జనసేన అధినేత పవన్ కల్యాణ్పై బీజేపీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ అంటే.. గాలికాదని.. అదొక సునామీ అని కొనియాడారు. తాజాగా.. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీయే కూటమి పార్టీల సమావేశం జరిగింది. దీనిలో తదుపరి ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీనే ఎన్నుకున్నారు. ఈ సమయంలో పవన్ మాట్లాడుతూ.. మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఉన్నంత కాలం.. ఏ దేశం ముందు.. భారత్ తల వంచదని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఈ దేశానికి మోడీ వంటి నాయకుడు ప్రధాని కావడం.. అత్యంత గర్వ కారణమని పేర్కొన్నా రు. అనంతరం మాట్లాడిన మోడీ.. పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కల్యాణ్ అంటే పవనం(గాలి) కాదని… సునామీ అని ప్రశంసించారు. ఏపీ ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి చరిత్రాత్మక విజయం నమోదు చేసుకందని. ఈ విషయంలో చంద్రబాబుతో పాటు.. పవన్ పాత్ర ఎంతో ఉందని తెలిపారు.
పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి.. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఘనత పవన్ ఒక్కరిదేనని తెలిపారు. పవన్ కల్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షం లోనే ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల విజన్ తనకు తెలుసునని పేర్కొన్నారు. సుపరిపాలన అందించేందుకు ఎన్డీయే కూటమి నిరంతరం కృషి చేస్తుందని మోడీ చెప్పారు. ఎన్డీయే కూటమి పార్టీలు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తాయని మోడీ పేర్కొన్నారు.
కాగా.. ఏపీలో పవన్ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 విజయం సాధించారు. అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి(మచిలీపట్నం, కాకినాడ) రెండు చోట్లా గెలుపు గుర్రం ఎక్కడంతో ఎన్డీయే కూటమి పార్టీలు కూడా.. ఆసక్తిగా ఆ విషయాన్ని పంచుకున్నాయి. పలువురు ఉత్తరాది యువ నాయకులు, ఎంపీలు… పవన్తో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
This post was last modified on June 7, 2024 3:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…