Political News

పింఛ‌ను దారులు ల‌క్కీ.. నెల‌కు 4 వేలు!

రాజ‌కీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియ‌దు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాల‌కు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా కేవ‌లం నెల‌కు ప్ర‌భుత్వం అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను మొత్తంపై ఆధార‌ప‌డే అవ్వ‌లు, తాత‌లు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఇప్పుడు ఏపీలో పండ‌గే పండ‌గ‌. ఈ నెల 1వ తేదీ వ‌ర‌కు కూడా.. రూ.3000 మాత్ర‌మే పింఛ‌ను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000ల‌కు చేరుకున్నారు.

ఇక‌, నుంచి ప్ర‌తినెలా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను కింద ప్ర‌తి ఒక్క‌రికీ రూ.4000 చొప్పున అంద‌నుంది. నిజానికి 2019 వ‌ర‌కు రూ.2000 మాత్ర‌మే ఉంది. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాము అధికారంలోకి వ‌స్తే.. విడ‌త‌ల వారీగా రూ.3000ల‌కు ఈ పింఛ‌ను మొత్తాన్ని పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జ‌న‌వ‌రి నాటికి పింఛ‌ను దారుల సొమ్ము రూ.3000ల‌కు చేరుకుంది. అది కూడా ప్ర‌తినెలా ప్ర‌భుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.

ఇక‌, తాజా ఎన్నికల్లో చంద్ర‌బాబు ఈ పింఛ‌ను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వ‌స్తే.. రూ.4000ల‌కు ఒకేసారి పెంచుతామ‌ని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామ‌న్నారు. పెరిగిన మొత్తాన్ని క‌లిపి జూలై 1న ప్ర‌తి పింఛ‌ను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామ‌న్నారు. దీంతో పింఛ‌ను దారులు చంద్ర‌బాబును విశ్వ‌సించారు. ఫ‌లితంగా అఖండ మెజారిటీ ద‌క్కింది. వీరి విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా చంద్ర‌బాబు తాజాగా పింఛ‌ను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

అవును! గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 60 ల‌క్ష‌ల మంది సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధి దారుల‌కు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచ‌డంతో ఈ భారం మరో వెయ్యి కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి.. పింఛ‌ను మొత్తం పెంపుపై సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 14, 2024 10:39 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

53 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

1 hour ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

8 hours ago