“జగన్ తన తీరును మార్చుకోకపోతే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మిగలరు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీలకమైన వ్యాఖ్య.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరూ మిగలరు! అనే. మరి పయ్యావుల వ్యూహం ఏంటి? ఈయనేమీ చిన్నా చితకా నాయకుడు కాదు. సీనియర్ నేత, పైగా సుదీర్ఘ అనుభవం.. చంద్రబాబుతో చనువు ఉన్న నాయకుడు.
మరి పయ్యావులే చెబుతున్నారంటే.. తెరవెనుక ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధారణంగా తమకు ముప్పు పొంచి ఉందని తెలిసినా.. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే(జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి) జగన్కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయనపై అభిమానం ఉన్నా.. కేసులకు మాత్రం సిద్ధంగా ఉండరు కదా!
ఇక, ఇదేసమయంలో జగన్ను కనుక.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మరింత కకావికలం అవుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో ముందే తట్టబుట్ట సర్దుకుని సేఫ్ జోన్కు చేరుకున్నా.. ఆశ్చర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జనసేననా, బీజేపీనా అన్నది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్నవారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మరక్షణ పొందే ప్రయత్నం చేయొచ్చు. మిగిలిన వారు అవకాశాలను బట్టి తమ తమ ఇష్టానుసారం.. అవతల నుంచి వచ్చే అవకాశం మేరకు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. పయ్యావుల కేశవ్ ప్రకటన అయితే.. సీరియస్గానే ఉంది. మరి వచ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.
This post was last modified on July 27, 2024 9:54 am
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…