతో ఆయన కలిసిమెలిసి ఉండటం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించి జగన్ పై కేసులను త్వరితగతిని తేల్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక చర్చ అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియకపోయినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం వెనుక కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనలు నిరసనలు కారణమై ఉంటాయని సందేహాలు వ్యక్త‌మవుతున్నా యి.

ఇప్పుడు గనక జగన్‌ను నిలువరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు రాజకీయంగా వేస్తున్న అడుగులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నాయకులకు జగన్ అత్యంత దగ్గరగా ఉన్నారని ఆయనను నిలువరించాలని కోరనున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది.

మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాలి. ఏదేమైనా ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

జ‌గ‌న్‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు నిలువ‌రించ‌డంతోపాటు.. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల వ్య‌వ‌హారంపై అమిత్‌షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియా చెబుతోంది. అదేవిధంగా రాష్ట్రం మరికొంత అప్పు చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కూడా ముఖ్యమంత్రి కోర‌నున్నట్లు తెలిసింది. ఎలా చూసుకున్నా.. ఇది రాజ‌కీయంగానే ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని అంటున్నారు.

This post was last modified on August 18, 2024 11:23 am

Share
Show comments
Published by
Satya
Tags: Babu

Recent Posts

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

1 hour ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

1 hour ago

తప్పు ఒప్పేసుకున్న వీరభద్రుడు

బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…

2 hours ago

భోపాల్ భుజాల మీద బజ్ భారం

హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…

3 hours ago

మైక్‌తో పాటు హెల్మెంట్ తీసుకెళ్లండి.. మనోజ్ పంచ్

మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…

3 hours ago

దారుణం… సినిమా ఆశ చూపి లైంగిక దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్‌లోని గదికి…

3 hours ago