రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు.
ఇక, నుంచి ప్రతినెలా సామాజిక భద్రతా పింఛను కింద ప్రతి ఒక్కరికీ రూ.4000 చొప్పున అందనుంది. నిజానికి 2019 వరకు రూ.2000 మాత్రమే ఉంది. అయితే.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే.. విడతల వారీగా రూ.3000లకు ఈ పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జనవరి నాటికి పింఛను దారుల సొమ్ము రూ.3000లకు చేరుకుంది. అది కూడా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఈ పింఛను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వస్తే.. రూ.4000లకు ఒకేసారి పెంచుతామని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామన్నారు. పెరిగిన మొత్తాన్ని కలిపి జూలై 1న ప్రతి పింఛను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దీంతో పింఛను దారులు చంద్రబాబును విశ్వసించారు. ఫలితంగా అఖండ మెజారిటీ దక్కింది. వీరి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంతకం చేయడం గమనార్హం.
అవును! గత ప్రభుత్వం రాష్ట్రంలోని 60 లక్షల మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధి దారులకు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచడంతో ఈ భారం మరో వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి.. పింఛను మొత్తం పెంపుపై సంతకం చేయడం గమనార్హం.
This post was last modified on June 14, 2024 10:39 am
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…