పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో.. టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు గత ఏడాది ఎన్నికలకు ముందు అనుసరించిన వ్యూహం బెడిసి కొట్టింది. అయితే, సదరు వ్యూహం తాలూకు చేదు అనుభవం.. ఇప్పటికీ.. బాబును వెంటాడుతుండడం గమనార్హం. ఇక్కడ ఇప్పుడు టీడీపీ జెండా పట్టుకునేవారు.. టీడీపీ తాలూకు వాయిస్ వినిపించేవారు కూడా కరువయ్యారు. పైగా.. పార్టీకి ఎంతచేసినా.. ప్రయోజనం ఏంటి? చివరాఖరుకు టికెట్ వేరేవారు ఎత్తుకుపోతారు? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు వేసిన పాచిక ఏంటి.. వికటించిన విధానం ఏంటి.. చూద్దాం..
నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో బూరుగుపల్లి శేషారావు చక్రం తిప్పారు. పార్టీని బలోపేతం చేశారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్ని విధాలా సహకరించారు. ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్న గోపాల కృష్ణ.. పార్టీలోనూ షాడో నాయకుడిగా ఎదిగారు. ఆదిలో శేషారావు ఈ పరిణామాన్ని లైట్గా తీసుకున్నారు. ఇద్దరం కలిసే కదా.. రాజకీయాలు చేస్తున్నాం.. అనుకున్నారు. కానీ, గత ఏడాది ఎన్నికల సమయంలో వేణుగోపాల కృష్ణ.. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి.. టికెట్ తనకు ఇవ్వాలని కోరారు.
మరోపక్క, సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు .. పార్టీని నిలబెట్టిందే నేను నాకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు ఇద్దరు అన్నదమ్ములతోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో నామినేషన్లకు గడువు సమీపించే వరకు కూడా ఇక్కడ అభ్యర్థిని తేల్చలేదు. చివరికి.. ఈ గందరగోళం మధ్యలో శేషారావుకే టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం.. ఇద్దరు అన్నదమ్ములకు ఎలా ఉన్నప్పటికీ.. ఎటొచ్చీ.. పార్టీపైన, చంద్రబాబుపైన ప్రభావం పడింది. తన ఓటమికి చంద్రబాబు కారణమని శేషారావు వ్యాఖ్యానించడంతోపాటు. పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అంతేకాదు, పార్టీ కోసం కష్టించినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, పార్టీకి గత ఏడాది ఎన్నికల వరకు నిధులు ఇచ్చిన శేషారావు సోదరుడు.. బాబు వైఖరి తనకు నచ్చలేదని, టికెట్ ఇస్తానని చెప్పి.. ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు సోదరుల మధ్య చంద్రబాబు వ్యూహం చిక్కులు తెచ్చింది. ఫలితంగా నిడదవోలు వంటి కీలకమైన నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకునే నాథుడు కరువయ్యారని అంటున్నారు స్థానిక నాయకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 24, 2020 1:52 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…