ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వచ్చి.. హడావుడి చేసిన జగన్.. తర్వాత.. రోజు రాలేదు. ఆ వెంటనే ఢిల్లీలో ధర్నా ఉందంటూ.. అక్కడకు వెళ్లిపోయారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగళవారం, బుధవారం సభకు డుమ్మా కొట్టారు.
ఇక, ఢిల్లీలో కార్యక్రమాన్ని ముగించుకుని.. గురువారం ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు జగన్. అయినప్పటికీ.. గురువారం ఆయన సభకు రాకపోవడం గమనార్హం. గురువారం సభలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేస్తారన్న విషయం తెలిసి కూడా.. తన వారిని కూడా పంపించకుండా.. కాలక్షేపం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో భేటీ అయిన.. జగన్.. ధర్నా జరిగిన విధానంపై చర్చించారు. మున్ముందు చేపట్టే కార్యక్రమాలపై వారితో సూచనలు, సలహాలు పంచుకున్నారు.
అయితే.. జగన్ కనుక సభకు వచ్చి ఉంటే.. ఆయన వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉండేది. మరోవైపు.. ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలతో హుడావుడి చేస్తున్న నేపథ్యంలో జగన్ సభకుడుమ్మా కొట్టడం.. తన వారిని కూడా.. డుమ్మా కొట్టించడంతో సభలో చెబుతున్నవన్నీ కూడా.. వాస్తవాలేనని ప్రజలు విశ్వసించే అవకాశం మెండుగా ఉంటుంది. మరి.. ఇదే జరిగి.. ప్రజలు వాటిని విశ్వసిస్తే.. జగన్కు సొంత ఇమేజ్ మరింత దెబ్బతినే అవకాశం పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. శాసన మండలిలో బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి కూడా రావడం లేదు. తొలి రోజు మాత్రమే వచ్చిన ఎమ్మెల్సీలు మరుసటి రోజు నుంచి గుడ్ బై చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండలి బోసిపోయినట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీలతోనే మండలి నడుస్తోంది. మంత్రులు తమ ప్రసంగాలను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాసన సభకు, ఇడు మండలికీ రాకపోవడంతో వైసీపీ ప్రాభవం మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…