జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన డేట్ ఇది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికారంలోకి వచ్చే పార్టీ తరపున ఓ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇదే. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున జగనే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. మరోవైపు గెలిచేది కూటమినేనని, చంద్రబాబు అదే రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఈ జూన్ 9 డేట్పై అంతటా చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ గెలిస్తే జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించే ప్రోగ్రామ్కు వెళ్లేందుకు టీడీపీ నాయకులూ ఆరెంజ్మెట్స్ చేసుకుంటున్నారు. దీంతో జూన్ 8, 9 తేదీల్లో ఫ్లైట్లు, హోటళ్లు ఫుల్ అయిపోయినట్లు సమాచారం. జగన్ అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ ప్రకటించింది. దీంతో వైసీపీ నాయకులంతా విశాఖకు క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ నగరంలోని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయినట్లు తెలిసింది. విశాఖకు వెళ్లే విమానాల్లోనూ జూన్ 8న ఖాళీ లేదని అంటున్నారు.
మరోవైపు జూన్ 9నే బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ చెప్పంది కానీ అదెక్కడో మాత్రం చెప్పలేదు. కానీ కూటమి గెలిస్తే బాబు అమరావతిలోనే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన టికెట్లన్నీ బుక్ అయిపోయినట్లు చూపిస్తోంది. అక్కడ హోటళ్లలోనూ ఖాళీ లేదు. జూన్ 8న హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నానికి మొత్తం విమాన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరొకొందరు నేతలు రైలు టికెట్లనూ బుక్ చేసుకుంటున్నారు. మరి సీఎం ఎవరవుతారు? ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు? అన్నది జూన్ 4న తేలిపోతుంది.
This post was last modified on May 25, 2024 4:09 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…