విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని పరిస్థితి. ప్రతి నెలా అప్పులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమికి అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పథకాలతోనే కష్టం అంటే.. కూటమి ఇంకా పెద్ద హామీలు ఇచ్చింది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది.. మరోవైపు రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తుంది.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా గాడిలో పెడుతుంది అన్నది ప్రశ్నార్థకం.
ఐతే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వెంటనే కాకపోయినా.. రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడులు పెరగడం ఖాయం. తద్వారా ఆదాయం, ఉపాధి పెరగొచ్చు. దీంతో పాటుగా సంపద సృష్టికి, ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలు వెతకాలి. ఐతే రాష్ట్రం కొంచెం కుదురుకునే వరకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం చాలా అవసరం. ఒకవేళ మోడీ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించి ఉంటే.. నిధులు తెచ్చుకోవడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు టీడీపీ, జనసేనల మీద ఆధారపడుతోంది.
టీడీపీ లేదా జనతాదళ్.. ఈ రెంటిలో ఏది మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ సర్కారుకు కష్టం కాబట్టి.. ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వాటి డిమాండ్లను తీర్చాల్సిందే. ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వాలి. అలాగే ప్రాజెక్టులకు సాయం అందించాలి. ఇది చంద్రబాబు సర్కారుకు పెద్ద ఊరట కాబోతోంది. కేంద్రం నుంచి సహకారంలో ఉంటే కొంతలో కొంత ఉపశమనం ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు ఇమేజ్, ఆయన శ్రమ కూడా తోడైతే.. ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే.
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…