‘ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను. నేను ప్రజల సొమ్మును తింటున్నాను అనే బాధ్యతను ప్రతి క్షణం గుర్తుంచుకోవాలనే ఈ జీతం తీసుకుంటున్నాను. నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే ఈ జీతం తీసుకుంటున్నాను. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను. ఇంతకు వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.
చట్టాలు చేసేవాళ్లు అంటే ఎలా ఉండాలో చూపిద్దాం. పార్లమెంటుకు వెళ్లేది పరిచయాల కోసం కాదు. ప్రజల కోసం పని చేయడానికి అని గుర్తుంచుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. రక్తం ధారపోసిన జనసైనికులు, గడప దాటని వీర మహిళలు మన పార్టీని గెలిపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండేటువంటి విజయం సాధించాం అని గుర్తు చేశారు.
ఇల్లు అలకగానే పండుగ కాదు. పండుగ చేసుకునే సమయం కూడా కాదు. ఇది బాధ్యతతో ఉండాల్సిన సమయం. విజయంతో వచ్చే అతిశయం వద్దు. పార్టీలో కూడా ఎవ్వరూ పెట్టుకోవద్దు అని పవన్ హెచ్చరించారు. కేంద్రంలో కీలక భాగం కాబోతున్నాం. ఎంపీలు ఉదయ్, బాలశౌరీలకు చాలా బాధ్యత ఉంది. ఢిల్లీలో జనసేన ఎంపీల కదలికలను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఏపీ ప్రజల తరపున లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు.
This post was last modified on June 5, 2024 5:24 pm
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…