Political News

పింఛ‌ను దారులు ల‌క్కీ.. నెల‌కు 4 వేలు!

రాజ‌కీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియ‌దు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాల‌కు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా కేవ‌లం నెల‌కు ప్ర‌భుత్వం అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను మొత్తంపై ఆధార‌ప‌డే అవ్వ‌లు, తాత‌లు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఇప్పుడు ఏపీలో పండ‌గే పండ‌గ‌. ఈ నెల 1వ తేదీ వ‌ర‌కు కూడా.. రూ.3000 మాత్ర‌మే పింఛ‌ను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000ల‌కు చేరుకున్నారు.

ఇక‌, నుంచి ప్ర‌తినెలా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను కింద ప్ర‌తి ఒక్క‌రికీ రూ.4000 చొప్పున అంద‌నుంది. నిజానికి 2019 వ‌ర‌కు రూ.2000 మాత్ర‌మే ఉంది. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాము అధికారంలోకి వ‌స్తే.. విడ‌త‌ల వారీగా రూ.3000ల‌కు ఈ పింఛ‌ను మొత్తాన్ని పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జ‌న‌వ‌రి నాటికి పింఛ‌ను దారుల సొమ్ము రూ.3000ల‌కు చేరుకుంది. అది కూడా ప్ర‌తినెలా ప్ర‌భుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.

ఇక‌, తాజా ఎన్నికల్లో చంద్ర‌బాబు ఈ పింఛ‌ను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వ‌స్తే.. రూ.4000ల‌కు ఒకేసారి పెంచుతామ‌ని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామ‌న్నారు. పెరిగిన మొత్తాన్ని క‌లిపి జూలై 1న ప్ర‌తి పింఛ‌ను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామ‌న్నారు. దీంతో పింఛ‌ను దారులు చంద్ర‌బాబును విశ్వ‌సించారు. ఫ‌లితంగా అఖండ మెజారిటీ ద‌క్కింది. వీరి విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా చంద్ర‌బాబు తాజాగా పింఛ‌ను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

అవును! గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 60 ల‌క్ష‌ల మంది సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధి దారుల‌కు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచ‌డంతో ఈ భారం మరో వెయ్యి కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి.. పింఛ‌ను మొత్తం పెంపుపై సంత‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 14, 2024 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

54 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago