Political News

వైసీపీలో ఎమ్మెల్యేలు మిగ‌ల‌రా?

“జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోక‌పోతే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌కు మిగ‌ల‌రు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీల‌క‌మైన వ్యాఖ్య‌.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవ‌రూ మిగ‌ల‌రు! అనే. మ‌రి ప‌య్యావుల వ్యూహం ఏంటి? ఈయ‌నేమీ చిన్నా చిత‌కా నాయ‌కుడు కాదు. సీనియ‌ర్ నేత‌, పైగా సుదీర్ఘ అనుభ‌వం.. చంద్ర‌బాబుతో చ‌నువు ఉన్న నాయ‌కుడు.

మ‌రి ప‌య్యావులే చెబుతున్నారంటే.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధార‌ణంగా త‌మ‌కు ముప్పు పొంచి ఉంద‌ని తెలిసినా.. త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న ప‌రిస్థితి పొరుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే(జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి) జ‌గ‌న్‌కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయ‌న‌పై అభిమానం ఉన్నా.. కేసుల‌కు మాత్రం సిద్ధంగా ఉండ‌రు క‌దా!

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను క‌నుక‌.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మ‌రింత క‌కావిక‌లం అవుతుంద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ముందే త‌ట్ట‌బుట్ట స‌ర్దుకుని సేఫ్ జోన్‌కు చేరుకున్నా.. ఆశ్చ‌ర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జ‌న‌సేన‌నా, బీజేపీనా అన్న‌ది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్న‌వారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మ‌ర‌క్ష‌ణ పొందే ప్ర‌య‌త్నం చేయొచ్చు. మిగిలిన వారు అవ‌కాశాల‌ను బ‌ట్టి త‌మ త‌మ ఇష్టానుసారం.. అవ‌త‌ల నుంచి వ‌చ్చే అవ‌కాశం మేర‌కు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌క‌ట‌న అయితే.. సీరియ‌స్‌గానే ఉంది. మ‌రి వ‌చ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

This post was last modified on July 27, 2024 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

44 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago