Political News

జగన్ టార్గెట్ చేసిన రమణ దీక్షితులకు కోర్టులో ఊరట

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమే. తన వ్యాఖ్యలతో రమణ దీక్షితులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం రమణదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడి బాధ్యతలు నుంచి హఠాత్తుగా తప్పించింది. జగన్ ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేయడంతో ఆయనపై వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే తనకు బాధ్యతలు తిరిగి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రమణ దీక్షితులుకు ఊరటనిచ్చింది.

ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టిటిడి ఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో, గత ప్రభుత్వానికి చుక్కెదురై రమణ దీక్షితులకు ఊరట లభించినట్లయింది. టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఆనాటి టిడిపి ప్రభుత్వం పదవి విరమణ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులతో పాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత వారికి హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, వయోభారంతో స్వామివారికి కైంకర్య సేవలు ఆయన నిర్వర్తించలేరేమో అన్న కారణంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షితులును టీటీడీ విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించింది. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలితోపాటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పై కూడా సంచలన విమర్శలు, వ్యాఖ్యలు చేశారు.

దీంతో, 2024 మార్చిలో ఆయనను బాధ్యతల నుంచి తొలగిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆయనకు ఊరట కలిగే నిర్ణయం వెలువడింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

16 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

26 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago