Political News

త‌మిళ ఎంపీల‌తో మ‌నోళ్ల‌కు క్లాసిప్పించాల్సిందే!!

మ‌న‌లో మ‌నం ఎన్ని అనుకున్నా.. పొరుగువారి ముందు మాత్రం మ‌న ఐక్య‌త చాటాల‌నే సూత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగ‌వుతోంది. ఎక్క‌డ వేదిక దొరికినా.. అది ఏపీనా.. ఢిల్లీనా.. అనే తేడా లేకుండా వైసీపీ-టీడీపీ నేత‌లు జుట్టూ జుట్టూ ప‌ట్టుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం ఏర్ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా .. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. అధికార ప‌క్షం విమ‌ర్శించుకోవ‌డం, త‌ప్పుల‌ను ఎత్తి చూపించుకోవ‌డం తెలిసిందే. ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉన్న‌దే.

కానీ, అదే రాష్ట్రానికి సంబంధించి.. ప‌రాయి రాష్ట్రం లేదా.. కేంద్రం నుంచి స‌హ‌కారం లోపించిన‌ప్పుడు.. లేదా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వారి వ‌ల్ల విఘాతం ఏర్ప‌డుతున్నప్పుడు.. స్వ‌ప‌క్షం.. విప‌క్షం అనే తేడా లేకుండా ఒక్క‌టై పోవ‌డం స‌హ‌జం. ఇరు ప‌క్షాలూ క‌లిసి సాధించి.. స‌ద‌రు ల‌బ్ధిని ఉమ్మ‌డిగా ఖాతాలో వేసుకుంటారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు .. వామ‌ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి వెళ్లి.. ఆయ‌న కేంద్రంలోని కాంగ్రెస్ స‌ర్కారును నిల‌దీసిన సంద‌ర్భాలు ఉన్నాయి. రాష్ట్రానికి ల‌బ్ధి చేకూర్చిన ఘ‌ట‌న‌లు కూడా క‌నిపించాయి. కానీ, రానురాను ఈ త‌ర‌హా రాజ‌కీయాలు మారిపోయి.. స్వార్థ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతోంది.

త‌మిళ‌నాడును తీసుకుంటే.. అక్క‌డి రాష్ట్ర ప్ర‌యోజనాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడాల్సి వ‌స్తే.. స్వ‌ప‌క్ష-విప‌క్ష స‌భ్యులు పార్ల‌మెంటులో ఒకే తాటిపైకి వ‌చ్చేస్తారు. హిందీతో కూడిన‌ త్రిభాషా సూత్రం కావొచ్చు, కావేరీ జ‌ల వివాదం కావొచ్చు.. పార్ల‌మెంటులో మాట్లాడాల్సి వ‌స్తే.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం అనేది మ‌న‌కు క‌నిపించ‌దు. క‌ర్ణాట‌క‌లోనూ దాదాపు రెండు మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్తితే ఉంది. కానీ, ఎటొచ్చీ.. ఏపీ ప‌రిస్థితి మాత్రం నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. టీడీపీ – వైసీపీ ఎంపీలు.. ఢిల్లీని కూడా ఏపీని చేసేస్తున్నారు.

సంయుక్తంగా రాష్ట్ర డిమాండ్ల‌పై పోరాడాల్సిన ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌నే ధోర‌ణితోనే ముందుకు సాగుతున్నారు. ఒక‌రికి ఒకరు అడ్డుతగులుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో సంయుక్తంగా పోరాడితే.. ప్ర‌త్యేక హోదా స‌హా నిధులు కూడా ఎన్న‌డో వ‌చ్చేవ‌న్న విజ్ఞుల మాట‌ల‌ను కూడా వారు ప‌ట్టించుకోవ‌డంలేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ ఇదే మాట చెప్పారు. హోదా విష‌యంలో క‌లిసి పోరాడ‌దాం.. అంటే.. బాబు ఒప్పుకోలేదు. ఇక‌, అప్ప‌టి నుంచి ఎవ‌రిదారి వారిదే. అయితే, ఈ క్ర‌మంలో ఇది ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చూకూర్చ‌క‌పోగా..కేంద్రానికి ఆట‌విడుపుగా మారింది. దీంతో మ‌న ఎంపీల‌కు త‌మిళ‌నాడు ఎంపీలతో క్లాస్ ఇప్పిస్తే.. కొంతైనా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on September 20, 2020 12:17 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

సుకుమార్ సినిమా.. అసిస్టెంట్ డైరెక్ష‌న్

సుకుమార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో న‌టించిన‌పుడు చిన్న స‌న్నివేశ‌మైనా స‌రే సుక్కునే తీయాల్సి…

11 mins ago

రోజా కామెంట్ల‌కు గెట‌ప్ శీను స‌మాధానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన జ‌బ‌ర్ద‌స్త్ షోలో స్కిట్లు చేసే క‌మెడియ‌న్ల‌తో ఆమెకు మంచి…

1 hour ago

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

13 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

13 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

14 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

15 hours ago