టీడీపీ బాటలోనే బీజేపీనే నడుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కూటమి పార్టీలు.. సర్కారు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడుగా ఉంది. ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైంది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీకార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా సామాన్యులకు పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా చేరువయ్యాయి.
దీనివల్ల ఇటు పార్టీకి, అటు ప్రభుత్వంలో టీడీపీకి కూడా మంచి పేరువస్తోంది. సాధారణ ప్రజల సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడంలోనూ.. వాటికి ప్రత్యామ్నాయాలు చూపించడంలోనూ.. నాయకులు ముందుంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రజాదర్బార్లో పాలుపంచుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, మరో పార్టీ జనసేన కూడా ‘ప్రజావాణి’ పేరుతో పార్టీ కార్యాలయంలో వారానికి రెండు మూడు రోజులు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
దీంతో బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. కూటమిలోని రెండు పార్టీలూ దూకుడుగా ఉంటే.. తాము వెనుకబడి పోతున్నామన్న భయం వారిలో కనిపిస్తోంది. దీంతో వారు కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘వారధి’ పేరుతో మరో రెండు రోజుల్లో పార్టీ కార్యాలయాల్లో ప్రజలను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని, వారి సమస్యలను ప్రభుత్వానికి వివరించి.. పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.
మొత్తానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ పోటీ పడుతోంది. కానీ, అసలు సమస్య ఏంటంటే.. రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకువస్తే.. ఆ పోటీలో సక్సెస్ అయితే.. బీజేపీకి మంచి మార్కులు పడతాయి కానీ.. ఇలా అందరూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో కాలం గడిపేస్తే.. ప్రయోజనం ఏంటనేది ప్రశ్న.
This post was last modified on August 11, 2024 7:01 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…