Political News

వైసీపీలో ఎమ్మెల్యేలు మిగ‌ల‌రా?

“జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోక‌పోతే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌కు మిగ‌ల‌రు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీల‌క‌మైన వ్యాఖ్య‌.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవ‌రూ మిగ‌ల‌రు! అనే. మ‌రి ప‌య్యావుల వ్యూహం ఏంటి? ఈయ‌నేమీ చిన్నా చిత‌కా నాయ‌కుడు కాదు. సీనియ‌ర్ నేత‌, పైగా సుదీర్ఘ అనుభ‌వం.. చంద్ర‌బాబుతో చ‌నువు ఉన్న నాయ‌కుడు.

మ‌రి ప‌య్యావులే చెబుతున్నారంటే.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధార‌ణంగా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని తెలిసినా.. త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న ప‌రిస్థితి పొరుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే(జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి) జ‌గ‌న్‌కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయ‌న‌పై అభిమానం ఉన్నా.. కేసుల‌కు మాత్రం సిద్ధంగా ఉండ‌రు క‌దా!

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను క‌నుక‌.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మ‌రింత క‌కావిక‌లం అవుతుంద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ముందే త‌ట్ట‌బుట్ట స‌ర్దుకుని సేఫ్ జోన్‌కు చేరుకున్నా.. ఆశ్చ‌ర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జ‌న‌సేన‌నా, బీజేపీనా అన్న‌ది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్న‌వారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మ‌ర‌క్ష‌ణ పొందే ప్ర‌య‌త్నం చేయొచ్చు. మిగిలిన వారు అవ‌కాశాల‌ను బ‌ట్టి త‌మ త‌మ ఇష్టానుసారం.. అవ‌త‌ల నుంచి వ‌చ్చే అవ‌కాశం మేర‌కు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌క‌ట‌న అయితే.. సీరియ‌స్‌గానే ఉంది. మ‌రి వ‌చ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

This post was last modified on July 27, 2024 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago