ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్లో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ బాబుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో అటు బాబు, ఇటు టీడీపీ శ్రేణుల ఆనందానికి అంతేలేదు. ఈ సంతోషంలోనే ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏపీలో తిరిగి అధికారం దక్కింది. ఇకపై తెలంగాణలోనూ తిరిగి పుంజుకునే దిశగా టీడీపీని నడిపించాలన్నది బాబు లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ కూడా పుంజుకునే ప్రయత్నాలను గట్టిగానే చేస్తోంది. మరోవైపు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో, తాజాగా లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో బీఆర్ఎస్ పతనం వేగంగా సాగుతోంది. ఆ పార్టీ ఉనికే తీవ్రమైన ప్రమాదంలో పడింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే కూటమి కారణంగా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. ఇదే పొత్తును తెలంగాణలోనూ కొనసాగిస్తే తిరిగి పుంజుకునే ఆస్కారముందన్నది విశ్లేషకుల అంచనా. బాబు కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం దిశగా ఇక్కడి టీడీపీ నాయకులతో బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో తిరిగి పుంజుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఇక్కడ టీడీపీలోని కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు కానీ క్షేత్రస్థాయిలో ఇంకా క్యాడర్ ఉందని బాబు నమ్ముతున్నారు. వాళ్లకు తాను ఉన్నాననే భరోసా కల్పించాలని చూస్తున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన టీడీపీ నాయకులు కూడా తిరిగొస్తారనే నమ్మకంతో బాబు ఉన్నట్లు తెలిసింది. ముందుగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిని నియమించి, ఆ తర్వాత ప్రత్యేక వ్యూహంతో సాగాలని బాబు అనుకుంటున్నట్లు టాక్.
This post was last modified on June 7, 2024 5:14 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…