విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని పరిస్థితి. ప్రతి నెలా అప్పులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమికి అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పథకాలతోనే కష్టం అంటే.. కూటమి ఇంకా పెద్ద హామీలు ఇచ్చింది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది.. మరోవైపు రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తుంది.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా గాడిలో పెడుతుంది అన్నది ప్రశ్నార్థకం.
ఐతే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వెంటనే కాకపోయినా.. రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడులు పెరగడం ఖాయం. తద్వారా ఆదాయం, ఉపాధి పెరగొచ్చు. దీంతో పాటుగా సంపద సృష్టికి, ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలు వెతకాలి. ఐతే రాష్ట్రం కొంచెం కుదురుకునే వరకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం చాలా అవసరం. ఒకవేళ మోడీ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించి ఉంటే.. నిధులు తెచ్చుకోవడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు టీడీపీ, జనసేనల మీద ఆధారపడుతోంది.
టీడీపీ లేదా జనతాదళ్.. ఈ రెంటిలో ఏది మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ సర్కారుకు కష్టం కాబట్టి.. ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వాటి డిమాండ్లను తీర్చాల్సిందే. ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వాలి. అలాగే ప్రాజెక్టులకు సాయం అందించాలి. ఇది చంద్రబాబు సర్కారుకు పెద్ద ఊరట కాబోతోంది. కేంద్రం నుంచి సహకారంలో ఉంటే కొంతలో కొంత ఉపశమనం ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు ఇమేజ్, ఆయన శ్రమ కూడా తోడైతే.. ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే.
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…