హైదరాబాద్ను విశ్వ నగరంగా పాలకులు తెగ పొగిడేస్తుంటారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఎంత అభివృద్ధి సాధిస్తే ఏముంది.. ఒక భారీ వర్షం వస్తే నగరం సగం మునిగిపోతుంది.
రోడ్ల మీద నీటి కుంటలు కనిపిస్తాయి. తాజా వర్షాలకు టోలిచౌకి ప్రాంతం చెరువులా మారిన దృశ్యాలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఐతే ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులే అని కొట్టి పడేయడానికి కూడా లేదు.
ఏటా వర్షా కాలంలో కొన్ని ఘోర ప్రమాదాలు చోటు చేసుకుని.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. తాజాగా నగరంలోని నేరేడ్మెట్ దీన్దయాళ్ కాలనీలో సుమేధా కపూరియా అనే పన్నెండేళ్ల బాలిక హైదరాబాద్ వర్షాల ధాటికి ప్రాణాలు కోల్పోయింది.
మ్యాన్ హోళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఆ పాప ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. ఈ అమ్మాయి శుక్రవారం సాయంత్రం తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్లింది. ఆ సమయంలోనే భారీ వర్షం మొదలైంది. కాసేపటికే వీధులన్నీ జలమయం అయ్యాయి. ఆ పాప తన సైకిల్లో ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా.. మ్యాన్ హోల్ తెరిచి ఉన్న సంగతి తెలియక అందులో పడిపోయింది.
ఎంతసేపటికీ తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుమేధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీం వచ్చి గాలింపు చేపట్టారు. చివరికి సుమేధా ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువులో బాలిక మృత దేహం లభ్యమైంది. పూర్తిగా రంగు తిరిగి విగతజీవురాలిగా మారిన తన కూతుర్ని చూసి ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది.
తన కూతురు ప్రాణం పోవడానికి ముందు ఆ కొన్ని నిమిషాలు ఎంత విలవిలలాడి ఉంటుందో అంటూ ఆయన మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురి లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డాలని.. నాలాల వద్ద రక్షణ కల్పించారని ఆయన ఏడుస్తూ వేడుకున్నారు. ఇప్పటికైనా నాలాల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టడం, వర్షపు నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు చేపట్టడం అత్యవసరం.
This post was last modified on September 20, 2020 9:59 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…