Political News

బాబు ఢిల్లీ టూర్.. జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు.. !

చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశమే కాదని రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకుందని పలువురు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి కలుసుకున్నారు.

శ‌నివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అనే కీలక అంశాలపై చంద్రబాబు చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో పోలవరానికి సంబంధించిన నిధులను త్వరగా కేటాయించాలని చంద్రబాబు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అసలు రాజకీయంగా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం.

రాష్ట్రంలోనూ ఆందోళనలకు పిలుపునివ్వడం. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులతో ఆయన కలిసిమెలిసి ఉండటం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించి జగన్ పై కేసులను త్వరితగతిని తేల్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక చర్చ అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియకపోయినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం వెనుక కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనలు నిరసనలు కారణమై ఉంటాయని సందేహాలు వ్యక్త‌మవుతున్నా యి.

ఇప్పుడు గనక జగన్‌ను నిలువరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు రాజకీయంగా వేస్తున్న అడుగులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నాయకులకు జగన్ అత్యంత దగ్గరగా ఉన్నారని ఆయనను నిలువరించాలని కోరనున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది.

మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాలి. ఏదేమైనా ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

జ‌గ‌న్‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు నిలువ‌రించ‌డంతోపాటు.. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల వ్య‌వ‌హారంపై అమిత్‌షాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియా చెబుతోంది. అదేవిధంగా రాష్ట్రం మరికొంత అప్పు చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కూడా ముఖ్యమంత్రి కోర‌నున్నట్లు తెలిసింది. ఎలా చూసుకున్నా.. ఇది రాజ‌కీయంగానే ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని అంటున్నారు.

This post was last modified on August 18, 2024 11:23 am

Share

Recent Posts

హను… నాగ్ లాగా హిట్టిస్తాడా?

ప్రభాస్ దర్శకుల ఎంపిక ఎప్పుడూ ఒకే లెక్కలో ఉండదు. తన మార్కెట్‌కు సరిపోయే టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ…

9 minutes ago

హిట్టు కొట్టాడు… మాయమైపోయాడు

టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…

1 hour ago

యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…

4 hours ago

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

11 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

11 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

11 hours ago