సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా దక్కించుకుంటుందని .. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు ఊదర గొట్టారు. దేశవ్యాప్తంగా 62 రోజులపాటు జరిగిన ప్రచా రంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్కడ మాట్లాడినా.. ఏటీవీవి ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు.. ఇక, ఎన్డీయే మిత్ర పక్షాలకు మరో 30కి పైగా సీట్లు వస్తాయని జోస్యాలువ ల్లించారు.
దీంతో కేంద్రంలో ఏర్పడే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలకు 400 లకు పైగానే సీట్లు వస్తాయని.. దేశం మొత్తం తమ వైపే ఉందని కూడా ప్రధాని మోడీ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇంత మెజారిటీ ఎవరికీ రాలేదని.. కానీ, ఈ సారి తమకు వస్తుందని అన్నారు. అంతేకాదు.. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా రని.. 5 లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తాము సృష్టించనున్నామని చెప్పుకొచ్చారు. మరిన్ని బలమైన నిర్ణయాలను కూడా తీసుకునేందుకు ఈ 400లకు పైగా మెజారిటీ తమకు దోహద పడుతుందన్నారు.
అయితే.. ఇదేసమయంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వస్తాయని పదే పదే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్యలను అప్పట్లో బీజేపీ నేతలు కొట్టి పారేశారు. కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీకి దేశవ్యాప్తంగా ఒంటరిగా వచ్చిన స్థానాలు 240 మాత్రమే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి. గత 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు తగ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే 240కి పరిమితం కావడం గమనార్హం.
This post was last modified on June 8, 2024 6:43 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…