ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఉదయం 10:30 వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఎన్డీఏ కూటమి మొత్తంగా 145 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 145 స్థానాల్లో టీడీపీ 122, జనసేన 18, బీజేపీ 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు మొదలుబెట్టాయి.
ఇక, గుడివాడ, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీలు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థులు ఆ రెండు నియోజకవర్గాలలో లీడ్ లో ఉండడంతో తమ ఓటమి ఖాయమని భావించే వారిద్దరూ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on June 4, 2024 10:45 am
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…