Political News

జీతం ఇస్తామన్నారు.. తీసుకోలేదు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.4 వేలకు పెంచిన పింఛన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా జులై 1న పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంంలోని గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి ఆయన మాట్లాడారు. తనకు అధికారులు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు జీతం ఇస్తామన్నా.. పంచాయితీరాజ్ శాఖలో జరిగిన నిధుల గోల్‌మాల్ చూసి జీతం తీసుకోబుద్ధి కాలేదని పవన్ చెప్పడం గమనార్హం.

‘‘నేను జీతం తీసుకునే పని చేద్దామని అనుకున్నా. కానీ పంచాయితీరాజ్ శాఖలో చూస్తే ఎక్కడా నిధులు లేవు. మొత్తం ఖాళీ చేసేశారు. వేల కోట్లు ఏమయ్యాయో తెలియదు. ఇటీవల అధికారులు నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీకి వచ్చిన రోజులకు 35 వేలో ఎంతో జీతం ఇస్తాం అన్నారు. కానీ పంచాయితీరాజ్ శాఖరలో జరిగింది చూశాక డబ్బులు తీసుకోబుద్ధి కాలేదు.

జీతం తీసుకోకుండా జనం కోసం సొంత డబ్బులు పెట్టుకుని పని చేయాలనుకున్నా. నా 25 ఏళ్ల సినిమా వృత్తిలో దాదాపు వంద కోట్లకు పైగా ట్యాక్స్ కట్టాను. కానీ మా ఆడిటర్‌తో మొత్తం మీద గంటన్నర కంటే ఎక్కువ కూర్చోలేదు. కానీ మొన్న పంచాయితీ రాజ్ శాఖ ఆడిట్ లెక్కల మీద ఒక్కో సెషన్లో నాలుగైదు గంటలు కూర్చున్నాను. ఒక్కో సెషన్లో మూణ్నాలుగు వేల కోట్ల నిధులు మాయం చేసినట్లు తేలింది. ఎక్కడా డబ్బులు మిగలకుండా మాయం చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం’’ అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

This post was last modified on July 1, 2024 4:47 pm

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

41 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

1 hour ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago