Political News

ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు

దక్షిణాదివారంటే ఉత్తరాది వారికి చులకన భావమన్న వాదన దక్షిణాది ప్రజలతోపాటు రాజకీయ నేతల్లోనూ చాలాకాలంగా ఉంది. హిందీ భాష విషయంలో ఉత్తరాది వారి డామినేషన్ ను తమిళ తంబీలు గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు అనేకం. ఇటీవలి కాలంలో మాకు హిందీ తెలియదంటూ తమిళులు పెడుతున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఉత్తరాది డామినేషన్ పై చలనం వచ్చింది. ఉత్తరాది ఆధిపత్యంపై కన్నడ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో ఒక్కరు కూడా దక్షిణాదికి చెందిన వారు లేకపోవడాన్ని కుమార స్వామి విమర్శించారు.

12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి 16 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ద్రవిడ సంస్కృతి తెలిసిన దక్షిణాదివారు, కన్నడవారు కానీ లేరు. ఆ కమిటీలో దక్షిణాదికి ప్రాధాన్యత లేకపోవడంపై కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు.

ఇది చాలా బాధాకరమన్న కుమార స్వామి….ఆ కమిటీలో కనీసం ఒక్క మహిళకూ చోటు దక్కలేదన్నారు. దక్షిణాదికి చోటు లేకుండా ‘సంపూర్ణ భారతీయ సంస్కృతి’పై అధ్యయనం చేయడం ఏమిటని కుమార స్వామి ప్రశ్నించారు. సంపూర్ణ భారతీయ సంస్కృతిఅంటూ దక్షిణాదికి చోటివ్వకపోవడంపై కుమార స్వామి అడిగిన లాజిక్ కు కేంద్రం , ఉత్తరాది నేతలు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on September 21, 2020 5:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago