Political News

అసెంబ్లీకి మ‌ళ్లీ డుమ్మా.. వాయిస్ కోల్పోతున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమ‌వారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు వ‌చ్చి.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. రోజు రాలేదు. ఆ వెంట‌నే ఢిల్లీలో ధ‌ర్నా ఉందంటూ.. అక్క‌డ‌కు వెళ్లిపోయారు. త‌న‌తో పాటు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగ‌ళ‌వారం, బుధ‌వారం స‌భ‌కు డుమ్మా కొట్టారు.

ఇక‌, ఢిల్లీలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని.. గురువారం ఉద‌య‌మే తాడేప‌ల్లికి చేరుకున్నారు జ‌గ‌న్‌. అయిన‌ప్ప‌టికీ.. గురువారం ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం స‌భ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తార‌న్న విష‌యం తెలిసి కూడా.. త‌న వారిని కూడా పంపించ‌కుండా.. కాల‌క్షేపం చేశారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. ధ‌ర్నా జ‌రిగిన విధానంపై చ‌ర్చించారు. మున్ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై వారితో సూచ‌న‌లు, స‌ల‌హాలు పంచుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ క‌నుక స‌భ‌కు వ‌చ్చి ఉంటే.. ఆయ‌న వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉండేది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం కూడా శ్వేత‌ప‌త్రాల‌తో హుడావుడి చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌కుడుమ్మా కొట్ట‌డం.. త‌న వారిని కూడా.. డుమ్మా కొట్టించ‌డంతో స‌భ‌లో చెబుతున్న‌వ‌న్నీ కూడా.. వాస్త‌వాలేన‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించే అవ‌కాశం మెండుగా ఉంటుంది. మ‌రి.. ఇదే జ‌రిగి.. ప్ర‌జ‌లు వాటిని విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్‌కు సొంత ఇమేజ్ మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. శాస‌న మండ‌లిలో బ‌లం ఎక్కువ‌గా ఉన్నప్ప‌టికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండ‌లికి కూడా రావ‌డం లేదు. తొలి రోజు మాత్ర‌మే వ‌చ్చిన ఎమ్మెల్సీలు మ‌రుస‌టి రోజు నుంచి గుడ్ బై చెప్పిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండ‌లి బోసిపోయిన‌ట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీల‌తోనే మండలి న‌డుస్తోంది. మంత్రులు త‌మ ప్ర‌సంగాల‌ను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాస‌న స‌భ‌కు, ఇడు మండ‌లికీ రాక‌పోవ‌డంతో వైసీపీ ప్రాభ‌వం మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 26, 2024 2:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

45 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

53 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago