Political News

పింఛ‌ను దారులు ల‌క్కీ.. నెల‌కు 4 వేలు!

రాజ‌కీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియ‌దు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాల‌కు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా కేవ‌లం నెల‌కు ప్ర‌భుత్వం అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను మొత్తంపై ఆధార‌ప‌డే అవ్వ‌లు, తాత‌లు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఇప్పుడు ఏపీలో పండ‌గే పండ‌గ‌. ఈ నెల 1వ తేదీ వ‌ర‌కు కూడా.. రూ.3000 మాత్ర‌మే పింఛ‌ను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000ల‌కు చేరుకున్నారు.

ఇక‌, నుంచి ప్ర‌తినెలా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను కింద ప్ర‌తి ఒక్క‌రికీ రూ.4000 చొప్పున అంద‌నుంది. నిజానికి 2019 వ‌ర‌కు రూ.2000 మాత్ర‌మే ఉంది. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాము అధికారంలోకి వ‌స్తే.. విడ‌త‌ల వారీగా రూ.3000ల‌కు ఈ పింఛ‌ను మొత్తాన్ని పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జ‌న‌వ‌రి నాటికి పింఛ‌ను దారుల సొమ్ము రూ.3000ల‌కు చేరుకుంది. అది కూడా ప్ర‌తినెలా ప్ర‌భుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.

ఇక‌, తాజా ఎన్నికల్లో చంద్ర‌బాబు ఈ పింఛ‌ను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వ‌స్తే.. రూ.4000ల‌కు ఒకేసారి పెంచుతామ‌ని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామ‌న్నారు. పెరిగిన మొత్తాన్ని క‌లిపి జూలై 1న ప్ర‌తి పింఛ‌ను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామ‌న్నారు. దీంతో పింఛ‌ను దారులు చంద్ర‌బాబును విశ్వ‌సించారు. ఫ‌లితంగా అఖండ మెజారిటీ ద‌క్కింది. వీరి విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా చంద్ర‌బాబు తాజాగా పింఛ‌ను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

అవును! గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 60 ల‌క్ష‌ల మంది సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధి దారుల‌కు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచ‌డంతో ఈ భారం మరో వెయ్యి కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి.. పింఛ‌ను మొత్తం పెంపుపై సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 14, 2024 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago