Political News

నిడ‌ద‌వోలులో బాబు నిర్ణ‌యం నేటికీ వేధిస్తోందా?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలో.. టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు అనుస‌రించిన వ్యూహం బెడిసి కొట్టింది. అయితే, స‌ద‌రు వ్యూహం తాలూకు చేదు అనుభ‌వం.. ఇప్ప‌టికీ.. బాబును వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఇప్పుడు టీడీపీ జెండా ప‌ట్టుకునేవారు.. టీడీపీ తాలూకు వాయిస్ వినిపించేవారు కూడా క‌రువ‌య్యారు. పైగా.. పార్టీకి ఎంత‌చేసినా.. ప్ర‌యోజ‌నం ఏంటి? చివ‌రాఖ‌రుకు టికెట్ వేరేవారు ఎత్తుకుపోతారు? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ చంద్ర‌బాబు వేసిన పాచిక ఏంటి.. విక‌టించిన విధానం ఏంటి.. చూద్దాం..

నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్క‌డ 2009, 2014 ఎన్నిక‌ల్లో బూరుగుప‌ల్లి శేషారావు చ‌క్రం తిప్పారు. పార్టీని బ‌లోపేతం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సోద‌రుడు బూరుగుప‌ల్లి వేణుగోపాల‌కృష్ణ అన్ని విధాలా స‌హ‌క‌రించారు. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌గా ఉన్న గోపాల కృష్ణ‌.. పార్టీలోనూ షాడో నాయ‌కుడిగా ఎదిగారు. ఆదిలో శేషారావు ఈ ప‌రిణామాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఇద్ద‌రం క‌లిసే క‌దా.. రాజ‌కీయాలు చేస్తున్నాం.. అనుకున్నారు. కానీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో వేణుగోపాల కృష్ణ.. నేరుగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లి.. టికెట్ త‌న‌కు ఇవ్వాల‌ని కోరారు.

మ‌రోప‌క్క‌, సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు .. పార్టీని నిల‌బెట్టిందే నేను నాకు టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో చంద్ర‌బాబు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌తోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో నామినేష‌న్ల‌కు గ‌డువు స‌మీపించే వ‌ర‌కు కూడా ఇక్క‌డ అభ్య‌ర్థిని తేల్చ‌లేదు. చివ‌రికి.. ఈ గంద‌ర‌గోళం మ‌ధ్య‌లో శేషారావుకే టికెట్ ఇచ్చారు. అయితే, ఆయ‌న 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ప‌రిణామం.. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములకు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఎటొచ్చీ.. పార్టీపైన‌, చంద్ర‌బాబుపైన ప్ర‌భావం ప‌డింది. త‌న ఓట‌మికి చంద్ర‌బాబు కార‌ణ‌మ‌ని శేషారావు వ్యాఖ్యానించ‌డంతోపాటు. పార్టీకి దూరంగా ఉంటున్నారు.

అంతేకాదు, పార్టీ కోసం క‌ష్టించినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌న‌కు టికెట్ ఇస్తార‌నే గ్యారెంటీ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోప‌క్క‌, పార్టీకి గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు నిధులు ఇచ్చిన శేషారావు సోద‌రుడు.. బాబు వైఖ‌రి త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, టికెట్ ఇస్తాన‌ని చెప్పి.. ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలా ఇద్ద‌రు సోద‌రుల మ‌ధ్య చంద్ర‌బాబు వ్యూహం చిక్కులు తెచ్చింది. ఫ‌లితంగా నిడ‌ద‌వోలు వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని ప‌ట్టించుకునే నాథుడు క‌రువ‌య్యార‌ని అంటున్నారు స్థానిక నాయ‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 24, 2020 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

5 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

8 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

9 hours ago

కేర‌ళం నాడి: విజ‌య‌న్‌.. ప‌రాజ‌య‌న్‌.. కాంగ్రెస్‌కే మొగ్గు!

కేర‌ళంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నాయి……

10 hours ago

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి.…

10 hours ago

మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…

దీదీనా-మోదీనా నినాదంతో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజ‌యం ద‌క్కించు కుంటుంద‌ని…

10 hours ago