Political News

అదే తప్పును చంద్రబాబు రెండోసారి కూడా చేస్తున్నాడా ?

చంద్రబాబునాయుడు ఒకే తప్పును రెండోసారి కూడా చేస్తున్నారు. మొదటిసారి పార్టీలోని నేతలు వారించినా వినలేదు. దాని ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్నారు. మళ్ళీ అదే తప్పును ఇపుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కాకపోతే మొదటిసారి తప్పు చేసినపుడు అధికారంలో ఉన్నారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారంతే. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే తిరుమలకు వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోమని చంద్రబాబు పిలుపివ్వటమే. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు జగన్ బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం జరిగే గరుడోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

అందుకనే మధ్యాహ్నానికి జగన్ తిరుపతి చేరుకుని అలిపిరి గుండా తిరుమల చేరకుంటారు. ఈ సందర్భంలోనే జగన్ ను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపిచ్చారు. అన్యమతస్తుడైన జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు గట్టిగా వాదన మొదలుపెట్టారు. జగన్ను అడ్డుకుని డిక్లరేషన్ ఇచ్చేట్లుగా పట్టుబట్టి ఒప్పించాలంటూ నేతలకు పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి కాదు ఇది చివరా కాదు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్ ఎన్నోసార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎప్పుడు వైఎస్ కుటుంబం విషయంలో లేని ‘అన్యమతస్తులు’ అనే అభ్యంతరం ఇపుడే చంద్రబాబు ఎందుకు లేవదీస్తున్నట్లు ? అసలు ఇటువంటి అభ్యంతరాలు, మతపరమైన రాజకీయాలు చేయటం వల్ల చంద్రబాబుకు వచ్చే లాభం ఏమిటో అర్ధం కావటం లేదు. అనవసరంగా టిడిపి నేతలు అలిపిరి దగ్గర కాసేపు గోల చేస్తారు, పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి తీసుకెళతారు. ఆ ఘటనలను మీడియా కొద్దిసేపు చూపుతుందంతే. కొద్దిసేపు మీడియా ప్రచారానికే చంద్రబాబు ఇటువంటి రాజకీయం చేయటమేంటో ?

గతంలో కూడా ఇటువంటి రాజకీయమే చంద్రబాబు చేశారు. స్వామివారి దర్శనం కోసం అప్పట్లో బిజెపి అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా తిరుమలకు వచ్చినపుడు కూడా టిడిపి శ్రేణులు అడ్డుకుని నానా గోల చేశాయి. అమిత్ ప్రయాణిస్తున్న కారును అడ్డుుకన్నారు. ఈ క్రమంలో కొందరు అతివాదులు చెప్పులు, కర్రలు, రాళ్ళు వేసి గోల చేశారు. అది వేరే విషయం. అప్పుడు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్సు పెట్టి మరీ తన నేతలను రెచ్చగొట్టారు. అమిత్ రాక సందర్భంగా నిరసనను తెలియజేయాలని ఆదేశించారు. దాంతో అప్పట్లో జరిగిన గొడవ జాతీయస్ధాయిలో చర్చకు దారితీసింది. అప్పుడంటే చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కాస్త శాంతియుతంగా ఉంటారు. కానీ ఇఫుడు అలా కాదుకదా. పోలీసులు నేతలపై కేసులు పెట్టి జైళ్ళలో పడేస్తే బాధ్యతెవరిది ?

This post was last modified on September 24, 2020 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

31 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

45 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago