Political News

డిక్లరేషన్ పంచాయితీలోకి మోడీని లాగేసిన కొడాలి

గడిచిన కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం జగన్.. డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశంపై సాగుతున్న రచ్చ గురించి తెలిసిందే.

అన్య మతస్తుడైన ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనటమే కాదు.. అసలు ఏ గుడిలో కూడా లేని డిక్లరేషన్ వ్యవహారం తిరుమలలో ఎందుకు ఉంటుంది? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఈ ఇష్యూ మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని తాజాగా మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.

డిక్లరేషన్ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు మండిపడిన నేపథ్యంలో ఆయన గురి ఈసారి ఏకంగా ప్రధాని మీదకు వెళ్లింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే ప్రధాని సతీ సమేతంగా ఆలయానికి రావాలన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రధాని మోడీకి చెప్పాలన్న మాటను చెప్పేశారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవిని చేపట్టిన తర్వాతే ఏపీలోని ఆలయాలపై దాడులు పెరిగినట్లుగా ఆరోపించారు.

స్వామి వారి మీద నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తున్నారని.. దర్శనం సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మతంతో సంబంధం లేదని.. ఆయన గుడికి వచ్చినప్పుడు హిందువులా.. చర్చికి వెళ్లినప్పుడు క్రైస్తవుడిగా.. మసీదుకు వెళ్లే వేళలో నవాబులా ఉంటారన్నారు.

తన రాజకీయాల కోసం తిరుమల శ్రీనివాసుడ్ని కూడా చంద్రబాబు లాగేస్తున్నారన్నారు. శ్రీవారి దయ వల్లనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. అలాంటి ఆయన పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నప్పుడు డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలన్న ప్రశ్నను సంధించారు. అధినేత మనసు దోచుకునే తొందరలో.. ప్రధాని మోడీని ఇష్యూలోకి లాగేందుకు వెనుకాడని కొడాలి వారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on September 23, 2020 6:31 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

1 hour ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

1 hour ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

2 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

2 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

3 hours ago

స్పిరిట్ ఊచకోతకు ‘అనంత’ ఎలివేషన్స్

​పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ…

3 hours ago