Political News

అసెంబ్లీకి మ‌ళ్లీ డుమ్మా.. వాయిస్ కోల్పోతున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమ‌వారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు వ‌చ్చి.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. రోజు రాలేదు. ఆ వెంట‌నే ఢిల్లీలో ధ‌ర్నా ఉందంటూ.. అక్క‌డ‌కు వెళ్లిపోయారు. త‌న‌తో పాటు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగ‌ళ‌వారం, బుధ‌వారం స‌భ‌కు డుమ్మా కొట్టారు.

ఇక‌, ఢిల్లీలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని.. గురువారం ఉద‌య‌మే తాడేప‌ల్లికి చేరుకున్నారు జ‌గ‌న్‌. అయిన‌ప్ప‌టికీ.. గురువారం ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం స‌భ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తార‌న్న విష‌యం తెలిసి కూడా.. త‌న వారిని కూడా పంపించ‌కుండా.. కాల‌క్షేపం చేశారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. ధ‌ర్నా జ‌రిగిన విధానంపై చ‌ర్చించారు. మున్ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై వారితో సూచ‌న‌లు, స‌ల‌హాలు పంచుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ క‌నుక స‌భ‌కు వ‌చ్చి ఉంటే.. ఆయ‌న వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉండేది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం కూడా శ్వేత‌ప‌త్రాల‌తో హుడావుడి చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌కుడుమ్మా కొట్ట‌డం.. త‌న వారిని కూడా.. డుమ్మా కొట్టించ‌డంతో స‌భ‌లో చెబుతున్న‌వ‌న్నీ కూడా.. వాస్త‌వాలేన‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించే అవ‌కాశం మెండుగా ఉంటుంది. మ‌రి.. ఇదే జ‌రిగి.. ప్ర‌జ‌లు వాటిని విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్‌కు సొంత ఇమేజ్ మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. శాస‌న మండ‌లిలో బ‌లం ఎక్కువ‌గా ఉన్నప్ప‌టికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండ‌లికి కూడా రావ‌డం లేదు. తొలి రోజు మాత్ర‌మే వ‌చ్చిన ఎమ్మెల్సీలు మ‌రుస‌టి రోజు నుంచి గుడ్ బై చెప్పిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండ‌లి బోసిపోయిన‌ట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీల‌తోనే మండలి న‌డుస్తోంది. మంత్రులు త‌మ ప్ర‌సంగాల‌ను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాస‌న స‌భ‌కు, ఇడు మండ‌లికీ రాక‌పోవ‌డంతో వైసీపీ ప్రాభ‌వం మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 26, 2024 2:57 am

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

1 hour ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

1 hour ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

7 hours ago