టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమే. తన వ్యాఖ్యలతో రమణ దీక్షితులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం రమణదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడి బాధ్యతలు నుంచి హఠాత్తుగా తప్పించింది. జగన్ ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేయడంతో ఆయనపై వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే తనకు బాధ్యతలు తిరిగి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రమణ దీక్షితులుకు ఊరటనిచ్చింది.
ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టిటిడి ఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో, గత ప్రభుత్వానికి చుక్కెదురై రమణ దీక్షితులకు ఊరట లభించినట్లయింది. టీటీడీలో వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఆనాటి టిడిపి ప్రభుత్వం పదవి విరమణ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులతో పాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత వారికి హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, వయోభారంతో స్వామివారికి కైంకర్య సేవలు ఆయన నిర్వర్తించలేరేమో అన్న కారణంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షితులును టీటీడీ విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించింది. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న రమణ దీక్షితులు టీటీడీ పాలకమండలితోపాటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పై కూడా సంచలన విమర్శలు, వ్యాఖ్యలు చేశారు.
దీంతో, 2024 మార్చిలో ఆయనను బాధ్యతల నుంచి తొలగిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆయనకు ఊరట కలిగే నిర్ణయం వెలువడింది.
This post was last modified on August 2, 2024 2:20 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…