Political News

వైసిపి ఓటింగ్ 16 శాతం పడిపోయిందా ?

పార్టీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబునాయుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అదేమిటంటే అధికార వైసిపికి 16 శాతం మంది జనాలు దూరమైనట్లు చెప్పారు. ప్రజల మద్దతును ప్రభుత్వంలో ఉన్న వైసిపి 16 శాతం కోల్పోయినట్లు చంద్రబాబు చెప్పగానే నేతలంతా ఆశ్చర్యపోయారు.

సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బిసిలే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయుండచ్చు. మరలాంటపుడు ఎస్సీ, ఎస్టీ, బిసిల్లో మాత్రమే అధికంగా వ్యతిరేకత కనబడుతోందని, ఆ వర్గాలు మాత్రమే ప్రభుత్వానికి దూరమైనట్లు చంద్రబాబు చెప్పడం వెనుక 2019లో వారిలో ఎక్కువమంది జగన్ పార్టీకి మద్దతు వేసినట్లు చంద్రబాబు అర్థం చేసుకున్నారు అనుకోవాలి.

నిజానికి 16 శాతం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత పెద్ద శాతం జనాలు ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకమయ్యారో కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పై వర్గాల వాళ్ళపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయట. అందుకనే పై వర్గాలంతా ప్రభుత్వానికి దూరమైపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పనితీరుపైన చంద్రబాబు ఏమైనా సర్వే చేయించారా ? ప్రభుత్వంపై జనాభిప్రాయాన్ని టిడిపి ఏమైనా సేకరించిందా ? లేకపోతే ఈ పనులు చేయటానికి చంద్రబాబు ఏదైనా ఏజెన్సీని నియమించారా ? అన్న విషయాల్లో స్పష్టత లేదు.

పార్టీ నేతలతో మాట్లాడుతు 16 శాతం జనాలు దూరమైనట్లు మాత్రమే చెప్పారు. అందుకు తన దగ్గరున్న ఆధారం ఏమిటో కూడా చెప్పుంటే బాగుండేది. బహుశా ఎన్నికలకు ముందు చంద్రబాబు తరపున రాష్ట్రంలో సర్వే చేసిన సంస్థలు ఏమైనా తాజాగా సర్వే చేశాయా? అన్నది ఒక ప్రశ్న. వాటిని కూడా బయటపెట్టి ఉంటే ఈ విషయం మరింతగా సంచలనం అయ్యేది.

This post was last modified on September 20, 2020 2:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago