తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉన్నపళంగా డిక్లరేషన్ అవసరం లేదన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని ఐవైఆర్ ట్వీట్ చేశారు.
ఈ నిబంధన ఈనాటిది కాదని, ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతోందని ఐవైఆర్ అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నపుడు తిరమలను దర్శించుకున్నానని, ఆ సమయంలో దర్శనానికి వచ్చిన విదేశీయుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి అనుమతించారని ఐవైఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో సోనియా గాంధీ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ పై చర్చ జరిగిందన్నారు. ఆ విషయంలో నాటి కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కావాలని పట్టుబట్టడంతో కొందరు నేతల ఆగ్రహం వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. ఇపుడు హఠాత్తుగా ఈ మార్పునకు కారణమేంటో టీటీడీ చైర్మన్ చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
కాగా, తిరుమలను సందర్భించిన జగన్ ఏనాడు డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. తాజాగా, ఈ నెల 23న తిరుమల బ్రహ్మాత్సవాల్లో శ్రీవారికి జగన్ పట్టుబట్టలు పెట్టబోతోన్న నేపథ్యంలోనే హడావిడిగా ఈ రూల్ తెచ్చారన్న వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే అంతర్వేది సహా బెజవాడ కనకదుర్గ ఘటనల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇపుడు తిరుమల విషయంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
This post was last modified on September 19, 2020 7:42 pm
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…
తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…