Political News

అసెంబ్లీకి మ‌ళ్లీ డుమ్మా.. వాయిస్ కోల్పోతున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమ‌వారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు వ‌చ్చి.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. రోజు రాలేదు. ఆ వెంట‌నే ఢిల్లీలో ధ‌ర్నా ఉందంటూ.. అక్క‌డ‌కు వెళ్లిపోయారు. త‌న‌తో పాటు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగ‌ళ‌వారం, బుధ‌వారం స‌భ‌కు డుమ్మా కొట్టారు.

ఇక‌, ఢిల్లీలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని.. గురువారం ఉద‌య‌మే తాడేప‌ల్లికి చేరుకున్నారు జ‌గ‌న్‌. అయిన‌ప్ప‌టికీ.. గురువారం ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం స‌భ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తార‌న్న విష‌యం తెలిసి కూడా.. త‌న వారిని కూడా పంపించ‌కుండా.. కాల‌క్షేపం చేశారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. ధ‌ర్నా జ‌రిగిన విధానంపై చ‌ర్చించారు. మున్ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై వారితో సూచ‌న‌లు, స‌ల‌హాలు పంచుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ క‌నుక స‌భ‌కు వ‌చ్చి ఉంటే.. ఆయ‌న వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉండేది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం కూడా శ్వేత‌ప‌త్రాల‌తో హుడావుడి చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌కుడుమ్మా కొట్ట‌డం.. త‌న వారిని కూడా.. డుమ్మా కొట్టించ‌డంతో స‌భ‌లో చెబుతున్న‌వ‌న్నీ కూడా.. వాస్త‌వాలేన‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించే అవ‌కాశం మెండుగా ఉంటుంది. మ‌రి.. ఇదే జ‌రిగి.. ప్ర‌జ‌లు వాటిని విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్‌కు సొంత ఇమేజ్ మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. శాస‌న మండ‌లిలో బ‌లం ఎక్కువ‌గా ఉన్నప్ప‌టికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండ‌లికి కూడా రావ‌డం లేదు. తొలి రోజు మాత్ర‌మే వ‌చ్చిన ఎమ్మెల్సీలు మ‌రుస‌టి రోజు నుంచి గుడ్ బై చెప్పిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండ‌లి బోసిపోయిన‌ట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీల‌తోనే మండలి న‌డుస్తోంది. మంత్రులు త‌మ ప్ర‌సంగాల‌ను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాస‌న స‌భ‌కు, ఇడు మండ‌లికీ రాక‌పోవ‌డంతో వైసీపీ ప్రాభ‌వం మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 26, 2024 2:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

6 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago