ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటి లేదు. ఓవైపు జోరుగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటం ఎలా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వందల కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేయాల్సి ఉంటుంది.
దాన్ని భరించే శక్తి చాలా దేశాలకు లేదు. దీంతో.. ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ఒక ప్రశ్న అయితే.. వ్యాక్సిన్ డెలివరీ అంత చిన్న విషయం కాదంటున్నారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ప్రయోగం సక్సెస్ అయి.. దాని ఫార్ములాను ఫార్మా కంపెనీలకు ఇచ్చేసి ఉత్పత్తి షురూ చేయటం ఒక ఎత్తు అయితే.. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎలా డెలివరీ చేస్తారన్నది అసలు ప్రశ్న.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో 28 సంస్థలు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన డోసుల లెక్క చూస్తే.. వందల కోట్ల డోసులు అవసరం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 780 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో మనిషికి ఒక డోసు చొప్పున లెక్క చూసుకున్నా.. వ్యాక్సిన్ రవాణా అంత తేలికయ్యే విషయం కాదని చెప్పాలి.
780 కోట్ల మందికి ఒక్క డోసు చొప్పున పంపిణీ చేయాలన్నా.. దాదాపు 8వేల బోయింగ్ జెట్ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు డోసుల చొప్పున వేయాలంటే.. రవానా ఏ స్థాయిలో అవసరమవుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశాల్లో రవాణా కొంత తేలికే అయినా.. పేద దేశాలకు అందుబాటులో తేవటానికి రోడ్ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వ్యాక్సిన్ ను అందరికి అందుబాటులోకి తెచ్చే విషయంలో మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. దీంతో.. వ్యాక్సిన్ రవాణాకు సంబంధించి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. వ్యాక్సిన్ ను కోట్లాది డోసులు కొనుగోలు చేయటం చాలా దేశాల వారికి తమ స్థాయికి మించిన వ్యవహారంగా చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. యూనిసెఫ్ లు లాంటి సంస్థల తోడ్పాటుతోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…