రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు.
ఇక, నుంచి ప్రతినెలా సామాజిక భద్రతా పింఛను కింద ప్రతి ఒక్కరికీ రూ.4000 చొప్పున అందనుంది. నిజానికి 2019 వరకు రూ.2000 మాత్రమే ఉంది. అయితే.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే.. విడతల వారీగా రూ.3000లకు ఈ పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జనవరి నాటికి పింఛను దారుల సొమ్ము రూ.3000లకు చేరుకుంది. అది కూడా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఈ పింఛను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వస్తే.. రూ.4000లకు ఒకేసారి పెంచుతామని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామన్నారు. పెరిగిన మొత్తాన్ని కలిపి జూలై 1న ప్రతి పింఛను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దీంతో పింఛను దారులు చంద్రబాబును విశ్వసించారు. ఫలితంగా అఖండ మెజారిటీ దక్కింది. వీరి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంతకం చేయడం గమనార్హం.
అవును! గత ప్రభుత్వం రాష్ట్రంలోని 60 లక్షల మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధి దారులకు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచడంతో ఈ భారం మరో వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి.. పింఛను మొత్తం పెంపుపై సంతకం చేయడం గమనార్హం.
This post was last modified on June 14, 2024 10:39 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…