రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు.
ఇక, నుంచి ప్రతినెలా సామాజిక భద్రతా పింఛను కింద ప్రతి ఒక్కరికీ రూ.4000 చొప్పున అందనుంది. నిజానికి 2019 వరకు రూ.2000 మాత్రమే ఉంది. అయితే.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే.. విడతల వారీగా రూ.3000లకు ఈ పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జనవరి నాటికి పింఛను దారుల సొమ్ము రూ.3000లకు చేరుకుంది. అది కూడా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఈ పింఛను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వస్తే.. రూ.4000లకు ఒకేసారి పెంచుతామని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామన్నారు. పెరిగిన మొత్తాన్ని కలిపి జూలై 1న ప్రతి పింఛను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దీంతో పింఛను దారులు చంద్రబాబును విశ్వసించారు. ఫలితంగా అఖండ మెజారిటీ దక్కింది. వీరి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంతకం చేయడం గమనార్హం.
అవును! గత ప్రభుత్వం రాష్ట్రంలోని 60 లక్షల మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధి దారులకు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచడంతో ఈ భారం మరో వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి.. పింఛను మొత్తం పెంపుపై సంతకం చేయడం గమనార్హం.
This post was last modified on June 14, 2024 10:39 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…