సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా దక్కించుకుంటుందని .. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు ఊదర గొట్టారు. దేశవ్యాప్తంగా 62 రోజులపాటు జరిగిన ప్రచా రంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్కడ మాట్లాడినా.. ఏటీవీవి ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు.. ఇక, ఎన్డీయే మిత్ర పక్షాలకు మరో 30కి పైగా సీట్లు వస్తాయని జోస్యాలువ ల్లించారు.
దీంతో కేంద్రంలో ఏర్పడే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలకు 400 లకు పైగానే సీట్లు వస్తాయని.. దేశం మొత్తం తమ వైపే ఉందని కూడా ప్రధాని మోడీ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇంత మెజారిటీ ఎవరికీ రాలేదని.. కానీ, ఈ సారి తమకు వస్తుందని అన్నారు. అంతేకాదు.. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా రని.. 5 లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తాము సృష్టించనున్నామని చెప్పుకొచ్చారు. మరిన్ని బలమైన నిర్ణయాలను కూడా తీసుకునేందుకు ఈ 400లకు పైగా మెజారిటీ తమకు దోహద పడుతుందన్నారు.
అయితే.. ఇదేసమయంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వస్తాయని పదే పదే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్యలను అప్పట్లో బీజేపీ నేతలు కొట్టి పారేశారు. కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీకి దేశవ్యాప్తంగా ఒంటరిగా వచ్చిన స్థానాలు 240 మాత్రమే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి. గత 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు తగ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే 240కి పరిమితం కావడం గమనార్హం.
This post was last modified on June 8, 2024 6:43 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…