ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్లో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ బాబుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో అటు బాబు, ఇటు టీడీపీ శ్రేణుల ఆనందానికి అంతేలేదు. ఈ సంతోషంలోనే ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏపీలో తిరిగి అధికారం దక్కింది. ఇకపై తెలంగాణలోనూ తిరిగి పుంజుకునే దిశగా టీడీపీని నడిపించాలన్నది బాబు లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ కూడా పుంజుకునే ప్రయత్నాలను గట్టిగానే చేస్తోంది. మరోవైపు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో, తాజాగా లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో బీఆర్ఎస్ పతనం వేగంగా సాగుతోంది. ఆ పార్టీ ఉనికే తీవ్రమైన ప్రమాదంలో పడింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే కూటమి కారణంగా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. ఇదే పొత్తును తెలంగాణలోనూ కొనసాగిస్తే తిరిగి పుంజుకునే ఆస్కారముందన్నది విశ్లేషకుల అంచనా. బాబు కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం దిశగా ఇక్కడి టీడీపీ నాయకులతో బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో తిరిగి పుంజుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఇక్కడ టీడీపీలోని కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు కానీ క్షేత్రస్థాయిలో ఇంకా క్యాడర్ ఉందని బాబు నమ్ముతున్నారు. వాళ్లకు తాను ఉన్నాననే భరోసా కల్పించాలని చూస్తున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన టీడీపీ నాయకులు కూడా తిరిగొస్తారనే నమ్మకంతో బాబు ఉన్నట్లు తెలిసింది. ముందుగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిని నియమించి, ఆ తర్వాత ప్రత్యేక వ్యూహంతో సాగాలని బాబు అనుకుంటున్నట్లు టాక్.
This post was last modified on June 7, 2024 5:14 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…