Political News

బీజేపీ విష‌యంలో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజ‌మైంది!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా ద‌క్కించుకుంటుందని .. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చారంలో బీజేపీ అగ్ర నేత‌లు ఊద‌ర గొట్టారు. దేశ‌వ్యాప్తంగా 62 రోజులపాటు జ‌రిగిన ప్ర‌చా రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్క‌డ మాట్లాడినా.. ఏటీవీవి ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంట‌రిగానే 370 సీట్లు.. ఇక‌, ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌కు మ‌రో 30కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోస్యాలువ ల్లించారు.

దీంతో కేంద్రంలో ఏర్ప‌డే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప‌క్షాల‌కు 400 ల‌కు పైగానే సీట్లు వ‌స్తాయ‌ని.. దేశం మొత్తం త‌మ వైపే ఉంద‌ని కూడా ప్ర‌ధాని మోడీ అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత మెజారిటీ ఎవ‌రికీ రాలేద‌ని.. కానీ, ఈ సారి త‌మ‌కు వ‌స్తుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా ర‌ని.. 5 ల‌క్ష‌ల ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తాము సృష్టించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు. మ‌రిన్ని బ‌ల‌మైన నిర్ణ‌యాల‌ను కూడా తీసుకునేందుకు ఈ 400ల‌కు పైగా మెజారిటీ త‌మ‌కు దోహ‌ద ప‌డుతుంద‌న్నారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని ప‌దే ప‌దే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్య‌లను అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు కొట్టి పారేశారు. కానీ, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. బీజేపీకి దేశ‌వ్యాప్తంగా ఒంట‌రిగా వ‌చ్చిన స్థానాలు 240 మాత్ర‌మే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు త‌గ్గిపోయాయి. గ‌త 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు త‌గ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టే 240కి ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 8, 2024 6:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

20 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

29 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago