Political News

పింఛ‌ను దారులు ల‌క్కీ.. నెల‌కు 4 వేలు!

రాజ‌కీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియ‌దు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాల‌కు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా కేవ‌లం నెల‌కు ప్ర‌భుత్వం అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను మొత్తంపై ఆధార‌ప‌డే అవ్వ‌లు, తాత‌లు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఇప్పుడు ఏపీలో పండ‌గే పండ‌గ‌. ఈ నెల 1వ తేదీ వ‌ర‌కు కూడా.. రూ.3000 మాత్ర‌మే పింఛ‌ను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000ల‌కు చేరుకున్నారు.

ఇక‌, నుంచి ప్ర‌తినెలా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను కింద ప్ర‌తి ఒక్క‌రికీ రూ.4000 చొప్పున అంద‌నుంది. నిజానికి 2019 వ‌ర‌కు రూ.2000 మాత్ర‌మే ఉంది. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాము అధికారంలోకి వ‌స్తే.. విడ‌త‌ల వారీగా రూ.3000ల‌కు ఈ పింఛ‌ను మొత్తాన్ని పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జ‌న‌వ‌రి నాటికి పింఛ‌ను దారుల సొమ్ము రూ.3000ల‌కు చేరుకుంది. అది కూడా ప్ర‌తినెలా ప్ర‌భుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.

ఇక‌, తాజా ఎన్నికల్లో చంద్ర‌బాబు ఈ పింఛ‌ను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వ‌స్తే.. రూ.4000ల‌కు ఒకేసారి పెంచుతామ‌ని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామ‌న్నారు. పెరిగిన మొత్తాన్ని క‌లిపి జూలై 1న ప్ర‌తి పింఛ‌ను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామ‌న్నారు. దీంతో పింఛ‌ను దారులు చంద్ర‌బాబును విశ్వ‌సించారు. ఫ‌లితంగా అఖండ మెజారిటీ ద‌క్కింది. వీరి విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా చంద్ర‌బాబు తాజాగా పింఛ‌ను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

అవును! గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 60 ల‌క్ష‌ల మంది సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధి దారుల‌కు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచ‌డంతో ఈ భారం మరో వెయ్యి కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి.. పింఛ‌ను మొత్తం పెంపుపై సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 14, 2024 10:39 am

Share

Recent Posts

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…

13 minutes ago

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

26 minutes ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

1 hour ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

4 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

9 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

12 hours ago