Political News

ఆ ‘గ్రాఫ్’ పెంచాలంటే.. నారా లోకేష్ ఏం చేయాలి?

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. యువ‌గ‌ళం మ‌హిమో.. లేక త‌న‌లోని త‌ప‌నో.. మొత్తానికి నారా లోకేష్‌.. మంత్రిగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టగానే.. ప్రతి రోజూ ఆయ‌న ప్ర‌జాద‌ర్బార్ పేరుతో స‌మ‌స్య‌లు, విన‌తులు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభించారు. ప్ర‌స్తుతం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరికి చెందిన ప్ర‌జ‌లు ఈ ద‌ర్బార్‌ను జోరుగా వినియోగించుకుని త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో గ‌త వైసీపీ పాల‌న‌లో కొన్ని సంవ‌త్స‌రాలుగా అప‌రిష్కృతంగా ఉన్న అనేక‌ స‌మ‌స్య‌లు, మ‌రికొన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు(వ్యాధులు, రోగాలు, ఇళ్ల ప‌ట్టాల‌కు చెందిన‌) చెప్పుకొని వాటి ప‌రిష్కారంతో ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. దాదాపు ప్ర‌తి రోజూ వేల మంది త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. అన్ని స‌మ‌స్య‌ల‌ను ఓపిగా వింటున్న నారా లోకేష్‌.. వాటికి సంబంధించి ప‌రిష్కారానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. శ‌ని, ఆదివారాలు త‌ప్ప‌.. మిగిలిన ఐదు రోజుల్లో ఉద‌యం 7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జాద‌ర్బార్ ఉంటోంది.

ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌ల‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు మంగ‌ళగిరి వ్యాప్తంగా “స‌మ‌స్య చెప్పుకొంటే ప‌రిష్కారం అవుతుంద‌”న్న భ‌రోసా క‌లుగుతోంది. ఈ ప‌రిణామంతో నారా లోకేష్ గ్రాఫ్ పెరిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి అయినా. త‌మ‌కు ఏం చేస్తారు? అనుకున్న సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఇప్పుడు దివిటీగా మారారు. ప్ర‌జాద‌ర్బార్ వ్య‌వ‌హారం కేబినెట్‌లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే.. ఈ గ్రాఫ్ ను మ‌రింత పెంచుకునేందుకు నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వారానికి ఒక సారి తానే స్వ‌యంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేవారు. దీంతో ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఆద‌రించారు. ఇక‌, ఇప్పుడు నారా లోకేష్ త‌న నివాసాన్ని ద‌ర్బార్ చేసుకున్నారు. ఇది నారా లోకేష్‌కు ప్రజానేత‌గా గ్రాఫ్ ఇచ్చింది. దీనిని ఇప్పుడు కాపాడు కోవ‌డంతోపాటు.. మున్ముందు మ‌రింత పెంచుకునేందుకు నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా నెల‌కు ఒక‌సారి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తే బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో మ‌రింత స‌మ‌యం వెచ్చించాల‌ని కూడా.. స్థానికులు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఇది ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉంది.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

12 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

17 minutes ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

3 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

4 hours ago