Political News

వైసీపీలో ఎమ్మెల్యేలు మిగ‌ల‌రా?

“జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోక‌పోతే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌కు మిగ‌ల‌రు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీల‌క‌మైన వ్యాఖ్య‌.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవ‌రూ మిగ‌ల‌రు! అనే. మ‌రి ప‌య్యావుల వ్యూహం ఏంటి? ఈయ‌నేమీ చిన్నా చిత‌కా నాయ‌కుడు కాదు. సీనియ‌ర్ నేత‌, పైగా సుదీర్ఘ అనుభ‌వం.. చంద్ర‌బాబుతో చ‌నువు ఉన్న నాయ‌కుడు.

మ‌రి ప‌య్యావులే చెబుతున్నారంటే.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధార‌ణంగా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని తెలిసినా.. త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న ప‌రిస్థితి పొరుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే(జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి) జ‌గ‌న్‌కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయ‌న‌పై అభిమానం ఉన్నా.. కేసుల‌కు మాత్రం సిద్ధంగా ఉండ‌రు క‌దా!

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను క‌నుక‌.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మ‌రింత క‌కావిక‌లం అవుతుంద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ముందే త‌ట్ట‌బుట్ట స‌ర్దుకుని సేఫ్ జోన్‌కు చేరుకున్నా.. ఆశ్చ‌ర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జ‌న‌సేన‌నా, బీజేపీనా అన్న‌ది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్న‌వారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మ‌ర‌క్ష‌ణ పొందే ప్ర‌య‌త్నం చేయొచ్చు. మిగిలిన వారు అవ‌కాశాల‌ను బ‌ట్టి త‌మ త‌మ ఇష్టానుసారం.. అవ‌త‌ల నుంచి వ‌చ్చే అవ‌కాశం మేర‌కు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌క‌ట‌న అయితే.. సీరియ‌స్‌గానే ఉంది. మ‌రి వ‌చ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

This post was last modified on July 27, 2024 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago