Political News

బీజేపీ విష‌యంలో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజ‌మైంది!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా ద‌క్కించుకుంటుందని .. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చారంలో బీజేపీ అగ్ర నేత‌లు ఊద‌ర గొట్టారు. దేశ‌వ్యాప్తంగా 62 రోజులపాటు జ‌రిగిన ప్ర‌చా రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్క‌డ మాట్లాడినా.. ఏటీవీవి ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంట‌రిగానే 370 సీట్లు.. ఇక‌, ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌కు మ‌రో 30కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోస్యాలువ ల్లించారు.

దీంతో కేంద్రంలో ఏర్ప‌డే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప‌క్షాల‌కు 400 ల‌కు పైగానే సీట్లు వ‌స్తాయ‌ని.. దేశం మొత్తం త‌మ వైపే ఉంద‌ని కూడా ప్ర‌ధాని మోడీ అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత మెజారిటీ ఎవ‌రికీ రాలేద‌ని.. కానీ, ఈ సారి త‌మ‌కు వ‌స్తుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా ర‌ని.. 5 ల‌క్ష‌ల ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తాము సృష్టించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు. మ‌రిన్ని బ‌ల‌మైన నిర్ణ‌యాల‌ను కూడా తీసుకునేందుకు ఈ 400ల‌కు పైగా మెజారిటీ త‌మ‌కు దోహ‌ద ప‌డుతుంద‌న్నారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని ప‌దే ప‌దే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్య‌లను అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు కొట్టి పారేశారు. కానీ, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. బీజేపీకి దేశ‌వ్యాప్తంగా ఒంట‌రిగా వ‌చ్చిన స్థానాలు 240 మాత్ర‌మే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు త‌గ్గిపోయాయి. గ‌త 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు త‌గ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టే 240కి ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 8, 2024 6:43 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

18 minutes ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

18 minutes ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

22 minutes ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

1 hour ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

1 hour ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

1 hour ago