ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో పెట్టిన పేరు(ఆయన పేరు కాకున్నా)ను మార్చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఫలితంగా ఇక నుంచి ఆయా పథకాల పేర్లు మారనున్నాయి. కొన్నింటికి దేశ నాయకులు, మరికొన్నింటికి సమాజ సేవకుల పేర్లను పెట్టారు. అంతేకాదు.. వీటిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన పేర్లు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ప్పటి వరకు ఉన్న జగన్ పేర్లు, ఆయన ప్రకటించిన పేర్లు కూడా సమూలంగా మారిపోనున్నాయి. మొత్తంగా ఆరు పథకాల పేర్లను అధికారికంగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ.. మార్పులు..
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…