Political News

చంద్రబాబు సూపర్ అలర్ట్

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. అంతా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్ గురించి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి, గ‌వ‌ర్న‌ర్ కు సైతం బాబు లేఖ‌లు రాశారు. ఆయా లేఖ‌ల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

విష‌యం ఏంటంటే.. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచి లబ్ధిదారులకు ఇవ్వల్సిన నిధులు ఆపి వాటిని వ్యూహాత్మకంగా సరిగ్గా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాలో వేసేందుకు ఏపీలోని జగన్ సర్కారు ప్రయత్నించింది. దీనిని ఎన్నికల సంఘం అడ్డుకుంది. అయితే జగన్ దీనిపై కోర్టుకు వెళ్లారు. పేదలకు డబ్బులు రాకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇపుడే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడానికి అనుమతి ఇవ్వండి అని పదేపదే కోరారు. అయితే నాలుగు రోజులు ఆగి పోలింగ్ తర్వాతి రోజు డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వండని ఎన్నికల సంఘం చెప్పింది. అప్పట్లో లబ్ధిదారులపై అంత ప్రేమ కురిపించను జగన్ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత‌.. ఆస‌రా, రైతు భ‌రోసా కింద ఇన్ పుట్ స‌బ్సిడీ, విద్యా దీవెన నిధులు ఇవ్వాల్సి ఉంద‌ని.. అయితే.. వాటిని ఇవ్వ‌కుండా ఆ నిధుల‌ను త‌నకు నచ్చిన కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల కింద చెల్లేందుకు నిధులు వెచ్చిస్తున్నార‌న్న‌ది చంద్ర‌బాబు ఆరోపించారు.

అప్పుల కింద ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు తెచ్చార‌ని.. అదేవిధంగా బాండ్ల విక్ర‌యం ద్వారా 7000 కోట్లు స‌మీకరించార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ నిధుల‌ను ల‌బ్ధి దారుల ఖాతాల్లో వేయాల్సి ఉంద‌ని తెలిపారు. దీనిపై కోర్టులోనూ ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు పెద్ద ఎత్తున వాద ప్ర‌తివాదాలు జ‌రిగిన విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత ఈ నిధుల‌ను ల‌బ్ధి దారుల ఖాతాల్లో వేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా అనుమ‌తి ఇచ్చింద‌ని.. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం అలా చేయ‌కుండా ఆ నిధుల‌ను త‌న కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల రూపంలో చెల్లించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఇది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఇలా ల‌బ్ధి దారుల సొమ్మును బిల్లుల రూపంలో చెల్లించ‌డాన్ని తాము ఖండిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీనిని త‌క్ష‌ణ‌మే నిలుపుద‌ల చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌కు విన్న‌వించారు. అంతేకాదు.. ఈ విష‌యంపై సీఎస్‌కు కూడా లేఖ రాస్తూ.. ఆ నిధుల‌ను ల‌బ్ధి దారుల ఖాతాల్లో వేయాల‌ని సూచించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కూడా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు ల‌బ్ధి దారుల‌పై ప్రేమ‌ను కుమ్మ‌రించి ఓటు వేశాక బోడి మల్లన్న సామెతలాగ.. నిధుల‌ను బినామీ కాంట్రాక్ట‌ర్ల బిల్లుల‌కు ఎలా వెచ్చిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై గ‌వ‌ర్న‌ర్ ఎలా స్పందిస్తారో.. సీఎస్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago