Political News

బీజేపీ విష‌యంలో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజ‌మైంది!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా ద‌క్కించుకుంటుందని .. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చారంలో బీజేపీ అగ్ర నేత‌లు ఊద‌ర గొట్టారు. దేశ‌వ్యాప్తంగా 62 రోజులపాటు జ‌రిగిన ప్ర‌చా రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్క‌డ మాట్లాడినా.. ఏటీవీవి ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంట‌రిగానే 370 సీట్లు.. ఇక‌, ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌కు మ‌రో 30కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోస్యాలువ ల్లించారు.

దీంతో కేంద్రంలో ఏర్ప‌డే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప‌క్షాల‌కు 400 ల‌కు పైగానే సీట్లు వ‌స్తాయ‌ని.. దేశం మొత్తం త‌మ వైపే ఉంద‌ని కూడా ప్ర‌ధాని మోడీ అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత మెజారిటీ ఎవ‌రికీ రాలేద‌ని.. కానీ, ఈ సారి త‌మ‌కు వ‌స్తుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా ర‌ని.. 5 ల‌క్ష‌ల ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తాము సృష్టించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు. మ‌రిన్ని బ‌ల‌మైన నిర్ణ‌యాల‌ను కూడా తీసుకునేందుకు ఈ 400ల‌కు పైగా మెజారిటీ త‌మ‌కు దోహ‌ద ప‌డుతుంద‌న్నారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని ప‌దే ప‌దే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్య‌లను అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు కొట్టి పారేశారు. కానీ, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. బీజేపీకి దేశ‌వ్యాప్తంగా ఒంట‌రిగా వ‌చ్చిన స్థానాలు 240 మాత్ర‌మే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు త‌గ్గిపోయాయి. గ‌త 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు త‌గ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టే 240కి ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

3 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

6 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

8 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

9 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

9 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

9 hours ago