Political News

వైసీపీకి క‌లిసి రాని ‘విజ‌యవాడ‌’ ..!


రాజ‌కీయ నేత‌ల‌కుకొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉన్న‌ట్టే.. పార్టీల‌కు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి సెంటిమెంట్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి. పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. వైసీపీ మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాల్లో గ‌త 2019లో 22 చోట్ల విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, మూడు చోట్ల మాత్ర‌మే టీడీపీ గెలిచింది. అయితే.. ప్ర‌స్తుతం వైసీపీ నాలుగు స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. గెలుపు ఓట‌ములు రాజ‌కీయాల్లో స‌హ‌జం.

కానీ, ఒక కీల‌క‌మైన పార్ల‌మెంటుస్థానంలో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోలేదు. అంతేకాదు.. ఆ నియోజ‌కవర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థులు త‌ర్వాత రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది వైసీపీకి క‌లిసిరాలేదా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. 2014లో తొలిసారి వైసీసీ పూర్తిస్థాయిలో పార్ల‌మెంటుస్థానాల‌కు పోటీ చేసింది. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లో ఉన్న ఎంపీ సీటును ద‌క్కించుకోలేకపోయారు.

ఆనాటి ఎన్నికల్లో ప్ర‌ముఖ వ్యాపార వేత్త కోనేరు రాజేంద్ర‌ప్ర‌సాద్ పోటీ చేశారు. భారీగానే డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. కానీ, ఆయ‌న ఓడిపోయారు. స‌రే.. ఓట‌మి, గెలుపు స‌హ‌జ‌మే అనుకున్నా.. ఆయ‌న త‌ర్వాత కాలం లో రాజ‌కీయాల‌నూ వ‌దిలేశారు. క‌ట్ చేస్తే.. 2019లో బరిలో దిగిన ప్ర‌ముఖ నిర్మాత‌, వ్యాపార వేత్త పీవీపీ ఓటమి చవిచూశారు. ఆయ‌న కూడా భారీగానే ఖ‌ర్చు చేశారు. కానీ, ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. అయితే.. ఆ తర్వాత పీవీపీ రాజకీయాలకు కూడా దూరం అయ్యారు.

ఇదే క్రమంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈయ‌న 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యవాడ ఎంపీగా పోటీ చేశారు. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఏం జ‌రిగిందో ఏమో.. ఈ ఎన్నిక‌ల‌కు ముందు కేశినేని వైసీపీలో చేరారు. అనంత‌రం ఆయ‌న‌కు విజ‌యవాడ ఎంపీ టికెట్ కేటాయించారు. ఆ వెంట‌నే ఆయ‌న రంగంలోకి దిగారు సిట్టింగ్ ఎంపీగా ఆయ‌న ఎన్నో ప‌నులు చేశార‌ని అనేక మంది చెప్పారు. కేంద్ర‌మే కితాబు ఇచ్చింది.

అయినా.. కేశినేని ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈంతో ఆయ‌న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని ప్రకటించిన విషయం తెలిసిందే. క‌ట్ చేస్తే.. వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ ఎంపీలుగా పోటి చేసిన వారు ఓడిపోవ‌డ‌మే కాకుండా.. రాజ‌కీయ స‌న్యాసం కూడా తీసుకోవ‌డం చూస్తే.. ఈసీటు వైసీపీకి క‌లిసి రావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 11, 2024 8:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago