Political News

వైసీపీలో ఎమ్మెల్యేలు మిగ‌ల‌రా?

“జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోక‌పోతే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌కు మిగ‌ల‌రు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీల‌క‌మైన వ్యాఖ్య‌.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవ‌రూ మిగ‌ల‌రు! అనే. మ‌రి ప‌య్యావుల వ్యూహం ఏంటి? ఈయ‌నేమీ చిన్నా చిత‌కా నాయ‌కుడు కాదు. సీనియ‌ర్ నేత‌, పైగా సుదీర్ఘ అనుభ‌వం.. చంద్ర‌బాబుతో చ‌నువు ఉన్న నాయ‌కుడు.

మ‌రి ప‌య్యావులే చెబుతున్నారంటే.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధార‌ణంగా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని తెలిసినా.. త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న ప‌రిస్థితి పొరుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే(జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి) జ‌గ‌న్‌కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయ‌న‌పై అభిమానం ఉన్నా.. కేసుల‌కు మాత్రం సిద్ధంగా ఉండ‌రు క‌దా!

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను క‌నుక‌.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మ‌రింత క‌కావిక‌లం అవుతుంద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ముందే త‌ట్ట‌బుట్ట స‌ర్దుకుని సేఫ్ జోన్‌కు చేరుకున్నా.. ఆశ్చ‌ర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జ‌న‌సేన‌నా, బీజేపీనా అన్న‌ది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్న‌వారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మ‌ర‌క్ష‌ణ పొందే ప్ర‌య‌త్నం చేయొచ్చు. మిగిలిన వారు అవ‌కాశాల‌ను బ‌ట్టి త‌మ త‌మ ఇష్టానుసారం.. అవ‌త‌ల నుంచి వ‌చ్చే అవ‌కాశం మేర‌కు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌క‌ట‌న అయితే.. సీరియ‌స్‌గానే ఉంది. మ‌రి వ‌చ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

This post was last modified on July 27, 2024 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 minutes ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

1 hour ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

2 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

3 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

3 hours ago

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…

3 hours ago