Political News

హైదరాబాద్ డొల్లతనాన్ని చెప్పిన ఆ విషాదం

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా పాలకులు తెగ పొగిడేస్తుంటారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఎంత అభివృద్ధి సాధిస్తే ఏముంది.. ఒక భారీ వర్షం వస్తే నగరం సగం మునిగిపోతుంది.

రోడ్ల మీద నీటి కుంటలు కనిపిస్తాయి. తాజా వర్షాలకు టోలిచౌకి ప్రాంతం చెరువులా మారిన దృశ్యాలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఐతే ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులే అని కొట్టి పడేయడానికి కూడా లేదు.

ఏటా వర్షా కాలంలో కొన్ని ఘోర ప్రమాదాలు చోటు చేసుకుని.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. తాజాగా నగరంలోని నేరేడ్‌మెట్‌ దీన్‌దయాళ్‌ కాలనీలో సుమేధా కపూరియా అనే పన్నెండేళ్ల బాలిక హైదరాబాద్ వర్షాల ధాటికి ప్రాణాలు కోల్పోయింది.

మ్యాన్ హోళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఆ పాప ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. ఈ అమ్మాయి శుక్రవారం సాయంత్రం తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్లింది. ఆ సమయంలోనే భారీ వర్షం మొదలైంది. కాసేపటికే వీధులన్నీ జలమయం అయ్యాయి. ఆ పాప తన సైకిల్లో ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా.. మ్యాన్ హోల్ తెరిచి ఉన్న సంగతి తెలియక అందులో పడిపోయింది.

ఎంతసేపటికీ తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుమేధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీం వచ్చి గాలింపు చేపట్టారు. చివరికి సుమేధా ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువులో బాలిక మృత దేహం లభ్యమైంది. పూర్తిగా రంగు తిరిగి విగతజీవురాలిగా మారిన తన కూతుర్ని చూసి ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది.

తన కూతురు ప్రాణం పోవడానికి ముందు ఆ కొన్ని నిమిషాలు ఎంత విలవిలలాడి ఉంటుందో అంటూ ఆయన మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురి లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డాలని.. నాలాల వద్ద రక్షణ కల్పించారని ఆయన ఏడుస్తూ వేడుకున్నారు. ఇప్పటికైనా నాలాల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టడం, వర్షపు నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు చేపట్టడం అత్యవసరం.

This post was last modified on September 20, 2020 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

24 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago