Political News

అమరావతిపై పవన్ లో ఇంత గందరగోళమా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో సేమ్ కన్ఫ్యూజన్ కంటిన్యు అవుతోంది. ఏ విషయంలో అయినా స్ధిరమైన అభిప్రాయాలు లేకపోవటమే మొదటినుండి పవన్ లో ఉన్న అతిపెద్ద లోపం. తాజాగా ’మూడు రాజధానులు నమ్మకద్రోహమే’ అనే హెడ్డింగ్ తో ప్రముఖ దినపత్రిక ఈనాడు పవన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో తన అభిప్రాయాలు చెప్పిన పవన్ తనలోని అయోమయాన్ని మరోసారి బయటపెట్టారు. నిజానికి పవన్ ఇంటర్వ్యూని బ్యానర్ హెడ్డింగ్ గా ప్రచురించినా అందులో విషయమే లేదని అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ తో మాట్లాడించినట్లు అర్ధమైపోతోంది.

ఇంటర్వ్యూలో ఒకచోట అమరావతిపై రాష్ట్రంలోని మిగిలిన చోట్ల స్పందన ఎలాగుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తు అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు వాణిజ్యనమూనాగా చిత్రీకరించారని చెప్పారు. అందుకనే మిగిలిన ప్రాంతాల వారు అమరావతికి దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని అన్నీ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా ? అనే ప్రశ్నకు సంబంధం లేని సమాధానం చెప్పి తప్పించుకున్నారు.

ప్రతిపక్ష నేత హోదా అమరావతికి జగన్ అంగీకరించి ఇపుడు కాదని చెప్పటం అన్యాయమని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. అమరావతికి జగన్ మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ రైతుల నుండి భూమిని సమీకరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పవన్ ఆ మాట మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ భూముల్లోనే రాజధానిని నిర్మించమని జగన్ చేసిన సూచనను చంద్రబాబునాయుడు, పవన్ ఎందుకు పట్టించుకోవటం లేదు ? పైగా అమరావతిలో జగన్ రెడ్డి ఇల్లు కట్టుకున్న కారణంగానే పెట్టుబడులు వచ్చాయని చెప్పటం మరింత విచిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ను చూసి అమరావతికి పెట్టుబడులు వచ్చాయా ? అసలు అమరావతికి వచ్చిన పెట్టుబడులు ఏమిటో పవన్ చెప్పగలరా ?

ఒకపుడు ఇదే పవన్ కర్నూలుకు వెళ్ళి రాష్ట్రానికి రాజధాని అమరావతే అయినా తన వరకు కర్నూలే రాజధాని అని బహిరంగ సభలో చెప్పారు. అలాగే మరోసారి వైజాగ్ వెళ్ళినపుడు విశాఖపట్నాన్నే రాజధానిగా చేయాలని చేసిన డిమాండ్ ను పవన్ మరచిపోయినట్లున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో జనాలు రోడ్లపైకి వచ్చినట్లే అమరావతి విషయంలో కూడా జనాలు బయటకు రావాలని పిలుపిచ్చారు. పిలుపు వరకు బాగానే ఉంది కానీ మరి అమరావతి కోసం జనాలు ఎందుకు రోడ్లపైకి రాలేదు ? ఆ విషయాన్ని పవన్ ఆలోచించారా ? చంద్రబాబు పదే పదే పిలుపిస్తున్నా జనాలు కాదు కదా కనీసం పార్టీ నేతలు కూడా ఎందుకు రోడ్డెక్క లేదు ?

This post was last modified on September 20, 2020 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

5 minutes ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

1 hour ago

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

1 hour ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

1 hour ago

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

1 hour ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

3 hours ago