Political News

టీడీపీ దూకుడును అందుకునేలా బీజేపీ వ్యూహం!

టీడీపీ బాట‌లోనే బీజేపీనే న‌డుస్తోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజా ఎన్నిక‌ల్లో విజయం ద‌క్కించుకున్న కూట‌మి పార్టీలు.. స‌ర్కారు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ దూకుడుగా ఉంది. ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువైంది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీకార్యాల‌యాల్లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌డం ద్వారా సామాన్యుల‌కు పార్టీ, ప్ర‌భుత్వం రెండూ కూడా చేరువ‌య్యాయి.

దీనివ‌ల్ల ఇటు పార్టీకి, అటు ప్ర‌భుత్వంలో టీడీపీకి కూడా మంచి పేరువ‌స్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డంలోనూ.. వాటికి ప్ర‌త్యామ్నాయాలు చూపించ‌డంలోనూ.. నాయ‌కులు ముందుంటున్నారు. సీఎం చంద్ర‌బాబు సైతం ఈ ప్ర‌జాద‌ర్బార్‌లో పాలుపంచుకుంటూ ప్ర‌జ‌ల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, మ‌రో పార్టీ జ‌న‌సేన కూడా ‘ప్ర‌జావాణి’ పేరుతో పార్టీ కార్యాల‌యంలో వారానికి రెండు మూడు రోజులు ప్ర‌జ‌ల నుంచి అర్జీలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.

దీంతో బీజేపీ నేతలు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. కూట‌మిలోని రెండు పార్టీలూ దూకుడుగా ఉంటే.. తాము వెనుక‌బ‌డి పోతున్నామ‌న్న భ‌యం వారిలో క‌నిపిస్తోంది. దీంతో వారు కూడా ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘వార‌ధి’ పేరుతో మ‌రో రెండు రోజుల్లో పార్టీ కార్యాలయాల్లో ప్ర‌జ‌ల‌ను కలుసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల నుంచి అర్జీలు తీసుకుని, వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి వివ‌రించి.. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

మొత్తానికి టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో బీజేపీ పోటీ ప‌డుతోంది. కానీ, అస‌లు స‌మ‌స్య ఏంటంటే.. రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకువ‌స్తే.. ఆ పోటీలో స‌క్సెస్ అయితే.. బీజేపీకి మంచి మార్కులు ప‌డ‌తాయి కానీ.. ఇలా అంద‌రూ క‌లిసి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పేరుతో కాలం గ‌డిపేస్తే.. ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌శ్న‌.

This post was last modified on August 11, 2024 7:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

4 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

9 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

12 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

14 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

16 hours ago