Political News

పొలిటిక‌ల్ పోరులో జ‌న‌సేన వెనుక‌బ‌డిందా?

పొలిటిక‌ల్ మీట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన వెనుక‌బ‌డిందా? గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇత‌ర ప‌క్షాలు ప్ర‌య‌త్నించిన రీతిలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌లేదా? పైగా మిత్ర ప‌క్షం బీజేపీతోనూ ఆయ‌న క‌లివిడిగా ఉండ‌లేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లను టీడీపీ, బీజేపీలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. రాజ‌కీయంగా కూడా కొంత మైలేజీ పొందేందుకు ప్ర‌య‌త్నించాయి.

ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యాయా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. బీజేపీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. టీడీపీ నాయ‌కులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మైనా.. హాట్ కామెంట్ల‌తో వేడెక్కించారు. ఈ ప‌రిణామాల‌తో ఆ రెండు పార్టీల్లోనూ కొంత మేర‌కు గ్రాఫ్ పెరిగింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ.. ఇదే స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉండాల్సిన జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైనా.. రాష్ట్రంలో కీల‌క నేత‌ల‌ను క‌దిలించ‌డంలోను, ఏదో ఒక రూపంలో ఉద్య‌మించేందుకు, లేదా స‌ద‌రు దాడుల‌పై ఆశించిన విధంగా స్పందించ‌డంలోను ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే అభిప్రాయం జ‌న‌సేన‌లోనే వ్య‌క్త‌మ‌వుతోంది.

పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం పంచుకుంటామ‌ని.. చెబుతున్న మిత్ర‌ప‌క్షం బీజేపీ.. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించిన స‌మ‌యంలో ఎక్క‌డా జ‌న‌సేన నేత‌లు కానీ, ఆ పార్టీ జెండాలు కానీ క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల కాలంలో ప‌లు వేదిక‌ల‌పై సోము వీర్రాజు మాట్లాడుతూ… జ‌న‌సేన త‌మ‌కు న‌మ్మ‌ద‌గిన మిత్ర‌ప‌క్ష‌మ‌ని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు.. తాజాగా ఎత్తుకున్న అజెండా విష‌యంలో ప‌వ‌న్‌ను ఆయ‌నే క‌లుపుకొని పోలేదా? లేక‌.. మ‌న‌కెందుకులే .. అని ప‌వ‌నే దూరంగా ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నార‌ని స‌మాచారం.

పోనీ.. బీజేపీతో క‌లిసి ఉద్య‌మించ‌క‌పోయినా.. పార్టీ ప‌రంగా అయినా.. ఏదో ఒక‌రూపంలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగ‌డంలో ప‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లేక‌.. కేవ‌లం హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగితే.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగితే.. ఇత‌ర మ‌త‌స్థుల్లో ఉన్న సానుభూతి త‌న‌కు దూర‌మ‌వుతుంద‌ని ఆయ‌న భావించారా? అనే ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏదేమైనా.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో టీడీపీ, బీజేపీలు వ్య‌వ‌హ‌రించిన తీరులో ప‌వ‌న్ దూకుడు చూపించ‌లేక‌పోయార‌నేది వాస్త‌వ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 26, 2020 9:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

7 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

31 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

1 hour ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago