జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన డేట్ ఇది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికారంలోకి వచ్చే పార్టీ తరపున ఓ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇదే. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున జగనే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. మరోవైపు గెలిచేది కూటమినేనని, చంద్రబాబు అదే రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఈ జూన్ 9 డేట్పై అంతటా చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ గెలిస్తే జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించే ప్రోగ్రామ్కు వెళ్లేందుకు టీడీపీ నాయకులూ ఆరెంజ్మెట్స్ చేసుకుంటున్నారు. దీంతో జూన్ 8, 9 తేదీల్లో ఫ్లైట్లు, హోటళ్లు ఫుల్ అయిపోయినట్లు సమాచారం. జగన్ అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ ప్రకటించింది. దీంతో వైసీపీ నాయకులంతా విశాఖకు క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ నగరంలోని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయినట్లు తెలిసింది. విశాఖకు వెళ్లే విమానాల్లోనూ జూన్ 8న ఖాళీ లేదని అంటున్నారు.
మరోవైపు జూన్ 9నే బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ చెప్పంది కానీ అదెక్కడో మాత్రం చెప్పలేదు. కానీ కూటమి గెలిస్తే బాబు అమరావతిలోనే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన టికెట్లన్నీ బుక్ అయిపోయినట్లు చూపిస్తోంది. అక్కడ హోటళ్లలోనూ ఖాళీ లేదు. జూన్ 8న హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నానికి మొత్తం విమాన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరొకొందరు నేతలు రైలు టికెట్లనూ బుక్ చేసుకుంటున్నారు. మరి సీఎం ఎవరవుతారు? ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు? అన్నది జూన్ 4న తేలిపోతుంది.
This post was last modified on May 25, 2024 4:09 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…