ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటి లేదు. ఓవైపు జోరుగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటం ఎలా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వందల కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేయాల్సి ఉంటుంది.
దాన్ని భరించే శక్తి చాలా దేశాలకు లేదు. దీంతో.. ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ఒక ప్రశ్న అయితే.. వ్యాక్సిన్ డెలివరీ అంత చిన్న విషయం కాదంటున్నారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ప్రయోగం సక్సెస్ అయి.. దాని ఫార్ములాను ఫార్మా కంపెనీలకు ఇచ్చేసి ఉత్పత్తి షురూ చేయటం ఒక ఎత్తు అయితే.. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎలా డెలివరీ చేస్తారన్నది అసలు ప్రశ్న.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో 28 సంస్థలు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన డోసుల లెక్క చూస్తే.. వందల కోట్ల డోసులు అవసరం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 780 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో మనిషికి ఒక డోసు చొప్పున లెక్క చూసుకున్నా.. వ్యాక్సిన్ రవాణా అంత తేలికయ్యే విషయం కాదని చెప్పాలి.
780 కోట్ల మందికి ఒక్క డోసు చొప్పున పంపిణీ చేయాలన్నా.. దాదాపు 8వేల బోయింగ్ జెట్ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు డోసుల చొప్పున వేయాలంటే.. రవానా ఏ స్థాయిలో అవసరమవుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశాల్లో రవాణా కొంత తేలికే అయినా.. పేద దేశాలకు అందుబాటులో తేవటానికి రోడ్ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వ్యాక్సిన్ ను అందరికి అందుబాటులోకి తెచ్చే విషయంలో మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. దీంతో.. వ్యాక్సిన్ రవాణాకు సంబంధించి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. వ్యాక్సిన్ ను కోట్లాది డోసులు కొనుగోలు చేయటం చాలా దేశాల వారికి తమ స్థాయికి మించిన వ్యవహారంగా చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. యూనిసెఫ్ లు లాంటి సంస్థల తోడ్పాటుతోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 19, 2020 7:25 pm
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…