Political News

బీజేపీ విష‌యంలో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజ‌మైంది!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా ద‌క్కించుకుంటుందని .. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చారంలో బీజేపీ అగ్ర నేత‌లు ఊద‌ర గొట్టారు. దేశ‌వ్యాప్తంగా 62 రోజులపాటు జ‌రిగిన ప్ర‌చా రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్క‌డ మాట్లాడినా.. ఏటీవీవి ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంట‌రిగానే 370 సీట్లు.. ఇక‌, ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌కు మ‌రో 30కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోస్యాలువ ల్లించారు.

దీంతో కేంద్రంలో ఏర్ప‌డే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప‌క్షాల‌కు 400 ల‌కు పైగానే సీట్లు వ‌స్తాయ‌ని.. దేశం మొత్తం త‌మ వైపే ఉంద‌ని కూడా ప్ర‌ధాని మోడీ అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత మెజారిటీ ఎవ‌రికీ రాలేద‌ని.. కానీ, ఈ సారి త‌మ‌కు వ‌స్తుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా ర‌ని.. 5 ల‌క్ష‌ల ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తాము సృష్టించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు. మ‌రిన్ని బ‌ల‌మైన నిర్ణ‌యాల‌ను కూడా తీసుకునేందుకు ఈ 400ల‌కు పైగా మెజారిటీ త‌మ‌కు దోహ‌ద ప‌డుతుంద‌న్నారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని ప‌దే ప‌దే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్య‌లను అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు కొట్టి పారేశారు. కానీ, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. బీజేపీకి దేశ‌వ్యాప్తంగా ఒంట‌రిగా వ‌చ్చిన స్థానాలు 240 మాత్ర‌మే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు త‌గ్గిపోయాయి. గ‌త 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు త‌గ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టే 240కి ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 8, 2024 6:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

17 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago