Political News

శ్రీవారికి ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని లేదు: ఐవైఆర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉన్నపళంగా డిక్లరేషన్ అవసరం లేదన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని ఐవైఆర్ ట్వీట్ చేశారు.

ఈ నిబంధన ఈనాటిది కాదని, ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతోందని ఐవైఆర్ అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నపుడు తిరమలను దర్శించుకున్నానని, ఆ సమయంలో దర్శనానికి వచ్చిన విదేశీయుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి అనుమతించారని ఐవైఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో సోనియా గాంధీ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ పై చర్చ జరిగిందన్నారు. ఆ విషయంలో నాటి కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కావాలని పట్టుబట్టడంతో కొందరు నేతల ఆగ్రహం వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. ఇపుడు హఠాత్తుగా ఈ మార్పునకు కారణమేంటో టీటీడీ చైర్మన్ చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.

కాగా, తిరుమలను సందర్భించిన జగన్ ఏనాడు డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. తాజాగా, ఈ నెల 23న తిరుమల బ్రహ్మాత్సవాల్లో శ్రీవారికి జగన్ పట్టుబట్టలు పెట్టబోతోన్న నేపథ్యంలోనే హడావిడిగా ఈ రూల్ తెచ్చారన్న వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే అంతర్వేది సహా బెజవాడ కనకదుర్గ ఘటనల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇపుడు తిరుమల విషయంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

This post was last modified on September 19, 2020 7:42 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago