Political News

ప‌వ‌న్ మంత్రి అయ్యాడు.. రిక్షా- ఆటో అయింది.. ఏంటా క‌థ‌!!

అభిమానుల ఉత్సాహం ఒక్కొక్క‌రిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు గుర్రం ఎక్కాల‌ని చాలా మంది పార్టీల‌కు అతీతంగా కోరుకున్నారు. కొంద‌రు దేవుళ్ల‌కు కూడా మొక్కుకున్నారు. మ‌రికొంద‌రు మ‌రో రూపంలో ఆయ‌న గెల‌వాల‌ని కోరుకున్నారు. మొత్తానికి 70 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ గెలిచారు. ఈ క్ర‌మంలో తూర్పుగోదావ‌రికి చెందిన‌ ఓ యువ‌తి.. ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యానికి మోకాళ్ల‌పై మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్న విష‌యం తెలిసిందే.

అలానే.. ‘పిఠాపురంలో ప‌వ‌న్ గెలిస్తే..’ అంటూ ఓ అత్యంత సామాన్య‌మైన రిక్షా కార్మికుడి కుటుంబం కూడా ఆక్షాంచింది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ రిక్షా కార్మికుడి భార్య‌.. ప‌వ‌న్ పై అభిమానంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓ కీల‌క వ్యాఖ్య చేసింది. “మా ప‌వ‌న్ గెలిస్తే.. మా ఆయ‌న రిక్షా తొక్కి తెచ్చిన సొమ్ముతో ఊరంతా పండ‌గ చేస్తా” అంటూ త‌న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసింది. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ప‌వ‌న్ వ‌ర‌కు చేరాయి. ఒక సంద‌ర్భంలో ఆయ‌న “ప్ర‌జ‌లు న‌న్ను చాలా బ‌లంగా కోరుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.

అన్న‌ట్టుగా.. ప‌లువురు ఆకాంక్షించిన‌ట్టుగానే ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో రిక్షా కార్మికుడి భార్య మ‌రియ‌మ్మ‌.. ఒక‌రోజు రిక్షా తొక్క‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో స్వీట్లు కొని చుట్టుప‌క్క‌ల వారికి పంచి పెట్టింది. ఈ విష‌యంలో మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలిసింది. దీంతో చ‌లించిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆ కుటుంబానికి ‘స్పెషల్ గిఫ్ట్’ అందించాల‌ని పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించారు. అంతే.. ఇంకేముంది.. జ‌న‌సైనికులు క‌దిలారు. ఆ కుటుంబానికి ఏ ప‌దో ప‌ర‌కో ఇస్తే ప్ర‌యోజ‌నం లేద‌నుకున్నారు. వెంట‌నే రిక్షా కాస్తా.. ఆటో అయిపోయింది!

నిరుపేద కుటుంబానికి జీవనోపాధి మెరుగుపరిచేలా స‌రికొత్త‌ ఆటోను జ‌న‌సేన నాయ‌కులు అందించారు. దీనిపై మరియమ్మ, ఆమె భర్త హర్షం వ్యక్తం చేస్తూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. త‌మ జీవితాల్లో వెలుగు వ‌చ్చిందంటూ మరియమ్మ సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న భర్త 20 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆటో అందించడంతో త‌మకు మ‌రింత ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంద‌ని మ‌రియ‌మ్మ అన్నారు. జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

13 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

22 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago