Political News

మంత్రులపై ఫిర్యాదులు..రెండు వైపులా దాడులు

ఇద్దరు మంత్రులపై రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్మికశాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పైన, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ దగ్గర నుండి మంత్రి కొడుకు ఈశ్వర్ బెంజి కారు బహుమానంగా తీసుకున్నట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రిపై అవినీతి నిరోధక శాఖ ఫిర్యాదులు స్వీకరించి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ దాదాపు ఏడు జిల్లాల్లోని టిడిపి నేతలు తమ జిల్లాల్లోని ఏసిబి కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు.

ఇదే అంశంపై మంత్రేమో టిడిపి నేతలపై మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు. తమ కొడుకు అసలు కార్తీక్ దగ్గర నుండి ఎటువంటి బహుమానాలు అందుకోలేదన్నారు. కొత్త కారుకు రిబ్బన్ కత్తిరించమని కార్తీర్ కోరినందునే కారుముందు నిలబడి ఫొటోలు దిగినట్లు చెబుతున్నారు.

ఇక కోడాలి సంగతి తీసుకుంటే ఈయన వ్యవహారశైలే వేరు. చంద్రబాబునాయుడు, లోకేష్+టిడిపి నేతలపై మంత్రి మాటలు, కామెంట్లు చాలా దురుసుగా ఉంటాయి. నిజానికి కొడాలి మాటల హద్దులు మీరిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అనగానే మంత్రి ఒళ్ళుమరచిపోయి రెచ్చిపోతారనటంలో సందేహం లేదు. ఇటువంటి కొడాలి తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల దర్శనం సందర్భంగా ఇచ్చే డిక్లరేషన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసలే మత రాజకీయాలపై దూకుడుగా వెళుతున్న బిజెపి నేతలకు కొడాలి వ్యాఖ్యలు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. విజయవాడలో వెండి సింహాలు పోవటం, కొన్ని విగ్రహాలకు చేతులు విరగటం తదితరాలపై కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపైనే బిజెపి అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.

దాంతో వాళ్ళు రెచ్చిపోతు నానా గోల చేస్తున్నారు. వెంటనే మంత్రిపై యాక్షన్ తీసుకోవాలంటూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు మంత్రులపై ప్రతిపక్షాల నేతలు ఫిర్యాదులు చేసేయగానే పోలీసులు యాక్షన్ తీసుకుంటారా ? తీసుకోరన్న విషయం అందరికీ తెలుసు. అయినా ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారంటే కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని అర్ధం చేసుకోవాలి.

This post was last modified on September 22, 2020 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

44 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago