రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు.
ఇక, నుంచి ప్రతినెలా సామాజిక భద్రతా పింఛను కింద ప్రతి ఒక్కరికీ రూ.4000 చొప్పున అందనుంది. నిజానికి 2019 వరకు రూ.2000 మాత్రమే ఉంది. అయితే.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే.. విడతల వారీగా రూ.3000లకు ఈ పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జనవరి నాటికి పింఛను దారుల సొమ్ము రూ.3000లకు చేరుకుంది. అది కూడా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఈ పింఛను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వస్తే.. రూ.4000లకు ఒకేసారి పెంచుతామని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామన్నారు. పెరిగిన మొత్తాన్ని కలిపి జూలై 1న ప్రతి పింఛను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దీంతో పింఛను దారులు చంద్రబాబును విశ్వసించారు. ఫలితంగా అఖండ మెజారిటీ దక్కింది. వీరి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంతకం చేయడం గమనార్హం.
అవును! గత ప్రభుత్వం రాష్ట్రంలోని 60 లక్షల మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధి దారులకు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచడంతో ఈ భారం మరో వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి.. పింఛను మొత్తం పెంపుపై సంతకం చేయడం గమనార్హం.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…